కొద్ది రోజులుగా టాలీవుడ్నే కాదు, అక్కినేని అభిమానులందరినీ కలవరపెడుతున్న వార్త.. నాగచైతన్య, సమంత డివోర్స్. ఈ క్యూట్ కపుల్ ఒక్కటైనప్పుడు మురిసిపోనివారు లేరు. పర్ఫెక్ట్ పెయిర్ అంటూ కాంప్లిమెంట్స్ కురిపించనివారూ లేరు. అయితే కొన్ని రోజుల క్రితం సడెన్గా వీరు విడిపోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అది నిజమేనని నమ్మేలా సమంత కొన్ని హింట్స్ కూడా ఇచ్చింది కానీ చైతు మాత్రం ఎక్కడా నోరు మెదపలేదు. కానీ ఇప్పుడు తాము విడిపోతున్నామంటూ ఇద్దరూ అఫీషియల్గా అనౌన్స్ చేశారు.
తమ సెపరేషన్ని కన్ఫర్మ్ చేస్తూ చై, సామ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ‘ఎంతో ఆలోచించిన తర్వాత మేం వేరు పడాలని నిర్ణయించుకున్నాం. మా దారులు వేరైనా మా మధ్య స్నేహ బంధం మాత్రం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంది. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలబడాలని ఫ్రెండ్స్ని, సన్నిహితుల్ని కోరుతున్నాం’ అని నోట్లో రాసిన చై, సామ్.. తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోరారు.
ఊహించిన విషయమే అయినా.. ఈ వార్త అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రియుల్ని కూడా కాస్త బాధపెట్టిందనే చెప్పాలి. 2017, అక్టోబర్ 7న గోవాలో నాగచైతన్య, సమంతల వివాహం జరిగింది. అందుకే ఆ రోజునే తమ విడాకుల వార్తను ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. అంతకంటే ముందు తమ విషయంలో క్లారిటీ ఇచ్చిందీ జంట.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…