రెండు దశాబ్దాల క్రితం హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు వేణు తొట్టెంపూడి ప్రేక్షకులను అలరించారు. తన కామెడీ టైమింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’, హనుమాన్ జంక్షన్’ లాంటి సినిమాలు వేణు కెరీర్ లో మంచి హిట్స్ గా నిలిచాయి. అయితే హీరోగా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు వేణు. చివరిగా ‘దమ్ము’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వేణు ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శరత్ మండవ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం వేణుని సంప్రదించినట్లు తెలుస్తోంది. పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండడంతో వేణు అంగీకరించారట. ఈ సినిమా గనుక క్లిక్ అయితే ఫ్యూచర్ లో వేణుని మరిన్ని సినిమాల్లో చూసే అవకాశం ఉంటుంది.
ఇక ఈ సినిమాలో రవితేజ సరసన ‘మజిలీ’లో సెకండ్ హీరోయిన్ గా నటించిన దివ్యంశ కౌశిక్ కనిపించనుంది. అలానే మలయాళ ముద్దుగుమ్మ రజిషాను మరో హీరోయిన్ గా తీసుకున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా కంటే ముందు రవితేజ నటించిన ‘ఖిలాడి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on July 29, 2021 1:42 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…