రెండు దశాబ్దాల క్రితం హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు వేణు తొట్టెంపూడి ప్రేక్షకులను అలరించారు. తన కామెడీ టైమింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’, హనుమాన్ జంక్షన్’ లాంటి సినిమాలు వేణు కెరీర్ లో మంచి హిట్స్ గా నిలిచాయి. అయితే హీరోగా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు వేణు. చివరిగా ‘దమ్ము’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వేణు ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శరత్ మండవ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం వేణుని సంప్రదించినట్లు తెలుస్తోంది. పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండడంతో వేణు అంగీకరించారట. ఈ సినిమా గనుక క్లిక్ అయితే ఫ్యూచర్ లో వేణుని మరిన్ని సినిమాల్లో చూసే అవకాశం ఉంటుంది.
ఇక ఈ సినిమాలో రవితేజ సరసన ‘మజిలీ’లో సెకండ్ హీరోయిన్ గా నటించిన దివ్యంశ కౌశిక్ కనిపించనుంది. అలానే మలయాళ ముద్దుగుమ్మ రజిషాను మరో హీరోయిన్ గా తీసుకున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా కంటే ముందు రవితేజ నటించిన ‘ఖిలాడి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on July 29, 2021 1:42 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…