Movie News

త్రివిక్రమ్ అలా.. క్రిష్ ఇలా

ఒక సినిమాలో దర్శకుడిదే అత్యంత కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. సినిమా హిట్టయినా క్రెడిట్ దక్కేది దర్శకుడికే. అలాగే ఫ్లాపైనా ప్రధానంగా బాధ్యత వహించాల్సింది అతనే. ఐతే ఒక సినిమాకు అత్యంత కీలకమైంది మాత్రం కథే. ఆ కథను తయారు చేసే రచయితలకు సరైన గుర్తింపు ఇవ్వరనే అభిప్రాయం టాలీవుడ్లో బలంగా ఉంది. స్క్రిప్టులో అత్యంత కీలకంగా వ్యవహరించే వ్యక్తుల పేర్లు కొన్నిసార్లు పోస్టర్ల మీద కూడా కనిపించవు. టైటిల్ కార్డ్స్‌లో వారి పేర్లను ప్రస్తావించడానికి కూడా కొన్నిసార్లు దర్శకులు ఇష్టపడరు. ఇలాంటి ఉదంతాలు బోలెడు కనిపిస్తాయి.

ఐతే ఘోస్ట్ రైటర్ల సాయం తీసుకుని వాళ్లకు డబ్బులతో సరిపెట్టి రైటింగ్ క్రెడిట్ అంతా తీసుకోవడం మామూలే కానీ.. కొన్నిసార్లు కథకు స్ఫూర్తి ఏంటో అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా క్రెడిట్ ఇవ్వడానికి దర్శకులు ఇష్టపడరు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన త్రివిక్రమ్ కూడా ఓ సందర్భంలో ఇలా చేశాడు.

త్రివిక్రమ్ తీసిన ‘అఆ’ సినిమాకు ‘మీనా’ అనే నవల ఆధారం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ నవల ఆధారంగా ‘మీనా’ అనే సినిమా కూడా వచ్చింది. ఒకసారి ఆ సినిమా చూస్తే ‘అఆ’కు చాలా దగ్గరగా ఉండటం గమనించవచ్చు. ఐతే సినిమా మేకింగ్ దశలో ఉండగానే ‘అఆ’కు స్ఫూర్తి ‘మీనా’ అన్న విషయం బయటపడ్డా కూడా ఆ సినిమా టైటిల్ కార్డ్స్‌లో ఒరిజినల్ రైటర్ యద్దనపూడి సులోచనారాణికి క్రెడిట్ ఇవ్వలేదు త్రివిక్రమ్. రచన-దర్శకత్వం అంటూ పూర్తిగా తనే క్రెడిట్ తీసుకున్నాడు. దీనిపై తీవ్ర విమర్శలు రాగా.. సినిమా రిలీజయ్యాక ప్రెస్ మీట్ లో టెక్నికల్ రీజన్స్ వల్ల యద్దనపూడి పేరు టైటిల్ కార్డ్స్‌లో పడలేదంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు త్రివిక్రమ్.

ఐతే త్రివిక్రమ్ అప్పుడలా చేస్తే.. ఇప్పుడు మరో స్టార్ క్రిష్ మాత్రం తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తన కొత్త చిత్రం ‘కొండపొలం’ ఏ నవల ఆధారంగా తెరకెక్కిందో దాని రచయిత పేరును పోస్టర్ మీద వేశాడు. సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి అనే రాయలసీమ రచయిత రాసిన ‘కొండపొలం’ అనే నవలే ఈ చిత్రానికి ఆధారం. సినిమాకు కూడా నవల పేరు పెట్టడమే కాదు.. ‘A Sannapurddy venkatramireddy novel’ అంటూ ఘనంగా ఆయన పేరును పోస్టర్ మీద వేశారు. ఈ విషయంలో క్రిష్‌కు సెల్యూట్ చేయాల్సిందే. ఇలా మిగతా దర్శకులందరూ కూడా రచయితలకు రావాల్సిన క్రెడిట్‌ను ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు.

Satya

Recent Posts

1500 కోట్ల భూ క‌బ్జా కేసు.. ప‌రారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. ఆపార్టీకి చెందిన నాయ‌కులు అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…

41 minutes ago

విజయవాడ మ్యాచులో బౌండరీ దాటాల్సిందే

పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…

1 hour ago

కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…

3 hours ago

క‌డ‌ప‌పైనే పసుపు సేన దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…

8 hours ago

జూన్ నెలలో విజయ్…….జూలైలో జూనియర్ విజయ్

కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…

9 hours ago

కెప్టెన్‌గా రిష‌బ్ పంత్ ఔట్‌

రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్ల‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం సొంత‌మైన ఆట‌గాడు రిష‌బ్ పంత్.…

9 hours ago