నందమూరి బాలకృష్ణ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు తనపై పుత్ర వాత్సల్యం ఉందన్నారు. తన తండ్రి నందమూరి తారక రామారావు అంటే కేసీఆర్కు ఎంతో అభిమానమని.. ఆ అభిమానంతోనే తనను కొడుకుతో సమానంగా చూస్తారని అన్నాడు బాలయ్య. ఇటీవల షూటింగ్ల పునఃప్రారంభంపై ప్రభుత్వంతో నిర్వహించిన సమావేశాలకు తనను పిలవకపోవడంపై బాలయ్య కినుక వహించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో దుమారం రేగింది. ఐతే తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన బాలయ్యను తెలంగాణ ముఖ్యమంత్రితో, మంత్రితో సమావేశాలకు పిలవడం ఇబ్బందన్న ఉద్దేశంతో ఆయన్ని ఆహ్వానించకపోయి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య వద్ద ప్రస్తావిస్తూ, మీరు తెలుగుదేశం ఎమ్మెల్యే కాబట్టే పిలవలేదేమో అని చెప్పగా.. బాలయ్య ఆసక్తికర రీతిలో స్పందించాడు. సీఎం కేసీఆర్ను కలవడానికి వాళ్లంతా వెళ్లినప్పుడు నన్నెందుకు పిలవలేదో నాకు తెలియదు. ఒకవేళ గతంలో నేను రాజకీయ కోణంలో ఆయనపై చేసిన విమర్శల కారణంగా నన్ను పిలవకపోతే ఆ విషయం నాకు చెప్పాల్సింది. కేసీఆర్గారికి నా మీద ఎప్పుడూ కోపం లేదు. రాజకీయం వేరు.. ఇది వేరు. రామారావుగారి అభిమానిగా నేనంటే కేసీఆర్ గారికి పుత్ర వాత్సల్యం ఉంది. మిగిలిన వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు’’ అని బాలయ్య అన్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే బాగుంటుందన్న అభిప్రాయాలపై బాలయ్య స్పందిస్తూ.. రాజకీయాల్లో రావడం అనేది అతని ఇష్టమని, వృత్తిని వదులుకుని రమ్మని చెప్పలేమని అన్నాడు బాలయ్య. ఇప్పుడు తాను, ఒకప్పుడు తన తండ్రి ఒకేసారి సినిమాలు, రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నామని.. రాజకీయాల్లో రావడం అనేది వాళ్ల సొంత నిర్ణయమని చెప్పాడు.
This post was last modified on June 2, 2020 4:06 am
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…