ఇండస్ట్రీలో తొలి అవకాశం అందుకోవడానికి ముందు దర్శకులు పడే కష్టాలు ఎన్నెన్నో. ఇందుకోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అవకాశాలు వచ్చినట్లేవచ్చి చేజారిపోతాయి. కొన్నిసార్లు సినిమాలు మొదలై కూడా ఆగిపోతాయి. అయినా సరే ఓపికతో మన రోజు కోసం ఎదురు చూడాలి. అవకాశం వచ్చినపుడు తామేంటో రుజువు చేసుకోవాలి. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు.
రాత్రికి రాత్రే జీవితం మారిపోవచ్చు. కొన్నేళ్లలో ఎవ్వరూ ఊహించని స్థాయిని అందుకోవచ్చు. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ది సరిగ్గా ఇలాంటి ప్రయాణమే. నెల్సన్ 12 ఏళ్ల కిందట శింబు హీరోగా ఒక సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాల్సింది. ఈ సినిమాను ప్రకటించాక ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో చాలా ఏళ్ల పాటు ఇంకో అవకాశం దక్కలేదు. చివరికి 2018లో అతను దర్శకుడిగా మారాడు. నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కోలమావు కోకిల’ నెల్సన్ తొలి చిత్రం.
హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం అయినప్పటికీ మంచి ఎంటర్టైన్మెంట్తో సాగిన ఆ చిత్రం ఘనవిజయాన్నందుకుంది. దీంతో శివకార్తికేయన్ హీరోగా ‘డాక్టర్’ చేసే అవకాశం దక్కింది. ఈ సినిమా కొవిడ్ వల్ల బాగా ఆలస్యమైనా సరే.. విడుదలయ్యాక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఐతే ఈ సినిమా విడుదల కాకముందే దిలీప్కు ఒక భారీ అవకాశం వచ్చింది. ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్తో సన్ పిక్చర్స్ లాంటి పెద్ద సంస్థలో ‘బీస్ట్’ లాంటి భారీ చిత్రం చేసే అవకాశం అందుకున్నాడు.
ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోపే దిలీప్ ఇంకా పెద్ద ఛాన్స్ అందుకున్నాడు. సౌత్ దర్శకుల్లో ప్రతి ఒక్కరూ సినిమా చేయాలని ఆశపడే సూపర్ స్టార్ రజినీకాంత్తో జట్టు కట్టబోతున్నాడు. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ వాళ్లే నిర్మిస్తున్నారు. గత కొన్నేళ్లలో రజినీ జోరు తగ్గినప్పటికీ సరైన సినిమా పడితే మళ్లీ ఆయన రైజ్ కావడం ఖాయం. నెల్సన్ లాంటి విలక్షణ దర్శకుడితో రజినీ సినిమా అనగానే అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరి ఈ చిత్రంతో నెల్సన్ ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి.
This post was last modified on February 11, 2022 9:15 am
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…