Movie News

త్రివిక్రమ్ అలా.. క్రిష్ ఇలా

ఒక సినిమాలో దర్శకుడిదే అత్యంత కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. సినిమా హిట్టయినా క్రెడిట్ దక్కేది దర్శకుడికే. అలాగే ఫ్లాపైనా ప్రధానంగా బాధ్యత వహించాల్సింది అతనే. ఐతే ఒక సినిమాకు అత్యంత కీలకమైంది మాత్రం కథే. ఆ కథను తయారు చేసే రచయితలకు సరైన గుర్తింపు ఇవ్వరనే అభిప్రాయం టాలీవుడ్లో బలంగా ఉంది. స్క్రిప్టులో అత్యంత కీలకంగా వ్యవహరించే వ్యక్తుల పేర్లు కొన్నిసార్లు పోస్టర్ల మీద కూడా కనిపించవు. టైటిల్ కార్డ్స్‌లో వారి పేర్లను ప్రస్తావించడానికి కూడా కొన్నిసార్లు దర్శకులు ఇష్టపడరు. ఇలాంటి ఉదంతాలు బోలెడు కనిపిస్తాయి.

ఐతే ఘోస్ట్ రైటర్ల సాయం తీసుకుని వాళ్లకు డబ్బులతో సరిపెట్టి రైటింగ్ క్రెడిట్ అంతా తీసుకోవడం మామూలే కానీ.. కొన్నిసార్లు కథకు స్ఫూర్తి ఏంటో అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా క్రెడిట్ ఇవ్వడానికి దర్శకులు ఇష్టపడరు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన త్రివిక్రమ్ కూడా ఓ సందర్భంలో ఇలా చేశాడు.

త్రివిక్రమ్ తీసిన ‘అఆ’ సినిమాకు ‘మీనా’ అనే నవల ఆధారం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ నవల ఆధారంగా ‘మీనా’ అనే సినిమా కూడా వచ్చింది. ఒకసారి ఆ సినిమా చూస్తే ‘అఆ’కు చాలా దగ్గరగా ఉండటం గమనించవచ్చు. ఐతే సినిమా మేకింగ్ దశలో ఉండగానే ‘అఆ’కు స్ఫూర్తి ‘మీనా’ అన్న విషయం బయటపడ్డా కూడా ఆ సినిమా టైటిల్ కార్డ్స్‌లో ఒరిజినల్ రైటర్ యద్దనపూడి సులోచనారాణికి క్రెడిట్ ఇవ్వలేదు త్రివిక్రమ్. రచన-దర్శకత్వం అంటూ పూర్తిగా తనే క్రెడిట్ తీసుకున్నాడు. దీనిపై తీవ్ర విమర్శలు రాగా.. సినిమా రిలీజయ్యాక ప్రెస్ మీట్ లో టెక్నికల్ రీజన్స్ వల్ల యద్దనపూడి పేరు టైటిల్ కార్డ్స్‌లో పడలేదంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు త్రివిక్రమ్.

ఐతే త్రివిక్రమ్ అప్పుడలా చేస్తే.. ఇప్పుడు మరో స్టార్ క్రిష్ మాత్రం తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తన కొత్త చిత్రం ‘కొండపొలం’ ఏ నవల ఆధారంగా తెరకెక్కిందో దాని రచయిత పేరును పోస్టర్ మీద వేశాడు. సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి అనే రాయలసీమ రచయిత రాసిన ‘కొండపొలం’ అనే నవలే ఈ చిత్రానికి ఆధారం. సినిమాకు కూడా నవల పేరు పెట్టడమే కాదు.. ‘A Sannapurddy venkatramireddy novel’ అంటూ ఘనంగా ఆయన పేరును పోస్టర్ మీద వేశారు. ఈ విషయంలో క్రిష్‌కు సెల్యూట్ చేయాల్సిందే. ఇలా మిగతా దర్శకులందరూ కూడా రచయితలకు రావాల్సిన క్రెడిట్‌ను ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

8 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

14 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

28 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago