తమిళంలో కొన్నేళ్ల కిందట సిద్ధార్త్ హీరోగా, బాబీ సింహా విలన్ పాత్రలో యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన ‘జిగర్ తండ’ సినిమా పెద్ద సెన్సేషన్. ఊహించని కథాకథనాలతో సాగే ఈ సినిమా తమిళంలో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఇందులో బాబీ సింహా చేసిన విలన్ పాత్ర ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్లలో ఒకటిగా చెప్పొచ్చు. ఈ సినిమాను తెలుగులో హరీష్ శంకర్ ‘గద్దలకొండ గణేష్’గా రూపొందించాడు.
హీరో వరుణ్ తేజ్తో బాబీ సింహా చేసిన విలన్ పాత్ర చేయించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు హరీష్. తమిళంతో పోలిస్తే మరింత ఎంటర్టైనింగ్గా ఈ పాత్రను మలచడంతో పాటు దానికో లవ్ స్టోరీని కూడా జోడించి నిడివి కూడా పెంచాడు. ఈ ప్రయత్నం తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా హిందీలో ‘బచ్చన్ పాండే’ పేరుతో రీమేక్ కావడం విశేషం. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ట్రైలర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో మాదిరే విలన్ పాత్రనే ఇక్కడ కూడా లీడ్ రోల్గా తీసుకున్నారు.
అక్షయ్ లాంటి టాప్ హీరో ఈ పాత్రను చేయడంతో అక్కడ దీన్ని మరింత డెవలప్ చేసినట్లే కనిపిస్తోంది. వయొలెంట్ లుక్తో అక్షయ్ ఈ పాత్రలో చాలా బాగా కనిపిస్తున్నాడు. పాత్ర కూడా మరింత వయొలెంట్గా మారినట్లే ఉంది. ఐతే తమిళం, తెలుగుతో పోలిస్తే హిందీలో ఓ కీలకమైన మార్పు చేశారు. తమిళంలో సిద్ధు, తెలుగులో అధర్వ చేసిన అప్ కమింగ్ డైరెక్టర్ పాత్రను.. అమ్మాయిగా మార్చేశారు. ఆ పాత్రలో కృతి సనన్ నటించింది. తన వెంటే ఉండే ఫ్రెండ్ పాత్రను అర్షద్ వార్సి చేశాడు.
సౌత్ వెర్షన్లతో పోలిస్తే హిందీలో కామెడీ డోస్ మరింత పెరిగినట్లుంది. కాకపోతే ఆ కామెడీ అంతా కూడా మరీ లౌడ్గా అనిపిస్తోంది. ‘జిగర్ తండ’తో పోలిస్తే హిందీ రీమేక్ రూపు రేఖలే మారిపోయినట్లు కనిపిస్తోంది. ఫర్హద్ సాంజీ రూపొందించిన ఈ చిత్రం.. రోహిత్ శెట్టి చిత్రాలను తలపిస్తోంది. తెలుగులో మాదిరే ప్రధాన పాత్రకు ఒక లవ్ స్టోరీ జోడించారు కానీ.. అందులోనూ మార్పు కనిపిస్తోంది. తన ప్రేయసిని తనే చంపుకున్న క్రూరుడిగా అక్షయ్ను చూపించారు. ఓవరాల్గా చూస్తే సినిమా ఎంటర్టైనింగ్గా అనిపిస్తోంది. మరి హిందీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలి.
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…