ఒక పాత్ర కోసం ఐదు మందినో పది మందినో ఆడిషన్ చేయడం మామూలే. కానీ ఒక దర్శకుడు ఏకంగా 700 మందిని ఆడిషన్ చేసి.. అందులోంచి 24 మందిని ఎంపిక చేసుకోవడం.. వారికి కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చాక సినిమా మొదలుపెట్టడం అరుదైన విషయమే. ‘సీటీమార్’ కోసం ఇలాగే చేశానని అంటున్నాడు యువ దర్శకుడు సంపత్ నంది.
ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో సాగుతుందన్న సంగతి తెలిసిందే. కబడ్డీ మీద తనకు చిన్నప్పట్నుంచి ఆసక్తి ఉందని.. తాను కూడా కబడ్డీ ఆడానని.. ఐతే ప్రొ కబడ్డీ లీగ్ చూస్తున్నపుడు తనకు కబడ్డీ నేపథ్యంలో సినిమా తీయాలన్న ఆలోచన పుట్టిందని.. ఆ తర్వాత ‘సీటీమార్’ కథ రాశానని సంపత్ వెల్లడించాడు. ఐతే ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్లుగా కనిపించే 24 మందిని ఎంచుకోవడం పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదని ఓ ఇంటర్వ్యూలో అతను వెల్లడించాడు.
ఈ 24 మంది కోసం 700 మందిని ఆడిషన్ చేసినట్లు సంపత్ తెలిపాడు. నటన వచ్చి.. కబడ్డీ మీద అంతో ఇంతో అవగాహన ఉన్న వాళ్లను వెతికి పట్టుకోవడం చాలా కష్టమైందని అతను చెప్పాడు. చివరికి జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడిన నలుగురు క్రీడాకారుల్ని ఈ సినిమా కోసం తీసుకున్నామని.. వాళ్లకు మూడు నెలలు నటనలో శిక్షణ ఇప్పించి సినిమాలో నటింపజేశామని వెల్లడించాడు.
ఆడిషన్ పూర్తయ్యాక కబడ్డీ శిక్షణ కోసం మూణ్నాలుగు నెలలు కేటాయించామని.. గేమ్ గురించి లోతుగా తెలుసుకుని.. ఒక అథెంటిక్ స్పోర్ట్స్ మూవీలా ‘సీటీమార్’ను తీర్చిదిద్దడానికి ప్రయత్నించామని సంపత్ తెలిపాడు. ఐతే సినిమాలో కేవలం కబడ్డీ మాత్రమే ఉండదని… అంతకుమించి ఎమోషన్, యాక్షన్ ఉంటుందని అతనన్నాడు. తన కెరీర్లోనే ఎంతో కష్టపడి తీసిన చిత్రమిదని.. ‘సీటీమార్’ కచ్చితంగా ప్రేక్షకుల అంచనాల్ని మించి విజయం సాధిస్తుందని.. థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చాలా రోజులు ఎదురు చూసి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని సంపత్ చెప్పాడు.
సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక…
2024 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన విశ్వంభర టీజర్ మీద నెగటివ్ రియాక్షన్లు చాలా వచ్చాయి. ట్రోలింగ్ జరిగింది. దెబ్బకు…
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…