రెండు దశాబ్దాల క్రితం హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు వేణు తొట్టెంపూడి ప్రేక్షకులను అలరించారు. తన కామెడీ టైమింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’, హనుమాన్ జంక్షన్’ లాంటి సినిమాలు వేణు కెరీర్ లో మంచి హిట్స్ గా నిలిచాయి. అయితే హీరోగా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు వేణు. చివరిగా ‘దమ్ము’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వేణు ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శరత్ మండవ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం వేణుని సంప్రదించినట్లు తెలుస్తోంది. పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండడంతో వేణు అంగీకరించారట. ఈ సినిమా గనుక క్లిక్ అయితే ఫ్యూచర్ లో వేణుని మరిన్ని సినిమాల్లో చూసే అవకాశం ఉంటుంది.
ఇక ఈ సినిమాలో రవితేజ సరసన ‘మజిలీ’లో సెకండ్ హీరోయిన్ గా నటించిన దివ్యంశ కౌశిక్ కనిపించనుంది. అలానే మలయాళ ముద్దుగుమ్మ రజిషాను మరో హీరోయిన్ గా తీసుకున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా కంటే ముందు రవితేజ నటించిన ‘ఖిలాడి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on July 29, 2021 1:42 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవడం సవాలుగా మారింది. తెలుగులో…
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…