అగ్ర దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా ఏడాది కిందట ఒక సినిమాను అనౌన్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జున్ మిత్రుడైన కేదార్ ఈ సినిమాను నిర్మించాల్సింది. అప్పట్లో ఈ సినిమా గురించి ఘనంగా ప్రకటించారు. కానీ హడావుడి అంతా ప్రకటన వరకే. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు అంగుళం కూడా ముందుకు కదిలింది లేదు. ఇటు సుకుమార్, అటు విజయ్ ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు.
ఇద్దరూ ఒక్కసారి కూడా కలిసి తమ కలయికలో రావాల్సిన సినిమా గురించి మాట్లాడుకున్న దాఖలాలు కూడా లేవు. సుకుమార్ పుష్ప సినిమాతో, విజయ్ లైగర్ మూవీతో బిజీగా ఉండబట్టే ఈ ప్రాజెక్టు గురించి చప్పుడు లేదేమో అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టులు రెండూ పూర్తయ్యాక కూడా వీరి కలయికలో సినిమా వచ్చే అవకాశం దాదాపుగా లేదనే అంటున్నారు ఇరువురి సన్నిహితులు.
సుకుమార్, విజయ్ల ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతి చూసినా.. వీరి కాంబినేషన్ అటకెక్కేసినట్లే కనిపిస్తోంది. పుష్ప-2 తర్వాత రామ్ చరణ్తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు సుకుమార్. పైగా తమిళ హీరో విజయ్తోనూ ఓ సినిమా చేసే ఛాన్సున్నట్లు వార్తలొస్తున్నాయి. సుకుమార్ చూపంతా టాప్ హీరోల మీదే ఉందన్నది స్పష్టం. ఇక విజయ్ సంగతి చూస్తే.. ప్రస్తుతం లైగర్ చేస్తున్న పూరీ జగన్నాథ్తోనే ఇంకో సినిమాను ఓకే చేసేశాడంటున్నారు.
లైగర్ అవ్వగానే ఇది పట్టాలెక్కేయబోతోంది. జాన్వి కపూర్ హీరోయిన్గా ఫిక్సయిందట. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కనుందట. అతడికి శివ నిర్వాణతోనూ ఓ కమిట్మెంట్ ఉంది. దాని సంగతి కూడా తేల్చట్లేదు. మొత్తానికి చూస్తుంటే ఇలా ఇద్దరూ వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తున్న సంగతి స్పష్టం. ఇద్దరి లైనప్ చూస్తుంటే సమీప భవిష్యత్తులో కలిసి సినిమా చేయడం సందేహంగానే కనిపిస్తోంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…