ఇండస్ట్రీలో తొలి అవకాశం అందుకోవడానికి ముందు దర్శకులు పడే కష్టాలు ఎన్నెన్నో. ఇందుకోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అవకాశాలు వచ్చినట్లేవచ్చి చేజారిపోతాయి. కొన్నిసార్లు సినిమాలు మొదలై కూడా ఆగిపోతాయి. అయినా సరే ఓపికతో మన రోజు కోసం ఎదురు చూడాలి. అవకాశం వచ్చినపుడు తామేంటో రుజువు చేసుకోవాలి. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు.
రాత్రికి రాత్రే జీవితం మారిపోవచ్చు. కొన్నేళ్లలో ఎవ్వరూ ఊహించని స్థాయిని అందుకోవచ్చు. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ది సరిగ్గా ఇలాంటి ప్రయాణమే. నెల్సన్ 12 ఏళ్ల కిందట శింబు హీరోగా ఒక సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాల్సింది. ఈ సినిమాను ప్రకటించాక ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో చాలా ఏళ్ల పాటు ఇంకో అవకాశం దక్కలేదు. చివరికి 2018లో అతను దర్శకుడిగా మారాడు. నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కోలమావు కోకిల’ నెల్సన్ తొలి చిత్రం.
హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం అయినప్పటికీ మంచి ఎంటర్టైన్మెంట్తో సాగిన ఆ చిత్రం ఘనవిజయాన్నందుకుంది. దీంతో శివకార్తికేయన్ హీరోగా ‘డాక్టర్’ చేసే అవకాశం దక్కింది. ఈ సినిమా కొవిడ్ వల్ల బాగా ఆలస్యమైనా సరే.. విడుదలయ్యాక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఐతే ఈ సినిమా విడుదల కాకముందే దిలీప్కు ఒక భారీ అవకాశం వచ్చింది. ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్తో సన్ పిక్చర్స్ లాంటి పెద్ద సంస్థలో ‘బీస్ట్’ లాంటి భారీ చిత్రం చేసే అవకాశం అందుకున్నాడు.
ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోపే దిలీప్ ఇంకా పెద్ద ఛాన్స్ అందుకున్నాడు. సౌత్ దర్శకుల్లో ప్రతి ఒక్కరూ సినిమా చేయాలని ఆశపడే సూపర్ స్టార్ రజినీకాంత్తో జట్టు కట్టబోతున్నాడు. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ వాళ్లే నిర్మిస్తున్నారు. గత కొన్నేళ్లలో రజినీ జోరు తగ్గినప్పటికీ సరైన సినిమా పడితే మళ్లీ ఆయన రైజ్ కావడం ఖాయం. నెల్సన్ లాంటి విలక్షణ దర్శకుడితో రజినీ సినిమా అనగానే అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరి ఈ చిత్రంతో నెల్సన్ ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి.
This post was last modified on February 11, 2022 9:15 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…