Movie News

జెర్సీ బ్యూటీకి మరో లక్కీ ఛాన్స్

ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేయాలని ప్రతి హీరోయిన్‌కీ ఉంటుంది. ఎందుకంటే సినిమా భారాన్ని మోయగలిగే అవకాశం రావడం అరుదు. ఒకవేళ వస్తే, అందులో సక్సెస్ అయితే రేంజ్ మారిపోతుంది. నటిగా ఎన్నో మెట్లు ఎదిగే అవకాశమూ ఉంటుంది. అందుకే హీరోయిన్లందరూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించే చాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. శ్రద్ధా శ్రీనాథ్ కూడా చేసింది. ఓ సూపర్బ్ చాన్స్ కొట్టేసింది.     

‘జెర్సీ’ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ శ్రద్ధ చాలా మంచి నటి అని పొడిగేశారు. అయితే ప్రశంసలు వచ్చినంతగా అవకాశాలైతే రాలేదు. కొన్ని సినిమాలు చేసినా కోరుకున్న స్థానానికి ఆమెని చేర్చలేదు. కానీ ఇప్పుడు తమిళంలో చేస్తున్న ఓ సినిమా తన కెరీర్‌‌ని మలుపు తిప్పుతుందని నమ్ముతోంది శ్రద్ధ. ఆ సినిమాయే.. కలియుగం.     

కొత్త దర్శకుడు ప్రమోద్ సుందర్‌‌ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. కేఎస్ రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చాలా సైలెంట్‌గా జరిగిపోయింది. తాజాగా ఫైనల్ షెడ్యూల్ మొదలయ్యింది. శ్రద్ధపై కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇదో అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్ అని, ఇండియాలోనే తొలి అపోకలిప్ట్ మూవీ అని చెబుతున్నారు మేకర్స్. జనవరిలో షూటింగ్ కంప్లీటవుతుంది. ఆ తర్వాత వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.        

ఇది కాకుండా ప్రస్తుతం శ్రద్ధ చేతిలో మరో నాలుగు సినిమాలున్నాయి. వాటిలో రెండు కన్నడ, ఒక తమిళ చిత్రం ఉన్నాయి. ఇక నాలుగోది మోహన్‌లాల్ హీరోగా రూపొందుతున్న మలయాళ చిత్రం ‘ఆరట్టు’. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్‌‌గా కనిపించబోతోంది శ్రద్ధ. అయితే ఇవన్నీ ఒకెత్తు, కలియుగం ఒకెత్తు. సినిమా మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది కనుక హిట్టయితే క్రెడిట్ మొత్తం శ్రద్ధకే వెళ్తుంది. కెరీర్‌‌ టర్న్ అవుతుంది. అదే జరిగితే ఆమె టాలెంట్‌కి తగిన ఫలితం దక్కినట్టే. 

This post was last modified on December 28, 2021 1:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago