ఎన్నో అంచనాలతో మూడేళ్ల కిందట మొదలైన ‘ఇండియన్-2’ పరిస్థితి ఎలా తయారైందో తెలిసిందే. కమల్ మేకప్ విషయంలో సమస్యలు తలెత్తడం, ఆయన రాజకీయ కమిట్మెంట్లు, అలాగే షూటింగ్లో జరిగిన భారీ క్రేన్ ప్రమాదం, కరోనా మహమ్మారి.. ఇలా రకరకాల కారణాల వల్ల ఆ చిత్రానికి బ్రేకులు పడ్డాయి. క్రేన్ ప్రమాదం తర్వాత నిర్మాతలతో హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్లకు తలెత్తిన విభేదాల వల్ల ఈ చిత్రం ముందుకే కదల్లేదు.
ఒక దశలో ఈ చిత్రం ఆగిపోయినట్లే అని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటికే రూ.180 కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు ఈ సినిమాను అటకెక్కించే సాహసం చేయలేకపోయారు. కానీ కమల్, శంకర్లతో వాళ్లకు తలెత్తిన విభేదాలు పరిష్కారం కాకపోవడంతో ఈ సినిమా తిరిగి పట్టాలెక్కలేకపోయింది. కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి అప్డేట్సే లేవు. శంకర్.. దీన్ని పక్కన పెట్టేసి రామ్ చరణ్ సినిమాను మొదలుపెట్టేస్తుండటంతో ‘ఇండియన్-2’ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ఐతే ఎట్టకేలకు ‘ఇండియన్-2’ గురించి ఒక సానుకూల వార్త బయటికి వచ్చింది. ఈ చిత్రం మధ్యలో ఆగిపోవడానికి ముఖ్య కారకుడిగా భావిస్తున్న కమల్ హాసనే ఈ అప్డేట్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియన్-2’ త్వరలోనే పున:ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటిదాకా 60 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. నిర్మాతలు, శంకర్తో మాట్లాడి విభేదాలు పరిష్కరించుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని కమల్ తెలిపాడు.
క్రేన్ ప్రమాద బాధితులను ఆదుకునే విషయంలో నిర్మాతలు సరిగా స్పందించలేదని, ఆ ప్రమాదం జరగడానికి నిర్మాతల నిర్లక్ష్యమే కారణమని కమల్ వాదనకు దిగి షూటింగ్ పున:ప్రారంభించలేదని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ చిత్రం గురించి ఎటూ తేల్చకుండానే ఆయన ‘విక్రమ్’ను మొదలుపెట్టేశారు. కాబట్టే శంకర్ కూడా చరణ్ చిత్రంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు కమలే స్వయంగా విభేదాలు పరిష్కరించడానికి చొరవ తీసుకుంటానని, విక్రమ్ అవ్వగానే ఇండియన్-2ను పున:ప్రారంభించేందుకు ప్రయత్నిస్తానని చెప్పడంతో సమస్య దాదాపు తీరిపోయేలాగే కనిపిస్తోంది.
This post was last modified on August 23, 2021 5:59 pm
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…