దర్శకుడు శేఖర్ కమ్ముల తన కొత్త చిత్రం ‘లవ్ స్టోరి’ కోసమని రెండు క్లైమాక్స్లు చిత్రీకరించినట్లుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కుల వివక్ష, లింగ వివక్ష చుట్టూ తిరిగే సినిమా అన్న సంగతి తెలిసిందే. కులాంతర ప్రేమ, పెళ్ళిళ్ళ విషయంలో సొసైటీలో జరిగిన కొన్ని దారుణ ఘటనల స్ఫూర్తితో కమ్ముల ఈ సినిమా తీసినట్లుగా సంకేతాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి కథల విషయంలో తమిళ ఫిలిం మేకర్స్ తీరు వేరుగా ఉంటుంది. వాళ్లు హార్ట్ బ్రేకింగ్గా ఉండేలా క్లైమాక్స్లు తీర్చిదిద్దుతుంటారు. కమ్ముల స్టైల్ ప్రకారం చూస్తే ఈ సినిమా ముగింపు అలా ఉండే అవకాశం లేదు. కానీ ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేసి చూద్దామన్న ఉద్దేశంతో ఆయన ఒక పాజిటివ్ క్లైమాక్స్తో పాటు.. ట్రాజిక్ క్లైమాక్స్ కూడా తీశారనే ప్రచారం సాగింది. ఏ క్లైమాక్స్ను సినిమాలో ఉంచాలనే విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారనే విషయం సస్పెన్స్ అంటూ ఊహాగానాలు సాగాయి.
మరి ఈ రెండు క్లైమాక్స్ల కథేంటని హీరో నాగచైతన్యను అడిగితే.. ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాడు. సినిమా కోసం రెండు భిన్నమైన క్లైమాక్స్ల చిత్రీకరణ అంటూ ఏమీ చేయలేదని.. కాకపోతే ఒకసారి క్లైమాక్స్ తీశాక దానికి కొంచెం మెరుగులు దిద్దే ప్రయత్నం జరిగిందని ‘లవ్ స్టోరి’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన సందర్భంగా చైతూ చెప్పాడు. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చైతూ చెబుతూ.. ‘బంగార్రాజు’తో పాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అమేజాన్ కోసం ఒక హార్రర్ సిరీస్ చేస్తున్నట్లు వెల్లడించాడు.
ఐతే హార్రర్ సిరీస్ అయినప్పటికీ ఇందులో దయ్యం లాంటిదేమీ ఉండదని.. సూపర్ నేచురల్ పవర్ లాంటిది ఉంటుందని.. దాని చుట్టూ కథ తిరుగుతుందని చైతూ తెలిపాడు. విక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘థ్యాంక్ యు’ షూటింగ్ ఇంకో పది రోజులు మిగిలుందని.. అది త్వరలోనే పూర్తి చేస్తామని.. కొత్త ప్రాజెక్టుల కోసం కథలు వింటున్నానని చైతూ చెప్పాడు.
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…