తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. చిన్న చిన్న విలన్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్తో మొదలుపెట్టి.. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ లాంటి మేటి నటులకు దీటుగా నిలిచారాయన. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా ఏ పాత్ర అయినా మోహన్ బాబు చేస్తే దాని విలువ అమాంతం పెరిగిపోతుంది. తెలుగు సినిమా చరిత్రలో ఆయనది ఒక ప్రత్యేక అధ్యాయం.
ఐతే ఇంత మంచి నటుడిని ఈ తరం దర్శకులు ఉపయోగించుకోకపోవడం విచారించాల్సిన విషయమే. మోహన్ బాబును ఎవరూ అడగట్లేదా.. ఆయనే సినిమాలు చేయట్లేదా అన్నది తెలియదు కానీ.. తెలుగు పరిశ్రమ ఒక మంచి నటుడిని దూరం చేసుకుంటున్న మాట మాత్రం వాస్తవం. గత దశాబ్ద కాలంలో మోహన్ బాబు చాలా తక్కువ సినిమాలే చేశారు. అవి కూడా సొంత సంస్థలో, అంతగా విషయం లేనివే.
చివరగా ‘గాయత్రి’ లాంటి పేలవమైన సినిమా చేసిన మోహన్ బాబు.. ఈ మధ్య తమిళంలో సూర్య సినిమా ‘సూరారై పొట్రు’ (ఆకాశమే నీ హద్దురా) చేశారు. మణిరత్నం మూవీ ‘పొన్నియన్ సెల్వన్’లో కూడా నటిస్తున్నట్లు చెబుుతున్నారు. మరి తెలుగు సినిమాల మాటేంటి అని ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబును అడిగితే.. గత కొన్నేళ్లలో తనను కొందరు తెలుగు దర్శకులు కొన్ని పాత్రల కోసం అడిగారని.. కానీ తాను చేయలేదని చెప్పారు.
తాను కావాలనే గ్యాప్ తీసుకున్నానని, మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెడితే 365 రోజులూ పని చేస్తానని ఆయనన్నారు. ప్రస్తుతం ‘పెదరాయుడు’ తరహాలో ఒక భారీ కుటుంబ కథా చిత్రాన్ని తమ సంస్థలోనే చేయాలనుకుంటున్నామని.. అందుకోసం కథ కూడా తయారైందని.. ఆ చిత్రంలో చాలా మంది నటీనటులుంటారని.. ఆ సినిమా వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు మోహన్ బాబు. మరి మంచు వారి బేనర్లో రాబోయే ఆ భారీ చిత్రం ఏదో చూడాలి.
This post was last modified on June 15, 2020 1:59 pm
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను…
"రూపాయి విలువ పడిపోయింది" అనే వార్త చూడగానే.. "మనకేంటిలే, మనం ఇండియాలోనే ఉన్నాం కదా" అని లైట్ తీసుకుంటే పొరపాటే.…
రాయ్పూర్ వేదికగా మరోసారి విరాట్ కోహ్లీ బ్యాట్ గర్జించింది. "కోహ్లీ పని అయిపోయింది, వయసు మీద పడింది" అని విమర్శించే…