గానకోకిల, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ ఆస్తులు ఎంతో తెలుసా ? ఆదివారం చనిపోయిన లత ఆస్తులపై ఇపుడు సర్వత్రా ఆసక్తి మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే గానకోకిల వివాహం చేసుకోకపోవటమే. 65 సంవత్సరాలుగా బాలీవుడ్ కేంద్రంగా లత దాదాపు 60 వేల పాటలు పాడారు. కాబట్టి కచ్చితంగా పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించుంటారనటంలో సందేహంలేదు. వివాహం చేసుకోలేదు కాబట్టి వారసులంటు ఎవరు లేరు. అందుకనే ఆమె ఆస్తుల వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి పెరిగిపోతోంది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే లతా మంగేష్కర్ కు సుమారు రు. 200 కోట్లకు పైగానే ఆస్తులున్నాయట. మరిది రిజిస్టర్ విలువా లేకపోతే మార్కెట్ విలువ అనేది తెలీదు. పెద్ద బంగ్లాళాలు, అపార్టమెంట్లు, ఖాళీ స్థలాలు, బ్యాంకుల్లో ఎఫ్ డీలు, కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె పాడిన పాటలపైనే ఏడాదికి సుమారు రు. 6 కోట్లు రాయల్టీ వస్తోందట.
లతాకు ఒక సోదరుడు, ముగ్గురు చెల్లెలు ఉన్నారు. వీరిలో ఆశాభోంస్లే కూడా దశాబ్దాలుగా అన్నీ భాషల్లోను పాటలు పాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే లత – ఆశాకు ఏ మాత్రం పడదు. సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య మాటలు లేవట. ఇక మిగిలిన ముగ్గురి కుటుంబాలను లతాయే చూసుకుంటున్నారట. అందుకనే ఇపుడు లత ఆస్తులు ఎవరికి చెందుతాయి ? ఆమె వీలునామా ఏమన్నా రాశారా అనేది కీలకమైంది.
బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం సంతా పదినాలతో పాటు ఇతరత్రా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆమె లాయర్ ఆస్తులు, వారసులు, భాగ పరిష్కారం లాంటి అన్ని వివరాలను ప్రకటించబోతున్నారట. ప్రముఖుల మరణం తర్వాత ఆస్తుల విషయంలో వివాదాలు, భాగ పరిష్కారం లాంటి విషయాలపై జనాల్లో ఆసక్తి ఉండటం సహజమే కదా. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆస్తులపై ఇలాంటి ఆసక్తే పెరిగిపోయింది. చివరకు కోర్టు జోక్యం చేసుకుని సెటిల్ చేసింది లేండి. మరి లత లాయర్ ఏమి చెబుతారో చూడాల్సిందే.
This post was last modified on February 8, 2022 5:46 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…