Movie News

నష్టపోయాం.. కానీ ఆస్తులమ్ముకోలేదు-ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్య వారసత్వాన్నందుకుంటూ గాయకుడిగా మంచి పేరే సంపదించాడు ఎస్పీ చరణ్. ఐతే అతను మరీ ఎక్కువ పాటలేమీ పాడలేదు. కొన్నేళ్లు పాటలు పాడాక తమిళం లో నిర్మాతగా మారి సినిమాలు నిర్మించాడు. అతను ప్రొడ్యూస్ చేసిన చెన్నై-28, ఆరణ్య కాండం లాంటి చిత్రాలు క్లాసిక్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. కానీ అవి విడుదలైన సమయంలో అనుకున్నంత మేర డబ్బులు మాత్రం తెచ్చిపెట్టలేదు. ఇ

వి కాక చరణ్ నిర్మించిన వేరే చిత్రాలు అతడికి భారీగా నష్టాలు మిగిల్చాయి. దీంతో చరణ్ వల్ల బాలు కుటుంబం అప్పుల పాలైందని.. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో పడిందని అప్పట్లో మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. దీని గురించి అప్పుడు బాలు కానీ.. చరణ్ కానీ స్పందించలేదు. ఐతే తాజాగా చరణ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తమ గురించి అప్పట్లో జరిగిన ప్రచారంపై మాట్లాడాడు.

తాను ప్రొడ్యూస్ చేసిన సినిమాలతో నష్టాలు వచ్చిన మాట వాస్తవమే అని చరణ్ తెలిపాడు. చివరగా తాను నిర్మించిన ‘ఆరణ్య కాండం’కు మూడు జాతీయ అవార్డులు వచ్చాయని.. న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ పురస్కారం దక్కిందని.. కానీ ఈ సినిమాకు పేరు వచ్చినంతగా డబ్బులు రాలేదని చరణ్ చెప్పాడు. అదే టైంలో రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్, హ్యారిస్ జైరాజ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు తమ ఇళ్లలోనే మ్యూజిక్ స్టూడియోలు పెట్టుకోవడంతో తన తండ్రి పెట్టిన కోదండపాణి స్టూడియోస్‌‌కు ఆదాయం రావడం ఆగిపోయిందని చరణ్ తెలిపాడు. అందులో పని చేసే వారికి వేరే చోట ఉద్యోగాలు ఇప్పించి.. అందులోని పరికరాలను జెమిని స్టూడియోస్ వాళ్లుక ఇచ్చేశామని.. ఇది చూసి తాము ఆస్తులు అమ్ముకుంటున్నామని.. తన వల్ల బాలు దెబ్బ తిన్నారని మీడియాలో రాశారని చరణ్ అన్నాడు.

తాను ఆ సమయంలో గిల్టీగా ఫీలవుతుంటే.. నాన్నే తనను ఓదార్చారని.. ఎవరేమన్నా పట్టించుకోవద్దని అన్నారని చరణ్ చెప్పాడు. తర్వాత నాన్నతో కలిసి చేసిన స్టేజ్ షోలు ఆ బాధ నుంచి తనను బయటపడేశాయన్నాడు. త్వరలోనే తన తండ్రి స్థానంలో ‘పాడుతా తీయగా’ షోను నడిపించబోతున్నానని.. దీని కోసం పాత ఎపిసోడ్లు చూస్తూ ప్రిపేరవుతున్నానని చరణ్ వెల్లడించాడు.

This post was last modified on August 1, 2021 6:32 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

50 minutes ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

5 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

8 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

9 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

9 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

10 hours ago