అతి సర్వత్ర వర్జయేత్ అన్న నానుడి గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా మోతాదు మించితే ప్రేక్షకులకు మొహం మొత్తేస్తుంది. ప్రొ కబడ్డీ లీగ్కు అనూహ్యమైన ఆదరణ రావడంతో అత్యాశకు పోయిన నిర్వాహకులు ఒకే ఏడాది రెండు సీజన్లలో ఈ లీగ్ను నిర్వహించి ఆదాయం పెంచుకోవాలని చూశారు. కానీ మోతాదు ఎక్కువైపోవడంతో ప్రేక్షకులకు కబడ్డీ లీగ్ మీద ఆసక్తి తగ్గిపోయింది. టోర్నీకి ఆదరణ పడిపోయింది.
ఇప్పుడు మళ్లీ పుంజుకోవడానికి నానా కష్టాలు పడుతోందీ లీగ్. పోయినేడాది కరోనా వల్ల సంవత్సరం చివర్లో ఐపీఎల్ నిర్వహించి.. మళ్లీ ఏప్రిల్లో షెడ్యూల్ ప్రకారం కొత్త సీజన్ను ఆరంభిస్తే ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి కనిపించలేదు. క్రీడల విషయంలోనే కాదు.. ఎందులోనైనా సరే మోతాదు ఎక్కువ అయితే అలాగే ఉంటుంది. జనాలకు మొహం మొత్తేస్తుంది. ఈ విషయంలో ‘బిగ్ బాస్’ నిర్వాహకులకు అర్థం కాకపోవడం ఆశ్చర్యకరం.
గత సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ తెలుగు కొత్త సీజన్కు ఆదరణ పెరిగిన మాట వాస్తవం. సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఐతే ఈ సీజన్ అమితాదరణ దక్కించుకునేసరికి కొత్త సీజన్ను ఇంకో రెండు నెలల్లోనే మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. ఇది జనాలకు పెద్ద షాకే. గత ఏడాది, ఈసారి కరోనా కారణంగా ‘బిగ్ బాస్’ షెడ్యూల్ కంటే ఆలస్యమైన మాట వాస్తవం. వచ్చే ఏడాది సీజన్ను వీలును బట్టి కొంచెం ముందుకు జరుపుకోవాల్సింది. ఏడాది మధ్యలోనే సీజన్ మొదలయ్యేలా చూసుకోవాల్సింది.
కానీ అలా కాకుండా ఇంకో రెండు నెలల్లోనే బిగ్ బాస్ కొత్త సీజన్ను మొదలుపెట్టాలనుకోవడం సరైన వ్యూహం కాదు. దీని వల్ల జనాలకు కొత్త సీజన్ విషయంలో క్యూరియాసిటీ ఉండదు. అప్పుడే బిగ్ బాస్ అయిపోయిందా అని ఫీలయ్యే వాళ్లు.. ఇంకో రెండు నెలల్లోనే కొత్త సీజన్ అని ఇప్పుడు ఎగ్జైట్ అయినా షో మొదలయ్యాక వాళ్లకే మొహం మొత్తేయొచ్చు. అవసరమైన మేర విరామం లేకుండా షోకు అది మంచిది కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త సీజన్కు కొన్ని నెలలు వెనక్కి జరిపితే మంచిదేమో.
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…
ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి…
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్…
ఈ నెల 25 నుంచి టీడీపీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ.. పేరుతో ఓ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు…