‘శ్యామ్ సింగ రాయ్’ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా. అతడి మార్కెట్ స్థాయికి మించి ఈ సినిమాకు ఖర్చు పెట్టాడు కొత్త నిర్మాత వెంకట్ బోయనపల్లి. మామూలుగానే ఇది పెద్ద బడ్జెట్ సినిమా కాగా.. కరోనా వల్ల మేకింగ్ ఆలస్యం కావడం.. మధ్యలో వర్షాలకు కోట్ల రూపాయలతో వేసిన సెట్ దెబ్బ తినడం వంటి కారణాలతో ఖర్చు ఇంకా పెరిగింది. ఇంకోవైపేమో నాని గత రెండు చిత్రాలు వి, టక్ జగదీష్ నిరాశ పరచడం ‘శ్యామ్ సింగ రాయ్’కి ప్రతికూలమైంది.
ఇవన్నీ చాలవన్నట్లు అఖండ, పుష్ప లాంటి భారీ చిత్రాల తర్వాత.. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా మూవీకి ముందు రావడం వల్ల రిలీజ్ టైమింగ్ కూడా ‘శ్యామ్ సింగ రాయ్’కి సరిగా కుదరలేదు. దీంతో సినిమాకు బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగలేదు. కొంచెం డెఫిషిట్తోనే సినిమాను రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది నిర్మాతకు. వీటన్నింటికీ తోడు ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది.ఏపీలో మామూలుగానే థియేటర్ల పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటే.. ‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజ్ ముందు రోజు నాని అక్కడి టికెట్ల రేట్ల గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా ఆ వ్యాఖ్యలు ఉండటంతో మంత్రులకు మండిపోయింది. సీఎం జగన్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఏపీలో థియేటర్ల మీద జరుగుతున్న దాడుల్ని అధికారులు మరింత ఉద్ధృతం చేశారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో పదుల సంఖ్యలో థియేటర్లను సీజ్ చేశారు. వాటిలో మెజారిటీ శ్యామ్ సింగ రాయ్ థియేటర్లే ఉన్నాయట.
శుక్రవారం కూడా దాడులు కొనసాగుుతున్నాయి. థియేటర్లు మూతపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’ డిస్ట్రిబ్యూటర్ చేతులెత్తేసినట్లు సమాచారం. నిర్మాత అడిగిన మేర డబ్బులు కట్టి తాను సినిమాను రిలీజ్ చేసి నష్టాల పాలవ్వలేనంటూ అతను వెనక్కి తగ్గాడట. దీంతో ఆల్రెడీ బుక్ అయిన థియేటర్లలో నిర్మాత సొంతంగా సినిమాను రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందట. ఐతే ఇప్పటికే టికెట్ల రేట్ల ప్రతికూల ప్రభావం ఉండగా.. ఇప్పుడు థియేటర్ల కోత పడటంతో నిర్మాతకు గట్టిగానే దెబ్బ పడటం ఖాయమని అంటున్నారు.
This post was last modified on December 24, 2021 3:37 pm
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…