మహేష్ బాబు అభిమానులు తమ హీరో సినిమా చేయాలని ఎంతగానో ఆశించే దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. మహేష్ను నెవర్ బిఫోర్ అవతార్లో ప్రెజెంట్ చేస్తూ పూరి తీసిన పోకిరి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు మహేష్. ఆ తర్వాత వీళ్ల కలయికలో వచ్చిన బిజినెస్మేన్ కూడా మంచి విజయమే సాధించింది. మహేష్ను అంతటి అగ్రెసివ్ క్యారెక్టర్లలో చూపించడం పూరీకి మాత్రమే చెల్లింది.
మళ్లీ వీళ్ల కలయికలో ఓ పవర్ ఫుల్ మూవీ వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐతే బిజినెస్మేన్-2 అని, జనగణమన అని వీళ్ల మూడో సినిమా గురించి కొన్ని కబుర్లు వినిపించాయి కానీ.. అవి కార్యరూపం దాల్చలేదు. మధ్యలో వీళ్లిద్దరి మధ్య అనుకోకుండా కొంచెం గ్యాప్ వచ్చింది.
ఈ నేపథ్యంలో మహేష్, పూరి కలిసి మళ్లీ సినిమా చేయడం సందేహంగా మారింది. ఇందుకు మహేషే సుముఖంగా లేడన్న సంకేతాలు కనిపించాయి. ఐతే ఆదివారం ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించిన మహేష్.. పూరితో మళ్లీ పని చేసే విషయంలో తనకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పాడు సూపర్ స్టార్.
పూరితో మళ్లీ సినిమా చేస్తే చూడాలనుందని ఓ అభిమాని అడిగితే.. ఆయన తన ఫేవరెట్ డైరెక్టర్లలో ఒకడని.. తనతో పని చేయడాన్ని ఎంతో ఇష్టపడతానని.. ఇప్పటికీ ఆయన వచ్చి కథ చెబితే వినడానికి సిద్ధంగా ఉన్నానని అన్నాడు మహేష్.
ఈ రోజు ఉదయం మహేష్ కొత్త సినిమా సర్కారు వారి పాట ప్రి లుక్ పోస్టర్ మీద పూరి చాలా పాజిటివ్గా స్పందించడం, సాయంత్రానికి మహేష్ ఆయనతో సినిమా చేయడానికి రెడీ అని ప్రకటించడంతో మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తారన్న ఆశ అభిమానుల్లో పెరుగుతోంది.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…