Political News

అందుకే రాహుల్ గాంధీని తీసుకొస్తానంటున్న రేవంత్‌

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత ఎంపీ రేవంత్ రెడ్డి య‌మ జోరుమీదున్నారు. అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకుని ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌తో రాష్ట్ర రాజ‌కీయాల్లో వేడి పుట్టించ‌డంతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో స‌రికొత్త ఉత్తేజాన్ని నింపుతున్నారు. స‌భలు, ర్యాలీల‌తో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. ఇలా వివిధ ర‌కాల కార్య‌క్ర‌మాల‌తో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న రేవంత్‌కు సొంత పార్టీ సీనియ‌ర్ల నుంచి మాత్రం ఇప్ప‌టికీ ఆశించిన స్థాయిలో మ‌ద్ద‌తు దొర‌క‌డం లేద‌నేది కాద‌న‌లేని వాస్త‌వ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ నియామ‌కాన్ని మొద‌టి నుంచి వ్య‌తిరేకించిన పార్టీలోని కొంత‌మంది సీనియ‌ర్ నాయ‌కులు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు, స‌భ‌లకు దూరంగానే ఉంటున్నారు. అయితే వీళ్ల‌ను దారిలోకి తెచ్చుకునేందుకు రేవంత్ ఓ ప్ర‌ణాళిక సిద్ధం చేశాడ‌ని స‌మాచారం.

ద‌ళిత‌, గిరిజ‌న దండోరా స‌భ‌ను ఉమ్మ‌డి జిల్లాల్లో నిర్వ‌హించేందుకు శ్రీకారం చుట్టిన రేవంత్ వ‌రంగ‌ల్ దండోరా స‌భ‌కు ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్ గాంధీని ర‌ప్పిస్తున్నారు. వ‌చ్చే నెల 10 నుంచి 17లోపు రాహుల్ ప‌ర్య‌ట‌న ఉండేలా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ విష‌యాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మాణిగం ఠాకూర్ కూడా ధృవీక‌రించారు. రాహుల్ గాంధీని ర‌ప్పించ‌డం ద్వారా రేవంత్‌కు రెండు ర‌కాలుగా ప్ర‌యోజ‌నాలు క‌లిగే అవ‌కాశం ఉన్న‌ట్లు విశ్లేష‌కులు అంటున్నారు. త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించుకునేందుకు ఈ స‌భ ఆయ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌నుంది. అదే స‌మ‌యంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న కాస్తో కూస్తో ఆద‌ర‌ణ‌ను పెంచుకునే వీలుంది.

మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీలోని రాష్ట్ర సీనియ‌ర్ నాయ‌కుల‌నూ దారిలోకి తెచ్చుకునేందు ఇది రేవంత్‌కు స‌రైన వేదిక‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్య‌క్షుడు అయ్యాక రేవంత్‌తో క‌లిసి వ‌చ్చేందుకు కొంత‌మంది సీనియ‌ర్ నాయ‌కులు సంసిద్ధంగా లేర‌నే వార్త‌లు వ‌చ్చాయి. కోమ‌టిరెడ్డి, జ‌గ్గారెడ్డి, ఉత్త‌మ కుమార్ రెడ్డి లాంటి నాయ‌కులు ఇంకా రేవంత్‌తో క‌లిసి ప‌నిచేసేందుకు ఆసక్తి చూపించ‌డం లేదు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు, స‌మావేశాల‌కు, స‌భ‌ల‌కు వాళ్లు దూరంగా ఉంటున్నారు.

ఇప్పుడు రాహుల్ గాంధీ వ‌రంగల్ వ‌స్తే ఈ నాయ‌కులంతా త‌ప్ప‌నిస‌రిగా స‌భ‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంది. ఇలా సీనియ‌ర్ల‌పై రేవంత్ పైచేయి సాధించిన‌ట్ల‌వుతుంద‌ని రాజ‌కీయ వేత్త‌లు అంటున్నారు. దీంతో రాహుల్ గాంధీ స‌భ‌తో ఇటు రాజ‌కీయంగా బ‌ల‌ప‌డ‌డంతో పాటు అటు పార్టీలోనూ మ‌రింత ప‌ట్టు పెంచుకునే దిశ‌గా రేవంత్ వ్యూహం ర‌చించార‌ని టాక్‌.

This post was last modified on August 20, 2021 2:44 pm

Share
Show comments

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

3 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

6 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

7 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

8 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

8 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

8 hours ago