రెండు దశాబ్దాల క్రితం హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు వేణు తొట్టెంపూడి ప్రేక్షకులను అలరించారు. తన కామెడీ టైమింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’, హనుమాన్ జంక్షన్’ లాంటి సినిమాలు వేణు కెరీర్ లో మంచి హిట్స్ గా నిలిచాయి. అయితే హీరోగా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు వేణు. చివరిగా ‘దమ్ము’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వేణు ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శరత్ మండవ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం వేణుని సంప్రదించినట్లు తెలుస్తోంది. పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండడంతో వేణు అంగీకరించారట. ఈ సినిమా గనుక క్లిక్ అయితే ఫ్యూచర్ లో వేణుని మరిన్ని సినిమాల్లో చూసే అవకాశం ఉంటుంది.
ఇక ఈ సినిమాలో రవితేజ సరసన ‘మజిలీ’లో సెకండ్ హీరోయిన్ గా నటించిన దివ్యంశ కౌశిక్ కనిపించనుంది. అలానే మలయాళ ముద్దుగుమ్మ రజిషాను మరో హీరోయిన్ గా తీసుకున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా కంటే ముందు రవితేజ నటించిన ‘ఖిలాడి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on July 29, 2021 1:42 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…