కొన్ని వారాల నుంచి ఇండియన్ బాక్సాఫీస్లో చర్చలన్నీ పుష్ప చుట్టూనే తిరుగుతున్నాయి. డివైడ్ టాక్తో మొదలైన ఈ సినిమా అంచనాల్ని మించి అద్భుత వసూళ్లతో దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడం విశేషం ఏమీ కాదు. కానీ పెద్దగా ప్రమోషన్లేమీ చేయకుండానే హిందీలో ఈ చిత్రం వసూళ్ల మోత మోగిస్తోంది.
తమిళం, మలయాళంలోనూ పుష్పకు భారీ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా హిందీలో పుష్ప రోజు వారీ వసూళ్ల గురించి, ఓవరాల్ ఫిగర్స్ గురించి ఆశ్చర్యపోతున్నారు అక్కడి ట్రేడ్ పండిట్లు. ఐతే ఇలా అందరూ పుష్ప గురించి మాట్లాడుకుంటుంటే.. ఓ సినిమా సైలెంటుగా కలెక్షన్లు కొల్లగొడుతూ సాగుతోంది. ఇప్పుడా సినిమా ఇండియా వసూళ్ల లెక్క చూసి అందరికీ దిమ్మదిరుగుతోంది.
ఆ చిత్రం స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. ఈ సినిమా ఇండియాలో ఇప్పటిదాకా రూ.260 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. పుష్ప మూవీ కంటే ఒక్క రోజు ముందు రిలీజైన స్పైడర్ మ్యాన్ తొలి వారాంతంలోనే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. పుష్ప, 83 చిత్రాల పోటీని తట్టుకుని తర్వాతి రోజుల్లో కూడా నిలకడగా కలెక్షన్లు రాబట్టింది. చూస్తుండగానే కలెక్షన్లు రూ.200 కోట్లు, రూ.250 కోట్లు దాటిపోయాయి.
ఇప్పుడు ఈ సినిమా రూ.300 గ్రాస్ మార్కుపై కన్నేసింది. జెర్సీ, ఆర్ఆర్ఆర్ వాయిదా పడటంతో ఇదేమీ కష్టమైన టార్గెట్ లాగా కనిపించడం లేదు. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ మూవీగా ఇది నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ ఈ సినిమా వసూళ్లు మూడో వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.10 వేల కోట్ల మార్కును దాటేశాయి. మొత్తం కలెక్షన్లు రూ.10,200 కోట్లట. మరి కొన్ని రోజుల పాటు వరల్డ్ వైడ్ స్పైడర్ మ్యాన్ ప్రభంజనం కొనసాగేలాగే కనిపిస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో…
అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రిగా ఇప్పటి వరకు…
పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…