గానకోకిల, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ ఆస్తులు ఎంతో తెలుసా ? ఆదివారం చనిపోయిన లత ఆస్తులపై ఇపుడు సర్వత్రా ఆసక్తి మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే గానకోకిల వివాహం చేసుకోకపోవటమే. 65 సంవత్సరాలుగా బాలీవుడ్ కేంద్రంగా లత దాదాపు 60 వేల పాటలు పాడారు. కాబట్టి కచ్చితంగా పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించుంటారనటంలో సందేహంలేదు. వివాహం చేసుకోలేదు కాబట్టి వారసులంటు ఎవరు లేరు. అందుకనే ఆమె ఆస్తుల వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి పెరిగిపోతోంది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే లతా మంగేష్కర్ కు సుమారు రు. 200 కోట్లకు పైగానే ఆస్తులున్నాయట. మరిది రిజిస్టర్ విలువా లేకపోతే మార్కెట్ విలువ అనేది తెలీదు. పెద్ద బంగ్లాళాలు, అపార్టమెంట్లు, ఖాళీ స్థలాలు, బ్యాంకుల్లో ఎఫ్ డీలు, కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె పాడిన పాటలపైనే ఏడాదికి సుమారు రు. 6 కోట్లు రాయల్టీ వస్తోందట.
లతాకు ఒక సోదరుడు, ముగ్గురు చెల్లెలు ఉన్నారు. వీరిలో ఆశాభోంస్లే కూడా దశాబ్దాలుగా అన్నీ భాషల్లోను పాటలు పాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే లత – ఆశాకు ఏ మాత్రం పడదు. సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య మాటలు లేవట. ఇక మిగిలిన ముగ్గురి కుటుంబాలను లతాయే చూసుకుంటున్నారట. అందుకనే ఇపుడు లత ఆస్తులు ఎవరికి చెందుతాయి ? ఆమె వీలునామా ఏమన్నా రాశారా అనేది కీలకమైంది.
బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం సంతా పదినాలతో పాటు ఇతరత్రా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆమె లాయర్ ఆస్తులు, వారసులు, భాగ పరిష్కారం లాంటి అన్ని వివరాలను ప్రకటించబోతున్నారట. ప్రముఖుల మరణం తర్వాత ఆస్తుల విషయంలో వివాదాలు, భాగ పరిష్కారం లాంటి విషయాలపై జనాల్లో ఆసక్తి ఉండటం సహజమే కదా. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆస్తులపై ఇలాంటి ఆసక్తే పెరిగిపోయింది. చివరకు కోర్టు జోక్యం చేసుకుని సెటిల్ చేసింది లేండి. మరి లత లాయర్ ఏమి చెబుతారో చూడాల్సిందే.
This post was last modified on February 8, 2022 5:46 pm
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. వాంఖడే వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబయి 12 పరుగుల…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సోమవారం అగ్ని ప్రమాదంలో గాయపడ్డ…
ది రాజా సాబ్ విషయంలో జరుగుతున్న ఆలస్యం, అప్డేట్స్ లేకుండా కనిపిస్తున్న నిర్లిప్తత ఫ్యాన్స్ ని ఫ్రస్ట్రేట్ చేస్తున్న మాట…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ కారు తయారీ సంస్థ కియా మోటార్స్లో సంచలనాత్మక దొంగతనం వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో కొందరు విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరు కాలేకపోయారన్న వార్తలు…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బకు కుదేలైన ఆక్వా రంగానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు…