దర్శకుడు శేఖర్ కమ్ముల తన కొత్త చిత్రం ‘లవ్ స్టోరి’ కోసమని రెండు క్లైమాక్స్లు చిత్రీకరించినట్లుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కుల వివక్ష, లింగ వివక్ష చుట్టూ తిరిగే సినిమా అన్న సంగతి తెలిసిందే. కులాంతర ప్రేమ, పెళ్ళిళ్ళ విషయంలో సొసైటీలో జరిగిన కొన్ని దారుణ ఘటనల స్ఫూర్తితో కమ్ముల ఈ సినిమా తీసినట్లుగా సంకేతాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి కథల విషయంలో తమిళ ఫిలిం మేకర్స్ తీరు వేరుగా ఉంటుంది. వాళ్లు హార్ట్ బ్రేకింగ్గా ఉండేలా క్లైమాక్స్లు తీర్చిదిద్దుతుంటారు. కమ్ముల స్టైల్ ప్రకారం చూస్తే ఈ సినిమా ముగింపు అలా ఉండే అవకాశం లేదు. కానీ ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేసి చూద్దామన్న ఉద్దేశంతో ఆయన ఒక పాజిటివ్ క్లైమాక్స్తో పాటు.. ట్రాజిక్ క్లైమాక్స్ కూడా తీశారనే ప్రచారం సాగింది. ఏ క్లైమాక్స్ను సినిమాలో ఉంచాలనే విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారనే విషయం సస్పెన్స్ అంటూ ఊహాగానాలు సాగాయి.
మరి ఈ రెండు క్లైమాక్స్ల కథేంటని హీరో నాగచైతన్యను అడిగితే.. ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాడు. సినిమా కోసం రెండు భిన్నమైన క్లైమాక్స్ల చిత్రీకరణ అంటూ ఏమీ చేయలేదని.. కాకపోతే ఒకసారి క్లైమాక్స్ తీశాక దానికి కొంచెం మెరుగులు దిద్దే ప్రయత్నం జరిగిందని ‘లవ్ స్టోరి’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన సందర్భంగా చైతూ చెప్పాడు. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చైతూ చెబుతూ.. ‘బంగార్రాజు’తో పాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అమేజాన్ కోసం ఒక హార్రర్ సిరీస్ చేస్తున్నట్లు వెల్లడించాడు.
ఐతే హార్రర్ సిరీస్ అయినప్పటికీ ఇందులో దయ్యం లాంటిదేమీ ఉండదని.. సూపర్ నేచురల్ పవర్ లాంటిది ఉంటుందని.. దాని చుట్టూ కథ తిరుగుతుందని చైతూ తెలిపాడు. విక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘థ్యాంక్ యు’ షూటింగ్ ఇంకో పది రోజులు మిగిలుందని.. అది త్వరలోనే పూర్తి చేస్తామని.. కొత్త ప్రాజెక్టుల కోసం కథలు వింటున్నానని చైతూ చెప్పాడు.
This post was last modified on September 23, 2021 4:26 pm
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…