టాలీవుడ్లో బెస్ట్ ఫిజిక్ ఉన్న హీరోల్లో సుధీర్ బాబు ఒకడు. బేసిగ్గా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కావడంతో ముందు నుంచి సుధీర్ మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇక సినిమాల్లోకి వచ్చాక ఇంకా శ్రద్ధ పెట్టి కళ్లు చెదిరేలా బాడీని తీర్చిదిద్దుకున్నాడు. ‘బాగి’ సినిమాలో నటించేటపుడు బాలీవుడ్ నటులకు దీటుగా అతను బాడీ పెంచాడు. అక్కడి నుంచి తెలుగు సినిమాల్లో కూడా తన ‘ప్యాక్స్’ చూపిస్తున్నాడు.
‘వి’లో సుధీర్ చిజిల్డ్ బాడీ చూసి అందరూ వావ్ అనుకున్నారు. బహుశా తెలుగులో మరే నటుడికీ అలాంటి శరీరాకృతి లేదంటే అతిశయోక్తి కాదు. తన కొత్త చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’లోనూ సుధీర్ బేర్ బాడీతో కనిపించి ఆకట్టుకున్నాడు. ఐతే ఈ సినిమా ప్రమోషన్ల కోసం మీడియాను కలిసినపుడు ఫిజిక్.. ఫిట్నెస్ గురించి అడిగితే సుధీర్ ఒకింత అసహనానికి గురయ్యాడు. ప్రతిసారీ అదే అడుగుతుండటం ఇబ్బందిగా ఉందని సుధీర్ అన్నాడు.
“అందరూ నా ఫిజిక్ గురించే అడుగుతుంటే చిరాకొచ్చేస్తోంది. హీరో అన్నాక ఇలా ఉండాలి.. ఫిట్గా ఉండాలి అనుకునే ఇండస్ట్రీలోకి వచ్చాను. అందుకే ఇలా మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు అందరి ఫోకస్ దాని మీదే ఉంటోంది. దీనిపై ఒక ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేద్దామనుకుంటున్నా.. ఇక బొజ్జ పెంచుతున్నా అని. అప్పుడైనా నా నటన గురించి మాట్లాడతారేమో చూడాలి మరి’’ అని సుధీర్ అన్నాడు. సుధీర్ ఇలా ఫ్రస్టేట్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. మొదట్లో అతడి నటన గురించి అందరూ విమర్శలు చేసిన వాళ్లే. ఆ నెగెటివిటీనంతా పోగొట్టుకోవడానికి చాలానే కష్టపడ్డాడు సుధీర్.
‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ దగ్గర్నుంచి అతను నటుడిగా తనేంటో ప్రతిసారీ రుజువు చేస్తూనే ఉన్నాడు. సమ్మోహనం, నన్ను దోచుకుందువటే చిత్రాల్లోనూ చాలా బాగా నటించాడు. ‘శ్రీదేవి సోడా సెంటర్’లోనూ సుధీర్ అదరగొట్టినట్లే ఉన్నాడు. కానీ తన నటన కంటే ఫిజిక్ గురించి ఎక్కువ చర్చ జరుగుతుండటం సుధీర్కు నచ్చుతున్నట్లు లేదు.
This post was last modified on August 27, 2021 8:27 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…