నటసింహ నందమూరి బాలకృష్ణకు, మాస్ రాజా రవితేజకు ఏవో విభేదాలున్నాయన్నది ఈ నాటి మాట కాదు. ఈ విషయంలో రకరకాల రూమర్లు వినిపించాయి. అవి ఒక దశలో శ్రుతి మించి ఒక కథానాయికను రవితేజ ఇబ్బంది పెడితే బాలయ్య వార్నింగ్ ఇచ్చేశాడని, చేయి చేసుకున్నాడని కూడా ఒక రూమర్ ప్రచారంలోకి రావడం గమనార్హం. ఇది వినడానికే పెద్ద గాలి కబురులా అనిపించినా.. రూమర్ రాయుళ్లు ఇలాంటి వాటినే విపరీతంగా ప్రచారం చేసి వదిలేశారు.
దీనికి తోడు బాలయ్య, రవితేజ బయట ఎక్కడా కలిసి కనిపించకపోవడం.. వీరి మధ్య బాక్సాఫీస్ పోరులో కొన్నిసార్లు రవితేజ పైచేయి సాధించడంతో ఆ రూమర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఐతే ఎట్టకేలకు ఈ పుకార్లకు ఈ ఇద్దరు హీరోలు కలిసే చెక్ పెట్టేశారు. బాలయ్య హోస్ట్ చేసే అన్ స్టాపబుల్ షోకు కొత్త అతిథిగా రవితేజ హాజరైన సంగతి తెలిసిందే.
ఈ ఎపిసోడ్ ప్రిమియర్స్ డిసెంబరు 31న పడనుండగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.
అందులో ఆరంభంలోనే బాలయ్య పై రూమర్లకు క్లారిటీ ఇచ్చేశాడు. షోలోకి వెళ్లే ముందు ఒక క్లారిటీ తెచ్చేసుకుందాం అంటూ.. నీకూ నాకు పెద్ద గొడవైందటగా అని బాలయ్య అడగ్గా రవితేజ గట్టిగా నవ్వేశాడు. పనీపాటా లేని డ్యాష్ గాళ్లు ఇలాంటివి ప్రచారం చేస్తుంటారని తేలిగ్గా కొట్టిపారేశాడు. ఆ తర్వాత బాలయ్య, రవితేజ కలిసి షోలో చేయాల్సిన అల్లరంతా చేసేశారు. యుక్త వయసులో రవితేజ అమ్మాయిలకు లైనేయడం దగ్గరనుంచి కొన్ని ఆసక్తికర విషయాలను తీసుకొచ్చి మాస్ రాజా ముందుంచాడు బాలయ్య.
ఈ షో మధ్యలో దర్శకుడు గోపీచంద్ మలినేని ఎంట్రీ ఇచ్చాడు. సమరసింహారెడ్డి సినిమా కోసమని తాను అరెస్టయిన విషయాన్ని అతను గుర్తు చేసుకున్నాడు. రవితేజకు రెండు బ్లాక్బస్టర్లు ఇచ్చిన గోపీచంద్ తనకు కూడా బ్లాక్బస్టర్ ఇవ్వాలని.. లేకుంటే పొడిచేస్తానని బాలయ్య జోక్ చేయడం విశేషం. చివర్లో డ్రగ్స్ కేసు గురించి అడిగినపుడు రవితేజ కొంత ఎమోషనల్ అయ్యాడు. చివర్లో అఖండలోని జై బాలయ్యా పాటకు రవితేజ స్టెప్పులేయడం విశేషం.
This post was last modified on December 22, 2021 11:43 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…