ఈ తరంలో స్వశక్తితో పెద్ద స్టార్గా ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంత తక్కువ సమయంలో అంత పెద్ద స్టార్ అయిన హీరోలు చాలా అరుదుగా కనిపిస్తారు. తాను ఎన్నో ఏళ్లు కష్టపడ్డాక ఖైదీ సినిమాతో కానీ స్టార్ స్టేటస్ సంపాదించలేదని.. కానీ విజయ్ చాలా తక్కువ టైంలో పెద్ద స్టార్ అయిపోయాడని మెగాస్టార్ చిరంజీవి సైతం అన్నాడంటే విజయ్ ఎదుగుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
విజయ్ని చూసి వేరే హీరోలు అసూయ చెంది ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. నిజానికి టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అల్లు అర్జున్ దగ్గర ఎవరో నేరుగానే ఈ విషయం ప్రస్తావించారట. విజయ్ అలా వేగంగా ఎదిగిపోతుంటే మీకు అసూయగా అనిపించదా అని అడిగారట. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం పుష్పక విమానం ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ ఈ విషయం ప్రస్తావించాడు.
ఐతే ఆ ప్రశ్న అడిగిన వ్యక్తితో.. తానెందుకు విజయ్ని అసూయ చెందుతానని ఎదురు ప్రశ్నించినట్లు బన్నీ వెల్లడించాడు. సినిమాలనే కాదు.. ఏ రంగానికైనా వర్తించే విషయం ఒకటుందని.. ఎవరైనా మనల్ని దాటి ముందుకు వెళ్లిపోతున్నారంటే మనం వేగంగా పరుగెత్తడం లేదని అర్థమని.. అప్పుడు తప్పు మనదవుతుంది తప్ప మనల్ని దాటి ముందుకు వెళ్తున్న వ్యక్తిది కాదని.. కాబట్టి విజయ్ని చూసి తాను ఎప్పడూ అసూయ చెందలేదని, చెందబోనని బన్నీ స్పష్టం చేశాడు.
విజయ్ స్వశక్తితో ఎదిగిన నటుడని.. అతడంటే మొదట్నుంచి తనకు చాలా చాలా ఇష్టమని బన్నీ చెప్పాడు. విజయ్ చాలా కొత్తగా ఆలోచిస్తాడని.. అదే సమయంలో అతడిలో ఒక స్వీట్నెస్ ఉంటుందని.. సినిమాల వరకే కాకుండా బిజినెస్ పరంగా కూడా రౌడీ బ్రాండు తీసుకొచ్చి దాన్ని విజయ్ ప్రమోట్ చేసిన తీరు తననెంతో ఆకట్టుకుందని బన్నీ కొనియాడాడు.
This post was last modified on October 31, 2021 10:59 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…