‘స్వామి రారా’ మూవీతో తనపై భారీగా అంచనాలు పెంచిన దర్శకుడు సుధీర్ వర్మ. కానీ ఆ అంచనాలను తర్వాతి సినిమాలతో అస్సలు అందుకోలేకపోయాడు. అతడి రెండో చిత్రం ‘దోచెయ్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత తన తొలి చిత్ర కథానాయకుడు నిఖిల్తోనే ‘కేశవ’ తీశాడు. దీన్ని ఫ్లాప్ అనలేం. అలా అని హిట్ అని కూడా చెప్పలేం. ఏదో యావరేజ్గా ఆడిందంతే. అయినా సుధీర్ వర్మకు మరో మంచి అవకాశం వచ్చింది.
శర్వానంద్ హీరోగా ‘రణరంగం’ లాంటి క్రేజీ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రానికి కోరుకున్నదానికంటే ఎక్కువ హైపే వచ్చింది. కానీ ఏం లాభం? సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇంకో డిజాస్టర్ సుధీర్ ఖాతాలో పడింది. ఈ ట్రాక్ రికార్డులో ఇంకో సినిమా అవకాశం అందుకోవడమే కష్టం. అలాంటిది సుధీర్ మూడు చిత్రాలను లైన్లో పెట్టాడు.
ఇంతకుముందు ‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ మూవీని ‘ఓ బేబీ’ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ.. కొరియా నుంచే ఇంకో థ్రిల్లర్ యూవీని తెలుగులోకి తీసుకొస్తోంది. ‘శాకిని డాకిని’ పేరుతో రాబోతున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, నివేథా థామస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది సుధీరే. చడీచప్పుడు లేకుండా సినిమాను మొదలుపెట్టి చకచకా పూర్తి చేశాడు సుధీర్. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇంతలో నిఖిల్తో మూడో సినిమాకు రంగం సిద్ధం చేశాడు సుధీర్. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ షూటింగ్ మొదలైపోయింది. కొత్త షెడ్యూల్ కోసం లండన్లో అడుగు పెట్టింది చిత్ర బృందం. ఇక సుధీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీని ఇటీవలే అనౌన్స్ చేయడం తెలిసిందే. రవితేజ హీరోగా ‘రావణాసుర’ పేరుతో ఆ సినిమా తెరకెక్కనుంది. వరుసగా మూడు ఫెయిల్యూర్లు డెలివర్ చేసిన దర్శకుడికి స్వల్ప వ్యవధిలో మూడు సినిమాల్లో అవకాశం దక్కడం.. ఏడాది వ్యవధిలో ఆ మూడు చిత్రాలూ పూర్తి కాబోతుండటం విశేషమే.
This post was last modified on November 18, 2021 1:33 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…