Movie News

బాలు నోట.. ‘అన్నాత్తే’ పాట

కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా పాట అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే. కానీ కరోనా ఆయన్ని సడెన్‌గా తీసుకుపోయింది. ఎన్నో యేళ్లుగా అలరించిన ఆ మధుర స్వరం మూగబోయింది. బాలు అందరినీ వదిలి వెళ్లిపోయి అప్పుడే ఏడాది దాటేసింది. కానీ ఇప్పుడు మరోసారి ఆయన పాట అందరి వీనులకూ విందు చేయబోతోంది. రజినీకాంత్ సినిమా ద్వారా.

శౌర్యం, వీరమ్, వేదాళం, విశ్వాసం లాంటి సినిమాలు తీసిన శివ డైరెక్షన్‌లో ‘అన్నాత్తే’ మూవీ చేస్తున్నారు రజినీకాంత్. ఆయన సినిమా అంటే ఎంట్రీ సాంగ్ కామన్. ప్రతి సినిమాలోనూ రజినీ కోసం అదిరిపోయే ఎంట్రీ సాంగ్‌ని పనిగట్టుకుని పెడతారు డైరెక్టర్స్. వాటిని చాలా యేళ్లుగా బాలుయే పాడుతూ వచ్చారు. ‘అన్నాత్తే’ కోసం కూడా ఆయనే పాడారు. అయితే ఆ పాట బైటికి రాకముందే బాలు కన్నుమూశారు.

ఇప్పుడు ఆ పాటను రిలీజ్ చేయబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌‌ 4న సాయంత్రం ఆరింటికి సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు సన్ పిక్చర్స్ సంస్థ ప్రకటించింది. డి.ఇమ్మాన్ కంపోజ్ చేసిన ఈ పాట గత చిత్రాల్లోని రజినీ ఎంట్రీ సాంగ్స్‌ను మించి ఉంటుందంటున్నారు.

ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్‌‌ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా లాంటి పాపులర్ స్టార్స్ చాలామంది ఇందులో నటించారు. రజినీ ఊరిపెద్దగా.. కీర్తి సురేష్ ఆయనకి కూతురిగా.. ఖుష్బూ, మీనా రజినీకి చెల్లెళ్లుగా కనిపిస్తారట. అన్నాచెల్లెళ్ల రిలేషన్‌ బేస్డ్‌గా సినిమా ఉంటుందని, అందుకే ‘అన్నాత్తే’ అని టైటిల్‌ ఫిక్స్ చేశారని సమాచారం. తెలుగులో ఏ పేరుతో రిలీజ్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.

This post was last modified on October 2, 2021 12:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

28 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago