Movie News

మహేష్ రేసులోనే ఉన్నాడబ్బా

సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ఖరారై ఉండగా.. ఉన్నట్లుండి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కూడా పండక్కి కొన్ని రోజుల ముందు రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయింది దాని టీం. జనవరి 12 నుంచి వరుసగా మూడు రోజులు పవన్ కళ్యాణ్ సినిమా ‘భీమ్లా నాయక్’, మహేష్ బాబు చిత్రం ‘సర్కారు వారి పాట’, ప్రభాస్ మూవీ ‘రాధేశ్యామ్’ షెడ్యూల్ అయి ఉండగా.. 7న ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయడమేంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. పై మూడు చిత్రాలకే థియేటర్లు సర్దుబాటు చేయడం చాలా కష్టం. దీని వల్ల ప్రతి సినిమా వసూళ్ల మీదా ప్రభావం పడుతుంది.
అలాంటిది ఇక ‘ఆర్ఆర్ఆర్’ 7న వస్తే అంతే సంగతులు. థియేటర్లు దొరకవు. దేనికీ వసూళ్లు ఆశించిన స్థాయిలో రావు. ఐతే ‘రాధేశ్యామ్’ పక్కాగా 14నే వస్తుందని.. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట అనుకున్న ప్రకారం రిలీజ్ కావడం డౌటే అని ఈ మధ్య గుసగుసలు వినిపించాయి.

ముఖ్యంగా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఎలాగూ ఆలస్యమవుతుండటంతో దీన్ని వేసవికి వాయిదా వేశారనే ప్రచారం జోరుగానే సాగింది. మహేష్ ఫ్యాన్స్ కూడా మానసికంగా ఇందుకు సిద్ధమైపోయారు. కానీ ఇప్పుడు చిత్ర బృందం ట్విస్ట్ ఇచ్చింది. సంక్రాంతికే తమ సినిమా వస్తుందని ధ్రువీకరించింది.

ఆదివారం హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్‌తో పాటు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది ‘సర్కారు వారి పాట’ టీం. ఇందులో తమ చిత్రం జనవరి 13నే విడుదల కాబోతున్నట్లు ప్రకటించింది. కీర్తికి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే విషయం అక్కడికే పరిమితం కావాలి. కానీ పర్టికులర్‌గా రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించారంటే తమ సినిమా వాయిదా పడట్లేదని, జరుగుతున్న ప్రచారాలన్నీ అబద్ధమని సంకేతాలు ఇవ్వడానికే కావచ్చు. మరోవైపు ‘భీమ్లా నాయక్’ టీం సైతం 12నే తమ చిత్రం పక్కా అంటున్న నేపథ్యంలో వారం వ్యవధిలో నాలుగు భారీ చిత్రాలను అకామొడేట్ చేసే స్పేస్ ఎక్కడుందన్నది ప్రశ్న.

This post was last modified on October 17, 2021 1:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

9 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago