జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ ఎంత మంచి మిత్రులో అందరికీ తెలిసిందే. కొరటాల రచయితగా ఉన్నప్పటి నుంచి ఆయనకు తారక్తో మంచి అనుబంధం ఉంది. కొరటాలకు రచయితగా అవకాశం ఇచ్చిందే తారక్. ‘బృందావనం’కు మాటలు రాయడం ద్వారా అతను వెలుగులోకి వచ్చాడు. దర్శకుడిగా కొరటాల తొలి చిత్రం ఎన్టీఆర్తోనే చేయాల్సింది కానీ.. కుదర్లేదు.
తర్వాత వీళ్లిద్దరూ కలిసి ‘జనతా గ్యారేజ్’ చేశారు. అది బ్లాక్బస్టర్ అయింది. మళ్లీ ఈ కలయికలో ఓ సినిమాను కొన్ని నెలల కిందటే ప్రకటించడం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ చేయబోయే చిత్రమిదే. ఐతే ‘ఆర్ఆర్ఆర్’తో పాటు.. కొరటాల చేస్తున్న ‘ఆచార్య’ కూడా ఆలస్యం కావడంతో వీరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కడం లేటైంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. వాటికి తారక్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాడు. అందులో ముందుగా కొరటాల చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా 2022 ఫిబ్రవరిలో సెట్స్ మీదికి వెళ్లుంది. ఇది ఒక రివెంజ్ డ్రామా. ఆరేడు నెలల్లో సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాం’’ అని తారక్ చెప్పాడు.
ప్రస్తుతం తారక్ యూరప్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ తాలూకు అలసట తీర్చుకోవడానికి తారక్ రెండు నెలల విశ్రాంతి తీసుకోనున్నాడు. మరోవైపు కొరటాల ‘ఆచార్య’ పని పూర్తి చేసి తారక్తో చేయబోయే సినిమా స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుకుంటున్నాడు.
ఫిబ్రవరిలో ‘ఆచార్య’ రిలీజయ్యాక ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందన్నమాట. మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమా గురించి తారక్ మాట్లాడుతూ.. ఈ చిత్రం 2022 అక్టోబరులో మొదలవుతుందని, కేజీఎఫ్ రేంజ్లోనే ఉంటుందని తారక్ చెప్పడం విశేషం.
This post was last modified on November 23, 2021 12:30 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…