ఒక కథానాయికకు కాస్త వయసు మీద పడగానే పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అన్న ప్రశ్నలు మొదలవుతాయి. పెళ్లి చేసుకున్నాకేమో తల్లయ్యేదెప్పుడు తల్లయ్యేదెప్పుడు అని ప్రశ్నలు కురిపిస్తారు. ఐతే కరోనా టైంలో ఉన్నట్లుండి పెళ్లికి రెడీ అయిపోయి అందరికీ పెద్ద షాకిచ్చిన కాజల్ అగర్వాల్.. బిడ్డకు జన్మనిచ్చే విషయంలో ఎక్కువ సమయం ఏమీ తీసుకోలేదు. కరోనా ఫస్ట్ వేవ్ టైంకి పెళ్లి చేసుకున్న ఆమె.. థర్డ్ వేవ్ సమయానికి ప్రెగ్నెంట్ అయిపోయింది.
కాకపోతే ఈ విషయం ఇప్పటిదాకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి.. చేయాల్సి ఉన్న సినిమాలను వదులుకోవడంతోనే కాజల్ ప్రెగ్నెంట్ అనే విషయం ఖరారైపోయింది. కాకపోతే అధికారికంగా ఈ విషయం ఎప్పుడు చెబుతారా అనే అంతా ఎదురు చూశారు. ఐతే దీనిపై స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ.. విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు కాజల్ భర్త గౌతమ్ కిచ్లు.
కొత్త సంవత్సరం ఆరంభమైన సందర్భంగా గౌతమ్.. కాజల్తో కలిసి ఉన్న ఒక అందమైన ఫొటోను షేర్ చేశాడు. అందులో కొద్దిగా కాజల్ బేబీ బంప్ కనిపిస్తోంది. దీనికి తోడు.. ‘‘ఇదిగో 2022.. నీవైపే చూస్తున్నాం’’ అంటూ కామెంట్ పెట్టిన గౌతమ్.. ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని కూడా జోడించాడు. తద్వారా కాజల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. ఐతే ఇలా ఇన్డైరెక్ట్ మెసేజ్లు ఎందుకు.. నేరుగా అనౌన్స్మెంట్ ఇవ్వొచ్చు కదా అని నెటిజన్లు ఆ పోస్టుకు కామెంట్లు పెట్టారు.
మొత్తానికి కెరీర్ మంచి ఊపులో ఉండగానే పెళ్లి చేసుకోవడమే కాదు.. చేతిలో ఉన్న మంచి ప్రాజెక్టులను వదులుకుని మరీ బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవడం ద్వారా కాజల్ తాను ప్రత్యేకమని చాటిచెప్పింది. నాగార్జునతో చేయాల్సిన ‘ఘోస్ట్’తో పాటు.. కమల్ హాసన్ సరసన నటిస్తున్న ‘ఇండియన్-2’ను కూడా కాజల్ వదులుకున్న సంగతి తెలిసిందే. ఆమె లీడ్ రోల్ చేసిన హిందీ మూవీ ‘ఉమ’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…