ఒకప్పుడు తమిళ దర్శకుడు శంకర్ పేరెత్తితే ఆయన అందుకున్న ఘనవిజయాలు.. ఆయన పెట్టించే భారీ బడ్జెట్లు.. ఆయన చేసే ప్రయోగాల గురించే చర్చ ఉండేది. కానీ ఈ మధ్య మాత్రం వివాదాలే గుర్తుకొస్తున్నాయి. వరుసగా ఆయన ప్రతి సినిమా వివాదంలో చిక్కుకుంటుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇండియన్-2 సినిమా గొడవ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
రూ.180 కోట్లు ఖర్చు పెట్టి 60 శాతం చిత్రీకరణ పూర్తి చేశాక ఆ సినిమా వివాదాల్లో చిక్కుకుని ముందుకు కదలకుండా ఆగిపోయింది. దీని తర్వాత శంకర్ అనౌన్స్ చేసిన అపరిచితుడు రీమేక్కు ఒరిజినల్ ప్రొడ్యూసర్ ఆస్కార్ రవిచంద్రన్ అడ్డు పడ్డాడు. దీనిపై కేసు నడుస్తోంది. ఇప్పుడేమో రామ్ చరణ్తో శంకర్ తీయబోతున్న సినిమాకు కూడా ఇప్పుడో వివాదం అంటుకుంది.
చిన్నస్వామి అనే తమిళ రచయిత.. చరణ్తో శంకర్ తీయబోయే సినిమా కథ తనదంటూ ఆరోపణలు చేస్తున్నాడు. ఈ మేరకు అతను తమిళ రచయితల సంఘానికి ఫిర్యాదు చేశాడు. విజయ్తో శంకర్ తీయాల్సిన ఓ సినిమా కోసం తాను ఓ కథ తయారు చేశానని.. ఆ సినిమా అనివార్య కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదని.. ఇప్పుడు ఆ కథనే శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ కాపీ కొట్టి రామ్ చరణ్తో సినిమా చేయడానికి రెడీ అయ్యారని అతను ఆరోపించాడు.
శంకర్తో కలిసి కార్తీక్ ఈ సినిమా స్క్రిప్టును తీర్చిదిద్దుతున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. చిన్నస్వామి.. శంకర్తో పాటు కార్తీక్ల మీద ఆరోపణలు చేయడంతో మీడియా దృష్టి దీనిపైకి మళ్లింది. మరి ఈ వివాదంపై శంకర్ ఏమని స్పందిస్తాడో చూడాలి. ఇంకో నాలుగైదు రోజుల్లో సెట్స్ మీదికి వెళ్లాల్సిన సినిమాకు ఈ గొడవ ఎక్కడ బ్రేక్ వేస్తుందో అని నిర్మాత దిల్ రాజు టెన్షన్లో ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on September 4, 2021 11:35 am
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…