సమంత సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తరువాత వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన ఈ బ్యూటీ శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తోంది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. దీనికి ‘యశోద’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వీరిద్దరూ కొత్త దర్శకులు అయినప్పటికీ.. వారు కథ చెప్పిన వెంటనే సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కథను అంత ఇంట్రెస్టింగ్ పాయింట్ తో రాసుకున్నారట. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో నడుస్తుందని సమాచారం. అంతేకాదు.. సినిమాలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. ఇందులో హీరో క్యారెక్టర్ అనేది ఉండదు. హీరో, హీరోయిన్ అన్నీ సమంతనే. అయితే ఓ ముఖ్య పాత్ర కోసం మాత్రం కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

సినిమాలో ఆమె క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగులో వరలక్ష్మీకి డిమాండ్ బాగా పెరిగింది. క్రేజీ ప్రాజెక్ట్ ల కోసం ఆమెని సంప్రదిస్తున్నారు. ఇప్పుడు సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.

ఈ సినిమాను తెలుగులోనే కాకుండా.. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. నిర్విరామంగా ఈ సినిమా షూటింగ్ నిర్వహించి వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకి సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వేసవికి సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాతో పాటు సమంత చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి.