తమిళంలో కొన్నేళ్ల కిందట సిద్ధార్త్ హీరోగా, బాబీ సింహా విలన్ పాత్రలో యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన ‘జిగర్ తండ’ సినిమా పెద్ద సెన్సేషన్. ఊహించని కథాకథనాలతో సాగే ఈ సినిమా తమిళంలో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఇందులో బాబీ సింహా చేసిన విలన్ పాత్ర ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్లలో ఒకటిగా చెప్పొచ్చు. ఈ సినిమాను తెలుగులో హరీష్ శంకర్ ‘గద్దలకొండ గణేష్’గా రూపొందించాడు.
హీరో వరుణ్ తేజ్తో బాబీ సింహా చేసిన విలన్ పాత్ర చేయించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు హరీష్. తమిళంతో పోలిస్తే మరింత ఎంటర్టైనింగ్గా ఈ పాత్రను మలచడంతో పాటు దానికో లవ్ స్టోరీని కూడా జోడించి నిడివి కూడా పెంచాడు. ఈ ప్రయత్నం తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా హిందీలో ‘బచ్చన్ పాండే’ పేరుతో రీమేక్ కావడం విశేషం. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ట్రైలర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో మాదిరే విలన్ పాత్రనే ఇక్కడ కూడా లీడ్ రోల్గా తీసుకున్నారు.
అక్షయ్ లాంటి టాప్ హీరో ఈ పాత్రను చేయడంతో అక్కడ దీన్ని మరింత డెవలప్ చేసినట్లే కనిపిస్తోంది. వయొలెంట్ లుక్తో అక్షయ్ ఈ పాత్రలో చాలా బాగా కనిపిస్తున్నాడు. పాత్ర కూడా మరింత వయొలెంట్గా మారినట్లే ఉంది. ఐతే తమిళం, తెలుగుతో పోలిస్తే హిందీలో ఓ కీలకమైన మార్పు చేశారు. తమిళంలో సిద్ధు, తెలుగులో అధర్వ చేసిన అప్ కమింగ్ డైరెక్టర్ పాత్రను.. అమ్మాయిగా మార్చేశారు. ఆ పాత్రలో కృతి సనన్ నటించింది. తన వెంటే ఉండే ఫ్రెండ్ పాత్రను అర్షద్ వార్సి చేశాడు.
సౌత్ వెర్షన్లతో పోలిస్తే హిందీలో కామెడీ డోస్ మరింత పెరిగినట్లుంది. కాకపోతే ఆ కామెడీ అంతా కూడా మరీ లౌడ్గా అనిపిస్తోంది. ‘జిగర్ తండ’తో పోలిస్తే హిందీ రీమేక్ రూపు రేఖలే మారిపోయినట్లు కనిపిస్తోంది. ఫర్హద్ సాంజీ రూపొందించిన ఈ చిత్రం.. రోహిత్ శెట్టి చిత్రాలను తలపిస్తోంది. తెలుగులో మాదిరే ప్రధాన పాత్రకు ఒక లవ్ స్టోరీ జోడించారు కానీ.. అందులోనూ మార్పు కనిపిస్తోంది. తన ప్రేయసిని తనే చంపుకున్న క్రూరుడిగా అక్షయ్ను చూపించారు. ఓవరాల్గా చూస్తే సినిమా ఎంటర్టైనింగ్గా అనిపిస్తోంది. మరి హిందీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలి.
This post was last modified on February 18, 2022 8:17 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…