ఇండస్ట్రీలో తొలి అవకాశం అందుకోవడానికి ముందు దర్శకులు పడే కష్టాలు ఎన్నెన్నో. ఇందుకోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అవకాశాలు వచ్చినట్లేవచ్చి చేజారిపోతాయి. కొన్నిసార్లు సినిమాలు మొదలై కూడా ఆగిపోతాయి. అయినా సరే ఓపికతో మన రోజు కోసం ఎదురు చూడాలి. అవకాశం వచ్చినపుడు తామేంటో రుజువు చేసుకోవాలి. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు.
రాత్రికి రాత్రే జీవితం మారిపోవచ్చు. కొన్నేళ్లలో ఎవ్వరూ ఊహించని స్థాయిని అందుకోవచ్చు. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ది సరిగ్గా ఇలాంటి ప్రయాణమే. నెల్సన్ 12 ఏళ్ల కిందట శింబు హీరోగా ఒక సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాల్సింది. ఈ సినిమాను ప్రకటించాక ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో చాలా ఏళ్ల పాటు ఇంకో అవకాశం దక్కలేదు. చివరికి 2018లో అతను దర్శకుడిగా మారాడు. నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కోలమావు కోకిల’ నెల్సన్ తొలి చిత్రం.
హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం అయినప్పటికీ మంచి ఎంటర్టైన్మెంట్తో సాగిన ఆ చిత్రం ఘనవిజయాన్నందుకుంది. దీంతో శివకార్తికేయన్ హీరోగా ‘డాక్టర్’ చేసే అవకాశం దక్కింది. ఈ సినిమా కొవిడ్ వల్ల బాగా ఆలస్యమైనా సరే.. విడుదలయ్యాక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఐతే ఈ సినిమా విడుదల కాకముందే దిలీప్కు ఒక భారీ అవకాశం వచ్చింది. ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్తో సన్ పిక్చర్స్ లాంటి పెద్ద సంస్థలో ‘బీస్ట్’ లాంటి భారీ చిత్రం చేసే అవకాశం అందుకున్నాడు.
ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోపే దిలీప్ ఇంకా పెద్ద ఛాన్స్ అందుకున్నాడు. సౌత్ దర్శకుల్లో ప్రతి ఒక్కరూ సినిమా చేయాలని ఆశపడే సూపర్ స్టార్ రజినీకాంత్తో జట్టు కట్టబోతున్నాడు. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ వాళ్లే నిర్మిస్తున్నారు. గత కొన్నేళ్లలో రజినీ జోరు తగ్గినప్పటికీ సరైన సినిమా పడితే మళ్లీ ఆయన రైజ్ కావడం ఖాయం. నెల్సన్ లాంటి విలక్షణ దర్శకుడితో రజినీ సినిమా అనగానే అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరి ఈ చిత్రంతో నెల్సన్ ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి.
This post was last modified on February 11, 2022 9:15 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…