Movie News

త్రివిక్ర‌మ్‌కి ఇదే లాస్ట్ ఛాన్స్‌..

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌ చివ‌రిగా `అల వైకుంఠపురంలో`చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ త‌ర్వాత‌ త్రివిక్ర‌మ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ చిత్రం చేయాల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ అట‌కెక్కింది. దీంతో ఆయ‌న త‌న త‌దుప‌రి చిత్రాన్ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ప్ర‌క‌టించాడు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే హీరోయిన్‌గా క‌నిపించ‌బోతోంది. అలాగే ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. `SSMB28` అనే వర్కింగ్ టైటిల్‌తో ఫిబ్ర‌వ‌రి 3న రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభ‌మైంది.

ఇక‌పోతే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న‌ హ్యాట్రిక్ మూవీ ఇది. ఒక ర‌కంగా త్రివిక్ర‌మ్‌కు ఇది మ‌హేష్ ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఇంత‌కు ముందు వీరిద్ద‌రూ క‌లిసి అత‌డు, ఖలేజా చిత్రాల‌ను చేశారు. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన‌ ఈ రెండు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకోవ‌డంలో విఫ‌లం అయ్యాయి.

కానీ, బుల్లితెర‌పై మాత్రం ఆక‌ట్టుకున్నాయి. ఈ నేప‌థ్యంలోనే త్రివిక్ర‌మ్, మ‌హేష్ హ్యాట్రిక్ మూవీ అయినా సూప‌ర్ హిట్ అందుకుంటుందా..? లేదా..? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఒకవేళ‌ ఈ సినిమా రిజ‌ల్ట్‌లో ఏ మాత్రం తేడా వ‌చ్చినా మ‌హేష్ మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ ముఖం కూడా చూడ‌ర‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది.

This post was last modified on February 8, 2022 12:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇక తెలుగుదేశంలో ‘ ఏఐ ‘ హ‌వా మొద‌లైందా…!

తెలుగు దేశం పార్టీ నిర్వ‌హించే ప‌సుపు పండుగ మ‌హానాడుకు ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో…

59 minutes ago

‘సిరివెన్నెల’కు న్యాయం చేయలేకపోయా – త్రివిక్రమ్

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…

2 hours ago

వీరమల్లు వస్తే ఎవరికి టెన్షన్

హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…

2 hours ago

మీ తీరు మార‌దా?: ‘ఈడీ’పై తొలిసారి సుప్రీంకోర్టు ఆగ్ర‌హం!

కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు చేస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.…

3 hours ago

‘విష’ ప్ర‌చారానికి ప‌నితీరే విరుగుడు బాబు గారూ..!

కూట‌మి ప్ర‌భుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో స‌హ‌జంగానే ప్ర‌భుత్వం ఏం చేసిందన్న విషయంపై చ‌ర్చ జ‌రుగుతుంది. అయితే..…

3 hours ago

ఖాతాలు అప్ డేట్ చేసుకోండి.. ఏపీ స‌ర్కారు ఎనౌన్స్‌మెంట్

"మీ మీ బ్యాంకు ఖాతాల‌ను మ‌రోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని అన్న దాత‌ల‌కు సూచించింది.…

3 hours ago