Movie News

త‌మిళ బాహుబ‌లి పూర్త‌యింది

కొన్నేళ్ల ముందు వ‌ర‌కు బాలీవుడ్ త‌ర్వాత సినిమా క్వాలిటీ ప‌రంగా త‌మిళ సినిమాదే పైచేయిగా ఉండేది. అక్క‌డ వినూత్న‌మైన, ప్ర‌యోగాత్మ‌క‌ క‌థ‌లు తెర‌కెక్కేవి. అలాగే భారీ చిత్రాల జోరూ ఉండేది. త‌మిళంతో పోలిస్తే తెలుగు సినిమాలు వెనుక‌బ‌డే ఉండేవి. కానీ గ‌త ఐదారేళ్ల‌లో ప‌రిస్థితులు వేగంగా మారిపోయాయి. తెలుగు సినిమాల స్థాయి అమాంతం పెరిగిపోయింది. అదే స‌మ‌యంలో త‌మిళ చిత్రాలు వెనుక‌బ‌డిపోయాయి.

ముఖ్యంగా బాహుబ‌లి దెబ్బ‌కు కోలీవుడ్ కుదేలైపోయింద‌నే చెప్పాలి. ద‌క్షిణాదిన త‌మిళ చిత్రాల ఆధిప‌త్యానికి తెర‌దించింది ఆ చిత్ర‌మే. ఎప్పుడూ తెలుగులో త‌మిళ అనువాదాల జోరే చూసేవాళ్లం కానీ.. త‌మిళ బాక్సాఫీస్‌ను ఓ తెలుగు చిత్రం షేక్ చేయ‌డం బాహుబ‌లితోనే జ‌రిగింది. అది అక్క‌డి వాళ్ల‌కు అసూయ‌ను క‌లిగించింది. బాహుబ‌లికి దీటైన భారీ చిత్రం తీయాల‌ని అక్క‌డ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే జ‌రుగుతూ వ‌చ్చాయి. కానీ ఇప్ప‌టిదాకా ఏ సినిమా కూడా దాని ద‌రిదాపుల్లోకి రాలేదు.

ఐతే లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ఎప్ప‌ట్నుంచో కంటున్న భారీ క‌ల‌.. పొన్నియ‌న్ సెల్వ‌న్ గ‌త ఏడాదే ప‌ట్టాలెక్క‌డంతో మ‌ళ్లీ త‌మిళుల్లో ఆశ‌లు రేకెత్తాయి. విక్ర‌మ్, ఐశ్వ‌ర్యారాయ్, కార్తి, త్రిష‌, జ‌యం ర‌వి, శ‌ర‌త్ కుమార్‌, ప్ర‌కాష్ రాజ్.. ఇలా భారీ తారాగ‌ణంతో.. వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. త‌మిళంలో క‌ల్ట్ నావెల్‌గా పేరున్న పొన్నియ‌న్ సెల్వ‌న్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు మ‌ణిర‌త్నం. త‌మిళంలో ఇప్ప‌టిదాకా అత్య‌ధిక ఖ‌ర్చుతో తెర‌కెక్కిన సినిమా ఇది. బాహుబ‌లి త‌ర‌హాలోనే చారిత్ర‌క నేప‌థ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కించారు.

మ‌ణిర‌త్నం ఇలాంటి నేప‌థ్యంలో సుదీర్ఘ స‌మ‌యం వెచ్చించి ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ సినిమా తీయ‌డంతో అంచ‌నాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. మొద‌లుపెట్టిన రెండేళ్ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ఈ సినిమా పూర్త‌యింది. క‌రోనా క‌ష్టాల‌ను అధిగ‌మించి షూటింగ్ పూర్తి చేశాడు మ‌ణిర‌త్నం. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కోసం ఆరు నెల‌ల‌కు పైగా వెచ్చించ‌నున్నారు. 2022 వేస‌విలో పొన్నియ‌న్ సినిమా వివిధ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

This post was last modified on September 19, 2021 12:24 pm

Share

Recent Posts

300 కోట్లు దాటినా ఆనందం లేదు

అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…

23 minutes ago

కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో విజయసాయి రెడ్డి?

రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…

27 minutes ago

బండి పదవికి గండి పడనుందా

కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…

3 hours ago

స్థానికాల తరువాత మంత్రివర్గ మార్పులు తప్పవా?

మంత్రులు మౌనంగా ఉంటే స‌హించేది లేద‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రుల‌కు ఆయ‌న ఈ విష‌యంలో…

4 hours ago

వారణాసి కానుకలు… తప్పని షరతులు

ఇంకో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రానుంది. గుంటూరు కారం తర్వాత తన దర్శనం స్క్రీన్…

4 hours ago

సందీప్ కిషన్ కరికాల… 2 పార్టులు… నాలుగు నెలలు!

యువ కథానాయకుడు సందీప్ కిషన్ కెరీర్లో సక్సెస్ రేట్ తక్కువే అయినా.. అవకాశాలకేమీ లోటుండదు. ఎప్పుడూ చేతిలో రెండు మూడు…

4 hours ago