అభిమానులందు నా అభిమానులు వేరు అంటున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. వేరే హీరోల అభిమానుల మాదిరి తన ఫ్యాన్స్ తనపై మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోరని వెంకీ వ్యాఖ్యానించడం విశేషం.
వెంకీ గత సినిమా ‘నారప్ప’ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీ బాట పట్టగా.. ఇప్పుడు ఆయన మరో చిత్రం ‘దృశ్యం-2’ కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ‘నారప్ప’ టైంలోనే చాలా అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇప్పుడు వరుసగా రెండో సినిమా కూడా ఓటీటీలో వస్తుండటంతో ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
మరి ఇదే విషయం వెంకీ దగ్గర ప్రస్తావిస్తే.. “ఏం చేస్తాం. ఈ ఏడాదికి అలా అయిపోయింది. నా అభిమానులు చాలా ఓపికతో ఉంటారు. నాపై ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా నన్ను ప్రోత్సహిస్తారు. అన్నింటికీ టైం వస్తుంది. కచ్చితంగా వాళ్లు థియేటర్లలో బాగా ఎంజాయ్ చేసే సినిమాను అందిస్తాను. ‘ఎఫ్-3’తో వాళ్లకు డబుల్ ట్రీట్ ఉంటుంది” అని వెంకీ చెప్పాడు.
‘దృశ్యం-2’ తర్వాత ‘దృశ్యం-3’ కూడా ఉంటుందా అని వెంకీని అడిగితే.. ఉండొచ్చని, అందుకు కొన్నేళ్ల సమయం పట్టొచ్చని, అప్పటికి రాంబాబుకు గడ్డం ఇంకా మెరిసిపోతుందని.. పిల్లలు ఇంకా పెద్ద వాళ్లు అవుతారని చమత్కరించడం విశేషం. దర్శకుడు జీతు జోసెఫ్తో మరో సీక్వెల్ గురించి కొంత చర్చ నడిచిందని ఆయనన్నాడు.
ప్రస్తుతం చేస్తున్న ‘ఎఫ్-3’ మినహా ఇంకే కొత్త సినిమా ఒప్పుకోలేదన్న వెంకీ.. ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న తరుణ్ భాస్కర్ సినిమా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తరుణ్ సహా అందరూ స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నారని.. ఏది బాగుందనిపిస్తే ఆ సినిమా మొదలుపెడతామని వెంకీ అన్నాడు.
This post was last modified on November 18, 2021 11:02 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…