సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ఖరారై ఉండగా.. ఉన్నట్లుండి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కూడా పండక్కి కొన్ని రోజుల ముందు రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయింది దాని టీం. జనవరి 12 నుంచి వరుసగా మూడు రోజులు పవన్ కళ్యాణ్ సినిమా ‘భీమ్లా నాయక్’, మహేష్ బాబు చిత్రం ‘సర్కారు వారి పాట’, ప్రభాస్ మూవీ ‘రాధేశ్యామ్’ షెడ్యూల్ అయి ఉండగా.. 7న ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయడమేంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. పై మూడు చిత్రాలకే థియేటర్లు సర్దుబాటు చేయడం చాలా కష్టం. దీని వల్ల ప్రతి సినిమా వసూళ్ల మీదా ప్రభావం పడుతుంది.
అలాంటిది ఇక ‘ఆర్ఆర్ఆర్’ 7న వస్తే అంతే సంగతులు. థియేటర్లు దొరకవు. దేనికీ వసూళ్లు ఆశించిన స్థాయిలో రావు. ఐతే ‘రాధేశ్యామ్’ పక్కాగా 14నే వస్తుందని.. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట అనుకున్న ప్రకారం రిలీజ్ కావడం డౌటే అని ఈ మధ్య గుసగుసలు వినిపించాయి.
ముఖ్యంగా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఎలాగూ ఆలస్యమవుతుండటంతో దీన్ని వేసవికి వాయిదా వేశారనే ప్రచారం జోరుగానే సాగింది. మహేష్ ఫ్యాన్స్ కూడా మానసికంగా ఇందుకు సిద్ధమైపోయారు. కానీ ఇప్పుడు చిత్ర బృందం ట్విస్ట్ ఇచ్చింది. సంక్రాంతికే తమ సినిమా వస్తుందని ధ్రువీకరించింది.
ఆదివారం హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్తో పాటు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది ‘సర్కారు వారి పాట’ టీం. ఇందులో తమ చిత్రం జనవరి 13నే విడుదల కాబోతున్నట్లు ప్రకటించింది. కీర్తికి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే విషయం అక్కడికే పరిమితం కావాలి. కానీ పర్టికులర్గా రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించారంటే తమ సినిమా వాయిదా పడట్లేదని, జరుగుతున్న ప్రచారాలన్నీ అబద్ధమని సంకేతాలు ఇవ్వడానికే కావచ్చు. మరోవైపు ‘భీమ్లా నాయక్’ టీం సైతం 12నే తమ చిత్రం పక్కా అంటున్న నేపథ్యంలో వారం వ్యవధిలో నాలుగు భారీ చిత్రాలను అకామొడేట్ చేసే స్పేస్ ఎక్కడుందన్నది ప్రశ్న.
This post was last modified on October 17, 2021 1:14 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…