ఒక పాత్ర కోసం ఐదు మందినో పది మందినో ఆడిషన్ చేయడం మామూలే. కానీ ఒక దర్శకుడు ఏకంగా 700 మందిని ఆడిషన్ చేసి.. అందులోంచి 24 మందిని ఎంపిక చేసుకోవడం.. వారికి కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చాక సినిమా మొదలుపెట్టడం అరుదైన విషయమే. ‘సీటీమార్’ కోసం ఇలాగే చేశానని అంటున్నాడు యువ దర్శకుడు సంపత్ నంది.
ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో సాగుతుందన్న సంగతి తెలిసిందే. కబడ్డీ మీద తనకు చిన్నప్పట్నుంచి ఆసక్తి ఉందని.. తాను కూడా కబడ్డీ ఆడానని.. ఐతే ప్రొ కబడ్డీ లీగ్ చూస్తున్నపుడు తనకు కబడ్డీ నేపథ్యంలో సినిమా తీయాలన్న ఆలోచన పుట్టిందని.. ఆ తర్వాత ‘సీటీమార్’ కథ రాశానని సంపత్ వెల్లడించాడు. ఐతే ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్లుగా కనిపించే 24 మందిని ఎంచుకోవడం పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదని ఓ ఇంటర్వ్యూలో అతను వెల్లడించాడు.
ఈ 24 మంది కోసం 700 మందిని ఆడిషన్ చేసినట్లు సంపత్ తెలిపాడు. నటన వచ్చి.. కబడ్డీ మీద అంతో ఇంతో అవగాహన ఉన్న వాళ్లను వెతికి పట్టుకోవడం చాలా కష్టమైందని అతను చెప్పాడు. చివరికి జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడిన నలుగురు క్రీడాకారుల్ని ఈ సినిమా కోసం తీసుకున్నామని.. వాళ్లకు మూడు నెలలు నటనలో శిక్షణ ఇప్పించి సినిమాలో నటింపజేశామని వెల్లడించాడు.
ఆడిషన్ పూర్తయ్యాక కబడ్డీ శిక్షణ కోసం మూణ్నాలుగు నెలలు కేటాయించామని.. గేమ్ గురించి లోతుగా తెలుసుకుని.. ఒక అథెంటిక్ స్పోర్ట్స్ మూవీలా ‘సీటీమార్’ను తీర్చిదిద్దడానికి ప్రయత్నించామని సంపత్ తెలిపాడు. ఐతే సినిమాలో కేవలం కబడ్డీ మాత్రమే ఉండదని… అంతకుమించి ఎమోషన్, యాక్షన్ ఉంటుందని అతనన్నాడు. తన కెరీర్లోనే ఎంతో కష్టపడి తీసిన చిత్రమిదని.. ‘సీటీమార్’ కచ్చితంగా ప్రేక్షకుల అంచనాల్ని మించి విజయం సాధిస్తుందని.. థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చాలా రోజులు ఎదురు చూసి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని సంపత్ చెప్పాడు.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…