హీరోల కుటుంబాల నుంచి కొత్త హీరోలు రావడం కామన్. అప్పుడప్పుడూ నిర్మాతల ఫ్యామిలీస్ నుంచి కూడా హీరోలొస్తుంటారు. విక్టరీ వెంకటేష్ నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ వరకు ఈ కోవలో చాలామందే హీరోలున్నారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడైన దిల్ రాజు కూడా తమ కుటుంబం నుంచి ఒక హీరోను పరిచయం చేస్తున్నాడు. అతనే.. ఆశిష్ రెడ్డి.
దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకే ఈ ఆశిష్. అతను హీరోగా అరంగేట్రం చేస్తున్న సినిమా ‘రౌడీ బాయ్స్’. ఆశిష్ను హీరోగా నిలబెట్టడానికి గట్టి ప్రణాళికలతోనే వచ్చాడు రాజు. ‘హుషారు’ లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన హర్షను దర్శకుడిగా ఎంచుకున్నాడు. అనుపమ లాంటి పేరున్న కథానాయికను తీసుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సహా టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు.
ఐతే అంతా ఓకే కానీ.. ఆశిష్ను ప్రమోట్ చేసే విషయంలో రాజు ఓవర్ ద టాప్ వెళ్లిపోతున్నారనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. కొత్త హీరోను సాధ్యమైనంతగా దాచి పెట్టి ఉంచాలి కానీ.. అతడి కోసం ఈవెంట్ల మీద ఈవెంట్లు చేసేస్తున్నాడు రాజు. సినిమా నుంచి ఒక్కో పాట రిలీజ్ చేసినపుడల్లా ఒక ప్రి రిలీజ్ ఈవెంట్ లాంటి వేడుక చేసి హంగామా చేయడం అతిగా అనిపిస్తోంది. ప్రమోషన్ అవసరమే కానీ.. మరీ ఇంతగానా అని జనాలు పెదవి విరుస్తున్నారు సోషల్ మీడియాలో. ఒక్కో పాటను ఒక్కో సెలబ్రెటీతో రిలీజ్ చేయించి.. సోషల్ మీడియాలో ఫొటోలు పెడితే ఓకే కానీ.. ఇలా ప్రతిసారీ ఒక ఈవెంట్ చేయడం అనవసరమే.
దీని వల్ల జరిగే మేలు కంటే చేటే ఎక్కువ. ఇప్పటికైనా రాజు కొంచెం దూకుడు తగ్గించి.. ప్రమోషన్ ఓవర్ డోస్ కాకుండా జాగ్రత్త పడితే… ప్రి రిలీజ్ ఈవెంట్ వరకు ఈ ఉత్సాహాన్ని కొంచెం దాచుకుంటే మంచిదేమో.
This post was last modified on December 17, 2021 7:47 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…