‘శ్యామ్ సింగ రాయ్’ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా. అతడి మార్కెట్ స్థాయికి మించి ఈ సినిమాకు ఖర్చు పెట్టాడు కొత్త నిర్మాత వెంకట్ బోయనపల్లి. మామూలుగానే ఇది పెద్ద బడ్జెట్ సినిమా కాగా.. కరోనా వల్ల మేకింగ్ ఆలస్యం కావడం.. మధ్యలో వర్షాలకు కోట్ల రూపాయలతో వేసిన సెట్ దెబ్బ తినడం వంటి కారణాలతో ఖర్చు ఇంకా పెరిగింది. ఇంకోవైపేమో నాని గత రెండు చిత్రాలు వి, టక్ జగదీష్ నిరాశ పరచడం ‘శ్యామ్ సింగ రాయ్’కి ప్రతికూలమైంది.
ఇవన్నీ చాలవన్నట్లు అఖండ, పుష్ప లాంటి భారీ చిత్రాల తర్వాత.. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా మూవీకి ముందు రావడం వల్ల రిలీజ్ టైమింగ్ కూడా ‘శ్యామ్ సింగ రాయ్’కి సరిగా కుదరలేదు. దీంతో సినిమాకు బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగలేదు. కొంచెం డెఫిషిట్తోనే సినిమాను రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది నిర్మాతకు. వీటన్నింటికీ తోడు ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది.ఏపీలో మామూలుగానే థియేటర్ల పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటే.. ‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజ్ ముందు రోజు నాని అక్కడి టికెట్ల రేట్ల గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా ఆ వ్యాఖ్యలు ఉండటంతో మంత్రులకు మండిపోయింది. సీఎం జగన్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఏపీలో థియేటర్ల మీద జరుగుతున్న దాడుల్ని అధికారులు మరింత ఉద్ధృతం చేశారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో పదుల సంఖ్యలో థియేటర్లను సీజ్ చేశారు. వాటిలో మెజారిటీ శ్యామ్ సింగ రాయ్ థియేటర్లే ఉన్నాయట.
శుక్రవారం కూడా దాడులు కొనసాగుుతున్నాయి. థియేటర్లు మూతపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’ డిస్ట్రిబ్యూటర్ చేతులెత్తేసినట్లు సమాచారం. నిర్మాత అడిగిన మేర డబ్బులు కట్టి తాను సినిమాను రిలీజ్ చేసి నష్టాల పాలవ్వలేనంటూ అతను వెనక్కి తగ్గాడట. దీంతో ఆల్రెడీ బుక్ అయిన థియేటర్లలో నిర్మాత సొంతంగా సినిమాను రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందట. ఐతే ఇప్పటికే టికెట్ల రేట్ల ప్రతికూల ప్రభావం ఉండగా.. ఇప్పుడు థియేటర్ల కోత పడటంతో నిర్మాతకు గట్టిగానే దెబ్బ పడటం ఖాయమని అంటున్నారు.
This post was last modified on December 24, 2021 3:37 pm
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…