ఒక కథానాయికకు కాస్త వయసు మీద పడగానే పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అన్న ప్రశ్నలు మొదలవుతాయి. పెళ్లి చేసుకున్నాకేమో తల్లయ్యేదెప్పుడు తల్లయ్యేదెప్పుడు అని ప్రశ్నలు కురిపిస్తారు. ఐతే కరోనా టైంలో ఉన్నట్లుండి పెళ్లికి రెడీ అయిపోయి అందరికీ పెద్ద షాకిచ్చిన కాజల్ అగర్వాల్.. బిడ్డకు జన్మనిచ్చే విషయంలో ఎక్కువ సమయం ఏమీ తీసుకోలేదు. కరోనా ఫస్ట్ వేవ్ టైంకి పెళ్లి చేసుకున్న ఆమె.. థర్డ్ వేవ్ సమయానికి ప్రెగ్నెంట్ అయిపోయింది.
కాకపోతే ఈ విషయం ఇప్పటిదాకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి.. చేయాల్సి ఉన్న సినిమాలను వదులుకోవడంతోనే కాజల్ ప్రెగ్నెంట్ అనే విషయం ఖరారైపోయింది. కాకపోతే అధికారికంగా ఈ విషయం ఎప్పుడు చెబుతారా అనే అంతా ఎదురు చూశారు. ఐతే దీనిపై స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ.. విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు కాజల్ భర్త గౌతమ్ కిచ్లు.
కొత్త సంవత్సరం ఆరంభమైన సందర్భంగా గౌతమ్.. కాజల్తో కలిసి ఉన్న ఒక అందమైన ఫొటోను షేర్ చేశాడు. అందులో కొద్దిగా కాజల్ బేబీ బంప్ కనిపిస్తోంది. దీనికి తోడు.. ‘‘ఇదిగో 2022.. నీవైపే చూస్తున్నాం’’ అంటూ కామెంట్ పెట్టిన గౌతమ్.. ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని కూడా జోడించాడు. తద్వారా కాజల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. ఐతే ఇలా ఇన్డైరెక్ట్ మెసేజ్లు ఎందుకు.. నేరుగా అనౌన్స్మెంట్ ఇవ్వొచ్చు కదా అని నెటిజన్లు ఆ పోస్టుకు కామెంట్లు పెట్టారు.
మొత్తానికి కెరీర్ మంచి ఊపులో ఉండగానే పెళ్లి చేసుకోవడమే కాదు.. చేతిలో ఉన్న మంచి ప్రాజెక్టులను వదులుకుని మరీ బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవడం ద్వారా కాజల్ తాను ప్రత్యేకమని చాటిచెప్పింది. నాగార్జునతో చేయాల్సిన ‘ఘోస్ట్’తో పాటు.. కమల్ హాసన్ సరసన నటిస్తున్న ‘ఇండియన్-2’ను కూడా కాజల్ వదులుకున్న సంగతి తెలిసిందే. ఆమె లీడ్ రోల్ చేసిన హిందీ మూవీ ‘ఉమ’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
This post was last modified on January 2, 2022 2:16 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…