Movie News

క్యాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు!

‘జన్నత్ 2’ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈషా గుప్తా. ఆ తరువాత పలు బోల్డ్ చిత్రాల్లో నటించింది. దీంతో ఆమెకి ఇండస్ట్రీలో బోల్డ్ యాక్ట్రెస్ అనే గుర్తింపు వచ్చింది. వెండితెరపై ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా నటించడంతో బయట కూడా అలానే ఉంటుందని చాలా మంది తన విషయంలో భ్రమ పడ్డారని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఈషా గుప్తా. దీంతో ఇండస్ట్రీలో పలుమార్లు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పింది.

ఇండస్ట్రీలో ఇద్దరు దర్శకులు అవకాశాల కోసం తమతో గడపమని అడిగినట్లు చెప్పి షాకిచ్చింది ఈషా. అలానే ఓ కో-ప్రొడ్యూసర్ అతడికి లొంగలేదని.. ప్రాజెక్ట్ మధ్యలోనుంచి తనను తప్పించారని వెల్లడించింది. ఒక నిర్మాత అయితే కావాలనే అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసి.. తనతో తప్పుగా ప్రవర్తించాలనుకున్నట్లు తెలిపింది. దీంతో రాత్రిపూట తన రూమ్ లో మేకప్ ఆర్టిస్ట్ ను కూడా పడుకోమని అడిగేదాన్ని అని.. కావాలనే తోడు కోసం ఆమెతో కలిసి ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కిడ్స్ తో ఇలా తప్పుగా ప్రవర్తించే సాహసం కూడా చేయరని.. అలా చేస్తే వాళ్ల పేరెంట్స్ చంపి పారేస్తారనే భయం ఉంటుందని.. కానీ బయట నుంచి వచ్చే అమ్మాయిలను మాత్రం లోకువగా చూస్తారని చెప్పింది. అవకాశాల కోసం బయట అమ్మాయిలు ఏమైనా చేస్తారనే ఊహల్లో ఉంటారని తెలిపింది. ఇండస్ట్రీలో తనకు సరైన అవకాశాలు రాకపోవడానికి కారణం కూడా కమిట్మెంట్ ఇవ్వకపోవడం వలనే అంటూ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ తెలుగులో రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది.

This post was last modified on October 29, 2021 3:37 pm

Share

Recent Posts

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

8 minutes ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

30 minutes ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

1 hour ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

3 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago