కప్పుడు బాలీవుడ్ వాళ్ల వైభం చూసి మిగతా ఇండస్ట్రీలకు కన్ను కుట్టేది. వాళ్ల మార్కెట్ పరిధి చాలా ఎక్కువ కావడంతో బడ్జెట్లు, వసూళ్లు, పారితోషకాలు చాలా ఎక్కువగా ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు చాలా మారిపోయాయి. దక్షిణాది నుంచి వస్తున్న ప్రాంతీయ చిత్రాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతూ హిందీ చిత్రాలకు పెద్ద ముప్పుగా మారాయి.
బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాల తర్వాత సౌత్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాల సంఖ్య ఎలా పెరిగిపోయిందో తెలిసిందే. ఇదొక దెబ్బ అంటే.. కరోనా ప్రభావం నుంచి ఎంతకీ కోలుకోలేక బాలీవుడ్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
గత ఏడాదిన్నర వాళ్లకు థియేటర్ల నుంచి కనీస స్థాయిలో కూడా రెవెన్యూ రాలేదు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత కొన్ని సినిమాలు నామమాత్రంగా రిలీజయ్యాయి. వాటికి ఏమాత్రం ఆశాజనకమైన ఫలితం రాలేదు. సెకండ్ వేవ్ తర్వాత కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి.
ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యం చేసి బెల్ బాటమ్, చెహ్రె లాంటి పేరున్న చిత్రాలను రిలీజ్ చేస్తే వసూళ్లు దారుణంగా ఉన్నాయి. దీంతో రిలీజ్ రేసులో ఉన్న సూర్యవంశీ, 83 లాంటి చిత్రాలను బయటికి తీయడానికి నిర్మాతలు భయపడుతున్నారు. పరిస్థితులు మెరుగు పడేదాకా చూద్దాం లేదంటే ఓటీటీలో రిలీజ్ చేసేద్దామన్న ఆలోచనకు నిర్మాతలు వెళ్తున్నారు. కానీ నార్త్ మార్కెట్ ఎప్పుడు పుంజుకుంటుందన్నదే తెలియడం లేదు. అక్షయ్ కుమార్ సినిమా చూడనపుడు సల్మాన్ ఖానో.. ఆమిర్ ఖానో తమ చిత్రాలను థియేటర్లలో రిలీజ్ చేస్తే మాత్రం ప్రేక్షకులు వచ్చి చూస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ వాళ్ల చూపులు సౌత్ సినిమాలపై పడుతున్నాయి. రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ను సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేస్తే అదైనా ఉత్తరాది ప్రేక్షకులను కదిలిస్తుందేమో.. థియేటర్ల వైపు పరుగులు పెట్టిస్తుందేమో అన్న ఆశలు కలుగుతున్నాయి. ఐతే ఈ చిత్రం ముందు అనుకున్నట్లు అక్టోబరు 13న రిలీజయ్యేలా లేదు. నార్త్ మార్కెట్ పరిస్థితి చూసే ఈ చిత్రాన్ని దసరా రేసు నుంచి తప్పించేశారు. సంక్రాంతికో వేసవివో వాయిదా అంటున్నారు. కానీ బాలీవుడ్ వాళ్లు మాత్రం ఈ చిత్రం సాధ్యమైనంత త్వరగా రిలీజై ఉత్తరాది మార్కెట్లో ఊపు తెస్తుందనే ఆశతో ఉన్నారు. ‘కేజీఎఫ్-2’ మీదా ఆశలు పెట్టుకున్నారు కానీ.. ఆ చిత్రాన్ని 2022 వేసవికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…