ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా ఫస్ట్ పార్ట్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. వసూళ్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. బీ, సీ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు ‘పుష్ప’ పార్ట్ 2 రాబోతుంది. ‘పుష్ప ది రూల్’ అనే పేరుతో సెకండ్ పార్ట్ తెరకెక్కుతోంది.
ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని నిర్మాతలు వెల్లడించారు.
స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉండడంతో ఈసారి సుకుమార్ ఎక్కువ సమయం తీసుకోరని చెబుతున్నారు. ఈ విషయంలో బన్నీకి డెడ్ లైన్ కూడా విధించినట్లు తెలుస్తోంది. వంద రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట సుకుమార్.
2022కి ఎట్టిపరిస్థితుల్లో ‘పుష్ప ది రూల్’ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు సెకండ్ పార్ట్ కి సంబంధించిన సన్నివేశాలను తీయలేదట. మొత్తం కొత్త సినిమాగా దీన్ని తెరకెక్కించాలి. బన్నీ డేట్స్ రెడీగా ఉన్నాయి. విలన్ గా నటించిన ఫహద్ ఫాజిల్ డేట్స్ ఎక్కువగా కావాల్సివుంది. ఆయన మలయాళంలో స్టార్ హీరో కాబట్టి కాస్త బిజీగా ఉంటారు. ఆయన డేట్స్ ని బట్టి మిగిలిన నటీనటుల డేట్స్ ని కూడా ఫిక్స్ చేయనున్నారు.
నిజానికి పార్టీ 2లో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉండేలా కథ రాసుకున్నారట. కానీ ఇప్పుడు దాని డోస్ తగ్గించబోతున్నారని తెలుస్తోంది. అలానే బన్నీ-రష్మికల మధ్య ట్రాక్ పై కూడా వర్క్ చేయాల్సివుంది. కథలో కొన్ని రా సీన్లు ఉండేలా చూసుకుంటున్నాడు సుకుమార్. ఫిబ్రవరి వరకు సమయం ఉంది కాబట్టి సుకుమార్ ఈలోగా స్క్రిప్ట్ ను మరింత పకడ్బందీగా సిద్ధం చేయనున్నారు.
This post was last modified on December 27, 2021 1:26 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…