యంగ్ హీరోలకు హీరోయిన్స్ని సెట్ చేయడం పెద్ద కష్టం కాదు కానీ సీనియర్ హీరోలతోనే సమస్య. యాభై దాటినా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే హీరోలకి, వారి పర్సనాలిటీకి తగిన హీరోయిన్ని కుదుర్చుకోవడం కాస్త కష్టంగానే ఉంది. ఈ సమస్యను బాలకృష్ణ చాలాకాలంగా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్కి కూడా సేమ్ ప్రాబ్లెమ్ వస్తోంది.
గాడ్ ఫాదర్, భోళాశంకర్ చిత్రాలతో పాటు బాబి, వెంకీ కుడుముల డైరెక్షన్లోనూ సినిమాలు చేయబోతున్నారు చిరంజీవి. ‘ఆచార్య’తో మొదలైన హీరోయిన్ల సమస్య ఈ సినిమాలన్నింటినీ వెంటాడుతోంది. నిజానికి ‘ఆచార్య’ మూవీకి హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలా అని పెద్ద చర్చే జరిగింది. కానీ చిరు ఇమేజ్కి, ఏజ్కి, పర్సనాలిటీకి సూటయ్యే హీరోయిన్ కావాలి కాబట్టి, ‘ఖైదీ నంబర్ 150’లో చేసిన కాజల్నే రిపీట్ చేశారు.
‘గాడ్ఫాదర్’ స్క్రిప్ట్ ప్రకారం హీరోకి జోడీ ఉండదు. కానీ ఇక్కడ ఉన్నది మోహన్లాల్ కాదు, చిరంజీవి. హీరోయిన్ లేకపోతే మెగా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరేమోననే డౌట్తో హీరోయిన్ పాత్రని క్రియేట్ చేస్తున్నాడట మోహన్ రాజా. ఆ క్యారెక్టర్ అనుష్క చేయబోతోందనే వార్తలు ఆమధ్య వచ్చాయి. కానీ టీమ్ అయితే ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. మెహెర్ రమేష్ తీస్తున్న ‘భోళాశంకర్’లో హీరోయిన్గా ‘సైరా’లో నటించిన తమన్నాని రిపీట్ చేస్తున్నారు. బాబి సినిమా కోసం శ్రుతీహాసన్ని తీసుకోనున్నట్లు ఇటీవలే తెలిసింది.
ఇక మిగిలింది వెంకీ చిత్రం. ఈ మూవీలో హీరోయిన్గా అనుష్కని ఫైనల్ చేశారనేది లేటెస్ట్ టాక్. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని కూడా అంటున్నారు. అలా అయితే ‘గాడ్ఫాదర్’ కోసం స్వీటీని సెట్ చేశారనే వార్త నిజం కానట్టేనా? లేక రెండింటిలోనూ అనుష్క యాక్ట్ చేస్తుందా? ప్రస్తుతానికైతే వీటికి ఆన్సర్ లేదు. కానీ అనుష్క పేరైతే స్ట్రాంగ్గా వినిపిస్తోంది. ఆప్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి మెగాస్టార్ సరసన ఏదో ఒక మూవీలో అయితే ఆమె కనిపించడం ఖాయమనిపిస్తోంది.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…