Political News

హుజూరాబాద్ దెబ్బ కేసీఆర్ మీద బాగా పడిందా ?

తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక దెబ్బకు కేసీఆర్ జనాల్లో తిరగాల్సొస్తోంది. మామూలుగా అయితే నెలల తరబడి సీఎం అసలు జనాల మొహమే చూడరు. కొన్ని నెలలపాటు సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అనుమానం లేకుండా కేసీయార్ పేరే చెబుతారు. మంత్రులకు, ఉన్నతాధికారులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరనే ప్రచారానికి కొదవేలేదు.

ఎంతోమంది మంత్రులు, ఉన్నతాధికారులు ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్ళి కేసీఆర్ తో మాట్లాడకుండానే వెనక్కు తిరిగివచ్చేశారట. దీనికి కారణం ఏమిటయ్యా అంటే సీఎం ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడకపోవటమే. మంత్రులతో ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడకుండా ఉంటే ఎలా అనే ప్రశ్న ఎవరు అడగకూడదు. అయినా కేసీయార్ కు హాయిగా అలా జరిగిపోతోందంతే. జనజీవన స్రవంతికి దూరంగా ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉంటున్న కేసీయార్ కు హుజూరాబాద్ ఉప ఎన్నిక పెద్ద సమస్యగా మారింది.

ఉప ఎన్నిక దెబ్బకు కేసీఆర్ ఇప్పటికే మూడు సార్లు బహిరంగ సభల్లో ప్రసంగించాల్సి వచ్చింది. తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. దళిత బంధు పథకాన్ని ప్రారంభించేందుకు కేసీయార్ వాసాలమర్రి సభలో పాల్గొన్నారు. తర్వాత హుజూరాబాద్ లో కూడా మరో సభలో పాల్గొన్నారు. మధ్యలో కూడా బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఇది కాకుండా పెద్దిరెడ్డి, కౌశిక్ రెడ్డి లాంటి కీలక నేతలు టిఆర్ఎస్ లో చేరుతున్నారని పార్టీ ఆఫీసులో కూడా నేతలతో సమావేశమయ్యారు. అంతగా కేసీయార్ ఎందుకు కష్టపడుతున్నారంటే, జానల్లో పదే పదే ఎందుకు తిరుగుతున్నారంటే కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవాలని మాత్రమే. తన సహజ శైలికి విరుద్ధంగా వెంటవెంటనే బహిరంగ సభల్లో పాల్గొనడం, పార్టీ నేతలతో సమావేశాలు పెట్టడంతోనే కేసీయార్లోని ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి హుజూరాబాద్ దెబ్బకు ఎప్పుడు లేనట్లు కేసీయార్ పదే పదే జనాల్లో కనబడుతున్నారు.

This post was last modified on August 27, 2021 8:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ జోగి రమేశ్ వంతు వచ్చేసింది!

వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…

2 hours ago

బావగారు వివాదం….సుడిగాలి సుధీర్ మెడకు

యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…

2 hours ago

ఫోటో : గాయపడ్డ పవన్ కుమారుడు ఇప్పుడిలా ఉన్నాడు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…

4 hours ago

కాకాణికి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్టు తప్పదా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…

4 hours ago

కన్నప్పకు కరెక్ట్ డేట్ దొరికింది

ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…

4 hours ago

తారక్ & రజని రెండుసార్లు తలపడతారా

ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…

4 hours ago