ఒక కొత్త కాంబినేషన్లో ఓ సినిమా సూపర్ హిట్టో, బ్లాక్బస్టరో అయ్యిందంటే.. మళ్లీ ఆ కాంబినేషన్లో ఇంకో సినిమా పడి తీరాల్సిందే. అలా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న కాంబినేషన్లలో రామ్ చరణ్-సుకుమార్లది ఒకటి. వీళ్లిద్దరూ కలిసి చేసిన తొలి చిత్రం ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయాన్నందుకుందో తెలిసిందే. ఇద్దరి కెరీర్లోనూ ఇది ఏ రకంగా చూసినా బెస్ట్ ఫిలిం అనడంలో సందేహం లేదు. కలెక్షన్ల పరంగా ‘నాన్ బాహుబలి’ ఇండస్ట్రీ హిట్గా నిలవడమే కాదు.. కల్ట్ స్టేటస్ తెచ్చుకుందీ చిత్రం.
ఈ కలయికలో ఇంకో సినిమా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఐతే ఇందుకోసం ఎంతో సమయం ఎదురు చూడాల్సిన పని లేదు. ఇంకో ఏడాదిలోనే వీరి కలయికలో రెండో సినిమా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప’ రిలీజ్ హడావుడిలో ఉన్న సుకుమార్.. దీని తర్వాత ‘పుష్ప-2’ తీయబోతున్నాడు. ఆ చిత్రం వచ్చే ఏడాది ఆఖర్లో రిలీజయ్యే అవకాశాలున్నాయి.ఆ సినిమా ముగించడం ఆలస్యం.. చరణ్తో సుక్కు తన తర్వాతి చిత్రం చేయడానికి చూస్తున్నాడు.
ఈ కాంబినేషన్లో కొత్త సినిమా గురించి దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. సుకుమార్-రామ్ చరణ్ కలయికలో రానున్న కొత్త చిత్రంలో ఓపెనింగ్ సీన్ గురించి తనకు తెలుసన్నాడు.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే బెస్ట్ ఓపెనింగ్ సీన్లలో ఒకటిగా ఇది నిలుస్తుందని జక్కన్ తీర్పివ్వడం విశేషం. అసలు ఈ కాంబినేషన్ గురించి ప్రేక్షకులకు అంచనాలే లేదు. దీని గురించి మీడియాలో వార్తలు కూడా రాలేదు. అలాంటిది ‘రంగస్థలం’ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందని చెప్పడమే కాక.. అందులో ఓపెనింగ్ సీన్ గురించి జక్కన్న ఇచ్చిన ఎలివేషన్ చరణ్, సుకుమార్ అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. శంకర్, గౌతమ్ చిత్రాలు రెండూ పూర్తి చేసి సుకుమార్ సినిమాను చరణ్ మొదలుపెట్టే అవకాశాలున్నాయి.
This post was last modified on December 28, 2021 2:24 pm
వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…
మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం…
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…