హీరోల కుటుంబాల నుంచి కొత్త హీరోలు రావడం కామన్. అప్పుడప్పుడూ నిర్మాతల ఫ్యామిలీస్ నుంచి కూడా హీరోలొస్తుంటారు. విక్టరీ వెంకటేష్ నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ వరకు ఈ కోవలో చాలామందే హీరోలున్నారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడైన దిల్ రాజు కూడా తమ కుటుంబం నుంచి ఒక హీరోను పరిచయం చేస్తున్నాడు. అతనే.. ఆశిష్ రెడ్డి.
దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకే ఈ ఆశిష్. అతను హీరోగా అరంగేట్రం చేస్తున్న సినిమా ‘రౌడీ బాయ్స్’. ఆశిష్ను హీరోగా నిలబెట్టడానికి గట్టి ప్రణాళికలతోనే వచ్చాడు రాజు. ‘హుషారు’ లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన హర్షను దర్శకుడిగా ఎంచుకున్నాడు. అనుపమ లాంటి పేరున్న కథానాయికను తీసుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సహా టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు.
ఐతే అంతా ఓకే కానీ.. ఆశిష్ను ప్రమోట్ చేసే విషయంలో రాజు ఓవర్ ద టాప్ వెళ్లిపోతున్నారనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. కొత్త హీరోను సాధ్యమైనంతగా దాచి పెట్టి ఉంచాలి కానీ.. అతడి కోసం ఈవెంట్ల మీద ఈవెంట్లు చేసేస్తున్నాడు రాజు. సినిమా నుంచి ఒక్కో పాట రిలీజ్ చేసినపుడల్లా ఒక ప్రి రిలీజ్ ఈవెంట్ లాంటి వేడుక చేసి హంగామా చేయడం అతిగా అనిపిస్తోంది. ప్రమోషన్ అవసరమే కానీ.. మరీ ఇంతగానా అని జనాలు పెదవి విరుస్తున్నారు సోషల్ మీడియాలో. ఒక్కో పాటను ఒక్కో సెలబ్రెటీతో రిలీజ్ చేయించి.. సోషల్ మీడియాలో ఫొటోలు పెడితే ఓకే కానీ.. ఇలా ప్రతిసారీ ఒక ఈవెంట్ చేయడం అనవసరమే.
దీని వల్ల జరిగే మేలు కంటే చేటే ఎక్కువ. ఇప్పటికైనా రాజు కొంచెం దూకుడు తగ్గించి.. ప్రమోషన్ ఓవర్ డోస్ కాకుండా జాగ్రత్త పడితే… ప్రి రిలీజ్ ఈవెంట్ వరకు ఈ ఉత్సాహాన్ని కొంచెం దాచుకుంటే మంచిదేమో.
This post was last modified on December 17, 2021 7:47 am
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…