Movie News

ఎన్టీఆర్-కొరటాల.. రివెంజ్ డ్రామా

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ ఎంత మంచి మిత్రులో అందరికీ తెలిసిందే. కొరటాల రచయితగా ఉన్నప్పటి నుంచి ఆయనకు తారక్‌తో మంచి అనుబంధం ఉంది. కొరటాలకు రచయితగా అవకాశం ఇచ్చిందే తారక్. ‘బృందావనం’కు మాటలు రాయడం ద్వారా అతను వెలుగులోకి వచ్చాడు. దర్శకుడిగా కొరటాల తొలి చిత్రం ఎన్టీఆర్‌తోనే చేయాల్సింది కానీ.. కుదర్లేదు.

తర్వాత వీళ్లిద్దరూ కలిసి ‘జనతా గ్యారేజ్’ చేశారు. అది బ్లాక్‌బస్టర్ అయింది. మళ్లీ ఈ కలయికలో ఓ సినిమాను కొన్ని నెలల కిందటే ప్రకటించడం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ చేయబోయే చిత్రమిదే. ఐతే ‘ఆర్ఆర్ఆర్’తో పాటు.. కొరటాల చేస్తున్న ‘ఆచార్య’ కూడా ఆలస్యం కావడంతో వీరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కడం లేటైంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. వాటికి తారక్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాడు. అందులో ముందుగా కొరటాల చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా 2022 ఫిబ్రవరిలో సెట్స్ మీదికి వెళ్లుంది. ఇది ఒక రివెంజ్ డ్రామా. ఆరేడు నెలల్లో సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాం’’ అని తారక్ చెప్పాడు.

ప్రస్తుతం తారక్ యూరప్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ తాలూకు అలసట తీర్చుకోవడానికి తారక్ రెండు నెలల విశ్రాంతి తీసుకోనున్నాడు. మరోవైపు కొరటాల ‘ఆచార్య’ పని పూర్తి చేసి తారక్‌తో చేయబోయే సినిమా స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుకుంటున్నాడు.

ఫిబ్రవరిలో ‘ఆచార్య’ రిలీజయ్యాక ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందన్నమాట. మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమా గురించి తారక్ మాట్లాడుతూ.. ఈ చిత్రం 2022 అక్టోబరులో మొదలవుతుందని, కేజీఎఫ్ రేంజ్‌లోనే ఉంటుందని తారక్ చెప్పడం విశేషం.

Satya

Recent Posts

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

14 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

40 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

41 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

1 hour ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

1 hour ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago