ఒక ఐదారేళ్ల ముందు వరకు లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఎంత బిజీగా ఉండేవారో తెలిసిందే. ప్రతి పెద్ద సినిమాలోనూ దాదాపుగా ఆయన కనిపించేవారు. హీరో తర్వాత అంత హైలైట్ అయ్యే పాత్రల్లో కనిపించేవాడు బ్రహ్మి. ఏటా పదుల సంఖ్యలో సినిమాలు చేస్తూ క్రేజీ కామెడీ రోల్స్తో అదరగొడుతూ వచ్చిన ఈ లెజెండ్.. కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడమే గగనం అయిపోయింది.
వరుసగా ఆయన క్యారెక్టర్లు కొన్ని ఫెయిలవడంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో దాదాపు తెరమరుగైపోయే పరిస్థితి వచ్చింది. ఈ మధ్య బ్రహ్మి చేసిన కాస్త చెప్పుకోదగ్గ పాత్ర అంటే.. జాతిరత్నాలులో జడ్జి క్యారెక్టరే. తర్వాత మళ్లీ గ్యాప్ వచ్చింది. ఐతే ఈ మధ్య బ్రహ్మి బుల్లితెరపై సందడి చేస్తూ యాక్టివ్గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆలీతో చేసిన ఓ కార్యక్రమం.. అలాగే బాలయ్యతో కలిసి సందడి చేసిన అన్స్టాపబుల్ షో హాట్ టాపిక్స్ అయ్యాయి.
ఇదే టైంలో బ్రహ్మి సినిమాల్లోనూ జోరు పెంచుతున్నాడు. సంక్రాంతికి రానున్న భారీ చిత్రం భీమ్లానాయక్లో బ్రహ్మి ఓ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తాజాగా వెల్లడైంది. అది కామెడీ రోలేనట. అలాగే కృష్ణవంశీ మూవీ రంగమార్తాండలోనూ బ్రహ్మి ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అది సీరియస్ క్యారెక్టర్ అని సమాచారం. ఇక ఆలీతో షోలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. తాను శర్వానంద్, నితిన్ హీరోలుగా తెరకెక్కుతున్న కొత్త చిత్రాల్లోనూ నటిస్తున్నట్లు వెల్లడించారు.
నితిన్ సినిమాకు సంబంధించి బ్రహ్మానందం పాత్ర విషయంలో ఈ మధ్య ఒక రూమర్ నడిచింది. ఆయన షూటింగ్కి టైంకి రాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పించారని గుసగుసలు వినిపించాయి. కానీ ఆ సినిమాలో తాను నటిస్తున్నట్లు బ్రహ్మి చెప్పడంతో ఆ రూమర్లకు చెక్ పడింది. మొత్తానికి ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తున్నారంటే బ్రహ్మి మళ్లీ బిజీ అయినట్లే
This post was last modified on December 8, 2021 12:50 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…