పవన్ కళ్యాణ్కు రికార్డుల వేట కొత్తేమీ కాదు. కాకపోతే గత కొన్నేళ్లలో పవన్ జోరు కొంచెం తగ్గిపోయింది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ స్థాయికి తగ్గ మాస్ ఎంటర్టైనర్ రాలేదు. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయి పవన్ను రేసులో వెనక్కి నెట్టేశాయి. రాజకీయాల కోసం రెండేళ్లకు పైగా విరామం తీసుకుని ఆ తర్వాత పవన్ చేసిన‘వకీల్ సాబ్’.. బాక్సాఫీస్కు అంత అనుకూల పరిస్థితులు లేని టైంలో విడుదలై ఉన్నంతలో మంచి ఫలితాన్నే అందుకుంది కానీ.. రికార్డులైతే బద్దలు కొట్టలేకపోయింది.
ఐతే పవన్ ప్రస్తుతం నటిస్తున్న హరిహర వీరమల్లు, భీమ్లానాయక్ చిత్రాలు మళ్లీ పవన్ సత్తా ఏంటో బాక్సాఫీస్కు రుచి చూపిస్తాయనే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ‘భీమ్లా నాయక్’కు క్రేజ్ అలా ఇలా లేదు. ఈ మధ్యే రిలీజ్ చేసిన టీజర్ ఎలా ప్రకంపనలు రేపిందో తెలిసిందే. సంక్రాంతికి రాబోయే ఈ సినిమా కలెక్షన్లలో రికార్డులు నెలకొల్పేలాగే కనిపిస్తోంది.
ఈలోపు పవన్ సినిమా ఆడియో రికార్డుల పరంగా రికార్డు నెలకొల్పింది. ‘భీమ్లా నాయక్’ ఆడియో హక్కులు ఏకంగా రూ.5 కోట్లకు పైగా పలికి టాలీవుడ్లో కొత్త నాన్-బాహుబలి రికార్డుకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఆదిత్య మ్యూజిక్ ‘భీమ్లా నాయక్’ ఆడియో హక్కులను ఈ రికార్డు రేటుకు సొంతం చేసుకుందట. జస్ట్ ఒక టీజర్ వదిలి ఈ సినిమా క్రేజ్ను పతకా స్థాయికి తీసుకెళ్లింది చిత్ర బృందం. టీజర్లో తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంత హైలైట్ అయిందో తెలిసిందే.
తమన్ కొన్నేళ్లుగా సూపర్ ఫాంలో ఉండటం.. అతడి ప్రతి ఆడియో బ్లాక్బస్టర్ అవుతుండటంతో ‘భీమ్లా నాయక్’ ఆడియో మీదా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా నుంచి తొలి పాటను పవన్ పుట్టిన రోజు కానుకగా సెప్టెంబరు 2న రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అది ఒక జానపద గేయం అని అంటున్నారు. ఆ పాటతో సహా ‘భీమ్లా నాయక్’ ఆడియో మొత్తం అదిరిపోతుందనే చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 30, 2021 4:46 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…