ఎన్నో అంచనాలతో మూడేళ్ల కిందట మొదలైన ‘ఇండియన్-2’ పరిస్థితి ఎలా తయారైందో తెలిసిందే. కమల్ మేకప్ విషయంలో సమస్యలు తలెత్తడం, ఆయన రాజకీయ కమిట్మెంట్లు, అలాగే షూటింగ్లో జరిగిన భారీ క్రేన్ ప్రమాదం, కరోనా మహమ్మారి.. ఇలా రకరకాల కారణాల వల్ల ఆ చిత్రానికి బ్రేకులు పడ్డాయి. క్రేన్ ప్రమాదం తర్వాత నిర్మాతలతో హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్లకు తలెత్తిన విభేదాల వల్ల ఈ చిత్రం ముందుకే కదల్లేదు.
ఒక దశలో ఈ చిత్రం ఆగిపోయినట్లే అని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటికే రూ.180 కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు ఈ సినిమాను అటకెక్కించే సాహసం చేయలేకపోయారు. కానీ కమల్, శంకర్లతో వాళ్లకు తలెత్తిన విభేదాలు పరిష్కారం కాకపోవడంతో ఈ సినిమా తిరిగి పట్టాలెక్కలేకపోయింది. కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి అప్డేట్సే లేవు. శంకర్.. దీన్ని పక్కన పెట్టేసి రామ్ చరణ్ సినిమాను మొదలుపెట్టేస్తుండటంతో ‘ఇండియన్-2’ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ఐతే ఎట్టకేలకు ‘ఇండియన్-2’ గురించి ఒక సానుకూల వార్త బయటికి వచ్చింది. ఈ చిత్రం మధ్యలో ఆగిపోవడానికి ముఖ్య కారకుడిగా భావిస్తున్న కమల్ హాసనే ఈ అప్డేట్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియన్-2’ త్వరలోనే పున:ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటిదాకా 60 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. నిర్మాతలు, శంకర్తో మాట్లాడి విభేదాలు పరిష్కరించుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని కమల్ తెలిపాడు.
క్రేన్ ప్రమాద బాధితులను ఆదుకునే విషయంలో నిర్మాతలు సరిగా స్పందించలేదని, ఆ ప్రమాదం జరగడానికి నిర్మాతల నిర్లక్ష్యమే కారణమని కమల్ వాదనకు దిగి షూటింగ్ పున:ప్రారంభించలేదని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ చిత్రం గురించి ఎటూ తేల్చకుండానే ఆయన ‘విక్రమ్’ను మొదలుపెట్టేశారు. కాబట్టే శంకర్ కూడా చరణ్ చిత్రంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు కమలే స్వయంగా విభేదాలు పరిష్కరించడానికి చొరవ తీసుకుంటానని, విక్రమ్ అవ్వగానే ఇండియన్-2ను పున:ప్రారంభించేందుకు ప్రయత్నిస్తానని చెప్పడంతో సమస్య దాదాపు తీరిపోయేలాగే కనిపిస్తోంది.
This post was last modified on August 23, 2021 5:59 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…