కొన్ని వారాల నుంచి ఇండియన్ బాక్సాఫీస్లో చర్చలన్నీ పుష్ప చుట్టూనే తిరుగుతున్నాయి. డివైడ్ టాక్తో మొదలైన ఈ సినిమా అంచనాల్ని మించి అద్భుత వసూళ్లతో దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడం విశేషం ఏమీ కాదు. కానీ పెద్దగా ప్రమోషన్లేమీ చేయకుండానే హిందీలో ఈ చిత్రం వసూళ్ల మోత మోగిస్తోంది.
తమిళం, మలయాళంలోనూ పుష్పకు భారీ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా హిందీలో పుష్ప రోజు వారీ వసూళ్ల గురించి, ఓవరాల్ ఫిగర్స్ గురించి ఆశ్చర్యపోతున్నారు అక్కడి ట్రేడ్ పండిట్లు. ఐతే ఇలా అందరూ పుష్ప గురించి మాట్లాడుకుంటుంటే.. ఓ సినిమా సైలెంటుగా కలెక్షన్లు కొల్లగొడుతూ సాగుతోంది. ఇప్పుడా సినిమా ఇండియా వసూళ్ల లెక్క చూసి అందరికీ దిమ్మదిరుగుతోంది.
ఆ చిత్రం స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. ఈ సినిమా ఇండియాలో ఇప్పటిదాకా రూ.260 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. పుష్ప మూవీ కంటే ఒక్క రోజు ముందు రిలీజైన స్పైడర్ మ్యాన్ తొలి వారాంతంలోనే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. పుష్ప, 83 చిత్రాల పోటీని తట్టుకుని తర్వాతి రోజుల్లో కూడా నిలకడగా కలెక్షన్లు రాబట్టింది. చూస్తుండగానే కలెక్షన్లు రూ.200 కోట్లు, రూ.250 కోట్లు దాటిపోయాయి.
ఇప్పుడు ఈ సినిమా రూ.300 గ్రాస్ మార్కుపై కన్నేసింది. జెర్సీ, ఆర్ఆర్ఆర్ వాయిదా పడటంతో ఇదేమీ కష్టమైన టార్గెట్ లాగా కనిపించడం లేదు. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ మూవీగా ఇది నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ ఈ సినిమా వసూళ్లు మూడో వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.10 వేల కోట్ల మార్కును దాటేశాయి. మొత్తం కలెక్షన్లు రూ.10,200 కోట్లట. మరి కొన్ని రోజుల పాటు వరల్డ్ వైడ్ స్పైడర్ మ్యాన్ ప్రభంజనం కొనసాగేలాగే కనిపిస్తోంది.
This post was last modified on January 3, 2022 10:20 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…