హీరోల కుటుంబాల నుంచి కొత్త హీరోలు రావడం కామన్. అప్పుడప్పుడూ నిర్మాతల ఫ్యామిలీస్ నుంచి కూడా హీరోలొస్తుంటారు. విక్టరీ వెంకటేష్ నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ వరకు ఈ కోవలో చాలామందే హీరోలున్నారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడైన దిల్ రాజు కూడా తమ కుటుంబం నుంచి ఒక హీరోను పరిచయం చేస్తున్నాడు. అతనే.. ఆశిష్ రెడ్డి.
దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకే ఈ ఆశిష్. అతను హీరోగా అరంగేట్రం చేస్తున్న సినిమా ‘రౌడీ బాయ్స్’. ఆశిష్ను హీరోగా నిలబెట్టడానికి గట్టి ప్రణాళికలతోనే వచ్చాడు రాజు. ‘హుషారు’ లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన హర్షను దర్శకుడిగా ఎంచుకున్నాడు. అనుపమ లాంటి పేరున్న కథానాయికను తీసుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సహా టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు.
ఐతే అంతా ఓకే కానీ.. ఆశిష్ను ప్రమోట్ చేసే విషయంలో రాజు ఓవర్ ద టాప్ వెళ్లిపోతున్నారనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. కొత్త హీరోను సాధ్యమైనంతగా దాచి పెట్టి ఉంచాలి కానీ.. అతడి కోసం ఈవెంట్ల మీద ఈవెంట్లు చేసేస్తున్నాడు రాజు. సినిమా నుంచి ఒక్కో పాట రిలీజ్ చేసినపుడల్లా ఒక ప్రి రిలీజ్ ఈవెంట్ లాంటి వేడుక చేసి హంగామా చేయడం అతిగా అనిపిస్తోంది. ప్రమోషన్ అవసరమే కానీ.. మరీ ఇంతగానా అని జనాలు పెదవి విరుస్తున్నారు సోషల్ మీడియాలో. ఒక్కో పాటను ఒక్కో సెలబ్రెటీతో రిలీజ్ చేయించి.. సోషల్ మీడియాలో ఫొటోలు పెడితే ఓకే కానీ.. ఇలా ప్రతిసారీ ఒక ఈవెంట్ చేయడం అనవసరమే.
దీని వల్ల జరిగే మేలు కంటే చేటే ఎక్కువ. ఇప్పటికైనా రాజు కొంచెం దూకుడు తగ్గించి.. ప్రమోషన్ ఓవర్ డోస్ కాకుండా జాగ్రత్త పడితే… ప్రి రిలీజ్ ఈవెంట్ వరకు ఈ ఉత్సాహాన్ని కొంచెం దాచుకుంటే మంచిదేమో.
This post was last modified on December 17, 2021 7:47 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…