కొన్ని వారాల నుంచి ఇండియన్ బాక్సాఫీస్లో చర్చలన్నీ పుష్ప చుట్టూనే తిరుగుతున్నాయి. డివైడ్ టాక్తో మొదలైన ఈ సినిమా అంచనాల్ని మించి అద్భుత వసూళ్లతో దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడం విశేషం ఏమీ కాదు. కానీ పెద్దగా ప్రమోషన్లేమీ చేయకుండానే హిందీలో ఈ చిత్రం వసూళ్ల మోత మోగిస్తోంది.
తమిళం, మలయాళంలోనూ పుష్పకు భారీ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా హిందీలో పుష్ప రోజు వారీ వసూళ్ల గురించి, ఓవరాల్ ఫిగర్స్ గురించి ఆశ్చర్యపోతున్నారు అక్కడి ట్రేడ్ పండిట్లు. ఐతే ఇలా అందరూ పుష్ప గురించి మాట్లాడుకుంటుంటే.. ఓ సినిమా సైలెంటుగా కలెక్షన్లు కొల్లగొడుతూ సాగుతోంది. ఇప్పుడా సినిమా ఇండియా వసూళ్ల లెక్క చూసి అందరికీ దిమ్మదిరుగుతోంది.
ఆ చిత్రం స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. ఈ సినిమా ఇండియాలో ఇప్పటిదాకా రూ.260 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. పుష్ప మూవీ కంటే ఒక్క రోజు ముందు రిలీజైన స్పైడర్ మ్యాన్ తొలి వారాంతంలోనే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. పుష్ప, 83 చిత్రాల పోటీని తట్టుకుని తర్వాతి రోజుల్లో కూడా నిలకడగా కలెక్షన్లు రాబట్టింది. చూస్తుండగానే కలెక్షన్లు రూ.200 కోట్లు, రూ.250 కోట్లు దాటిపోయాయి.
ఇప్పుడు ఈ సినిమా రూ.300 గ్రాస్ మార్కుపై కన్నేసింది. జెర్సీ, ఆర్ఆర్ఆర్ వాయిదా పడటంతో ఇదేమీ కష్టమైన టార్గెట్ లాగా కనిపించడం లేదు. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ మూవీగా ఇది నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ ఈ సినిమా వసూళ్లు మూడో వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.10 వేల కోట్ల మార్కును దాటేశాయి. మొత్తం కలెక్షన్లు రూ.10,200 కోట్లట. మరి కొన్ని రోజుల పాటు వరల్డ్ వైడ్ స్పైడర్ మ్యాన్ ప్రభంజనం కొనసాగేలాగే కనిపిస్తోంది.
This post was last modified on January 3, 2022 10:20 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…