మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా `అల వైకుంఠపురంలో`చిత్రంతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఓ చిత్రం చేయాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. దీంతో ఆయన తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రకటించాడు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించబోతోంది. అలాగే ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. `SSMB28` అనే వర్కింగ్ టైటిల్తో ఫిబ్రవరి 3న రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.
ఇకపోతే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఒక రకంగా త్రివిక్రమ్కు ఇది మహేష్ ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి అతడు, ఖలేజా చిత్రాలను చేశారు. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ను అందుకోవడంలో విఫలం అయ్యాయి.
కానీ, బుల్లితెరపై మాత్రం ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్, మహేష్ హ్యాట్రిక్ మూవీ అయినా సూపర్ హిట్ అందుకుంటుందా..? లేదా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ సినిమా రిజల్ట్లో ఏ మాత్రం తేడా వచ్చినా మహేష్ మళ్లీ త్రివిక్రమ్ ముఖం కూడా చూడరని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
This post was last modified on February 8, 2022 12:15 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…