కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా పాట అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే. కానీ కరోనా ఆయన్ని సడెన్గా తీసుకుపోయింది. ఎన్నో యేళ్లుగా అలరించిన ఆ మధుర స్వరం మూగబోయింది. బాలు అందరినీ వదిలి వెళ్లిపోయి అప్పుడే ఏడాది దాటేసింది. కానీ ఇప్పుడు మరోసారి ఆయన పాట అందరి వీనులకూ విందు చేయబోతోంది. రజినీకాంత్ సినిమా ద్వారా.
శౌర్యం, వీరమ్, వేదాళం, విశ్వాసం లాంటి సినిమాలు తీసిన శివ డైరెక్షన్లో ‘అన్నాత్తే’ మూవీ చేస్తున్నారు రజినీకాంత్. ఆయన సినిమా అంటే ఎంట్రీ సాంగ్ కామన్. ప్రతి సినిమాలోనూ రజినీ కోసం అదిరిపోయే ఎంట్రీ సాంగ్ని పనిగట్టుకుని పెడతారు డైరెక్టర్స్. వాటిని చాలా యేళ్లుగా బాలుయే పాడుతూ వచ్చారు. ‘అన్నాత్తే’ కోసం కూడా ఆయనే పాడారు. అయితే ఆ పాట బైటికి రాకముందే బాలు కన్నుమూశారు.
ఇప్పుడు ఆ పాటను రిలీజ్ చేయబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 4న సాయంత్రం ఆరింటికి సాంగ్ను విడుదల చేయనున్నట్టు సన్ పిక్చర్స్ సంస్థ ప్రకటించింది. డి.ఇమ్మాన్ కంపోజ్ చేసిన ఈ పాట గత చిత్రాల్లోని రజినీ ఎంట్రీ సాంగ్స్ను మించి ఉంటుందంటున్నారు.
ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా లాంటి పాపులర్ స్టార్స్ చాలామంది ఇందులో నటించారు. రజినీ ఊరిపెద్దగా.. కీర్తి సురేష్ ఆయనకి కూతురిగా.. ఖుష్బూ, మీనా రజినీకి చెల్లెళ్లుగా కనిపిస్తారట. అన్నాచెల్లెళ్ల రిలేషన్ బేస్డ్గా సినిమా ఉంటుందని, అందుకే ‘అన్నాత్తే’ అని టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. తెలుగులో ఏ పేరుతో రిలీజ్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…