అనసూయ భరద్వాజ్ను మొదట్లో జబర్దస్త్ షోలో చూసి ఏమో అనుకున్నారు కానీ.. ఆ షోతో తెలుగులో యాంకరింగ్ తీరునే మార్చేసి, ఆ తర్వాత సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసిందామె. క్షణంతో మొదలుపెట్టి రంగస్థలం వరకు చాలా సినిమాల్లో ఆమె నటిగా తనేంటో రుజువు చేసింది. థ్యాంక్ యు బ్రదర్ అనే సినిమాలో లీడ్ రోల్ కూడా చేసిన అనసూయ.. ఇప్పుడు పుష్ప సహా కొన్ని క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో ఓ వెరైటీ సినిమాను అనౌన్స్ చేశారు. ఇందులో డ్యాన్స్ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా లీడ్ రోల్ చేస్తుండటం విశేషం. ఆయనతో పాటు రెజీనా కసాండ్రా, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆ చిత్రానికి ఫ్లాష్ బ్యాక్ అనే టైటిల్ పెట్టడం విశేషం.
‘ఫ్లాష్ బ్యాక్’ మూవీని డాన్ శాండీ అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు. ‘అభిషేక్ ఫిలిమ్స్’ బేనర్ మీద రమేష్ పిళ్లై నిర్మిస్తున్నాడు. సామ్ సీఎస్ సంగీత దర్శకుడు. ఈ పేర్లన్నీ చూస్తేనే ఇది తమిళ చిత్రం అని అర్థమైపోతుంది. బేసిగ్గా తమిళంలో తీసి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుండొచ్చు. తమిళ వెర్షన్ వరకు పోస్టర్ మీద అనసూయ లేదు. ఆమెకు అక్కడ అంతగా గుర్తింపు లేకపోవడం వల్ల తన పేరు పోస్టర్ మీదికి ఎక్కలేదేమో. తెలుగు వెర్షన్ పోస్టర్లలో ఆమె పేరును జోడించారు.
దర్శకత్వంలో బిజీగా ఉండటంతో చాలా ఏళ్లు నటనకు దూరంగా ఉన్నాడు ప్రభుదేవా. కానీ ఈ మధ్య మళ్లీ నటుడిగా బిజీ అవతున్నారు. ‘భగీరా’ సహా తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో ‘ఫ్లాష్ బ్యాక్’ కూడా ఒకటి. ఈ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అనసూయకు అక్కడ ఎలాంటి ఆరంభం లభిస్తుందో చూడాలి.
This post was last modified on November 25, 2021 10:54 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…