ఎన్నో అంచనాలతో మూడేళ్ల కిందట మొదలైన ‘ఇండియన్-2’ పరిస్థితి ఎలా తయారైందో తెలిసిందే. కమల్ మేకప్ విషయంలో సమస్యలు తలెత్తడం, ఆయన రాజకీయ కమిట్మెంట్లు, అలాగే షూటింగ్లో జరిగిన భారీ క్రేన్ ప్రమాదం, కరోనా మహమ్మారి.. ఇలా రకరకాల కారణాల వల్ల ఆ చిత్రానికి బ్రేకులు పడ్డాయి. క్రేన్ ప్రమాదం తర్వాత నిర్మాతలతో హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్లకు తలెత్తిన విభేదాల వల్ల ఈ చిత్రం ముందుకే కదల్లేదు.
ఒక దశలో ఈ చిత్రం ఆగిపోయినట్లే అని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటికే రూ.180 కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు ఈ సినిమాను అటకెక్కించే సాహసం చేయలేకపోయారు. కానీ కమల్, శంకర్లతో వాళ్లకు తలెత్తిన విభేదాలు పరిష్కారం కాకపోవడంతో ఈ సినిమా తిరిగి పట్టాలెక్కలేకపోయింది. కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి అప్డేట్సే లేవు. శంకర్.. దీన్ని పక్కన పెట్టేసి రామ్ చరణ్ సినిమాను మొదలుపెట్టేస్తుండటంతో ‘ఇండియన్-2’ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ఐతే ఎట్టకేలకు ‘ఇండియన్-2’ గురించి ఒక సానుకూల వార్త బయటికి వచ్చింది. ఈ చిత్రం మధ్యలో ఆగిపోవడానికి ముఖ్య కారకుడిగా భావిస్తున్న కమల్ హాసనే ఈ అప్డేట్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియన్-2’ త్వరలోనే పున:ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటిదాకా 60 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. నిర్మాతలు, శంకర్తో మాట్లాడి విభేదాలు పరిష్కరించుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని కమల్ తెలిపాడు.
క్రేన్ ప్రమాద బాధితులను ఆదుకునే విషయంలో నిర్మాతలు సరిగా స్పందించలేదని, ఆ ప్రమాదం జరగడానికి నిర్మాతల నిర్లక్ష్యమే కారణమని కమల్ వాదనకు దిగి షూటింగ్ పున:ప్రారంభించలేదని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ చిత్రం గురించి ఎటూ తేల్చకుండానే ఆయన ‘విక్రమ్’ను మొదలుపెట్టేశారు. కాబట్టే శంకర్ కూడా చరణ్ చిత్రంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు కమలే స్వయంగా విభేదాలు పరిష్కరించడానికి చొరవ తీసుకుంటానని, విక్రమ్ అవ్వగానే ఇండియన్-2ను పున:ప్రారంభించేందుకు ప్రయత్నిస్తానని చెప్పడంతో సమస్య దాదాపు తీరిపోయేలాగే కనిపిస్తోంది.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…