Movie News

శిల్పా శెట్టి చెప్పకనే చెప్పేసిందా?


చాలా సాఫీగా సాగిపోతున్న బాలీవుడ్ భామ శిల్పా శెట్టి జీవితంలో ఈ ఏడాది భారీ కుదుపు ఎదురైంది. ఆమె భర్త రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు నిర్మిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొని అరెస్టవడంతో వారి కుటుంబం పరువు గంగ పాలైంది. ఇది శిల్పా మీద తీవ్ర ప్రభావమే చూపిందని స్పష్టమవుతోంది. ఈ కేసు విషయంలో భర్తను వెనకేసుకుని రాలేక.. మీడియాకు సమాధానం చెప్పలేక.. సొసైటీలో తలెత్తుకుని తిరగలేక ఆమె సతమతం అయిపోతోందని సన్నిహితులు అంటున్నారు.

కుంద్రా బాగోతం వల్ల శిల్పా చేస్తున్న షోలకు దూరం కావాల్సి వచ్చింది. అలాగే ఆమె చేతిలో ఉన్న కమర్షియల్ బ్రాండ్స్ పోయాయి. ఇంకా చాలా ఇబ్బందులే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె రాజ్ కుంద్రా నుంచి విడిపోవాలనుకుంటున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

కుంద్రా ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా తనకు తెలియదని.. తాను బిజీగా ఉన్న సమయంలో ఇవి జరిగాయని ఇటీవల శిల్పా మీడియాకు వెల్లడించడం తెలిసిందే. దీన్ని బట్టి ఆమె కుంద్రాను సమర్థించట్లేదన్నది స్పష్టమవుతోంది. అతడికి దూరంగా జరిగే ప్రయత్నమే చేస్తోందనిపిస్తోంది.

ఈ అభిప్రాయాలకు మరింత బలం చేకూరుస్తూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది శిల్పా. ఒక పుస్తకంలోని కోట్‌ను ఆమె ఇక్కడ ప్రస్తావించింది. “ఎవ్వరూ జీవితంలో వెనక్కి వెళ్లి కొత్త ప్రయాణాన్ని ఆరంభించలేరు. కానీ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టి.. సరైన ముగింపును ఇవ్వవచ్చు”.. ఇదీ శిల్పా షేర్ చేసిన కోట్. ఇది కచ్చితంగా రాజ్ కుంద్రాతో తన బంధం గురించి చెబుతున్న మాటే అని.. అతడితో బంధాన్ని తెంచుకోబోతున్నట్లుగా ఆమె సంకేతాలు ఇస్తోందని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. మరి త్వరలోనే శిల్పా తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందేమో చూడాలి.

This post was last modified on September 20, 2021 7:34 am

Share

Recent Posts

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

1 minute ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

1 hour ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

4 hours ago