Movie News

రామోజీరావుకి మరో బాహుబలి అవుతుందా..?

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఈ సినిమాతో లాభ పడింది నిర్మాతలు మాత్రమే కాదు.. చాలా మంది ఉన్నారు. వారిలో ప్రముఖ నిర్మాత రామోజీరావు కూడా ఉన్నారు. ‘బాహుబలి’ సినిమా షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగింది.

గ్రాండియర్ లుక్ కోసం రాజమౌళి భారీ భారీ సెట్లను నిర్వహించారు. షూటింగ్ అయిపోయిన తరువాత టూరిస్ట్ ల కోసం ఆ సెట్స్ ను అలానే ఉంచేశారు. ఈ సినిమాలో రామోజీరావు కూడా పెట్టుబడులు పెట్టారని టాక్. లాభాల్లో ఆయనకు కూడా వాటా దక్కిందని చెబుతుంటారు.

సినిమా అంతా కూడా ఫిల్మ్ సిటీలోనే కాబట్టి.. రామోజీరావుకు బాగానే గిట్టుబాటు అయింది. దానికి తగ్గట్లుగానే రామోజీ తన ఛానెల్ లో ‘బాహుబలి’ సినిమాకి భారీ ప్రచారం కల్పించారు. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ మరొకటి రామోజీరావుకి దక్కింది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘ప్రాజెక్ట్ కె’ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాగాశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలోనే నిర్వహించనున్నారు. కొన్ని సన్నివేశాలు మాత్రం విదేశాల్లో తెరకెక్కించనున్నారు. దాదాపు తొంబై శాతం షూటింగ్ ఫిల్మ్ సిటీలోనే జరపనున్నారు.ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ మొత్తం ఫిల్మ్ సిటీలోనే వేయబోతున్నారు. యాభై శాతం సన్నివేశాలు సెట్ లో.. మిగిలిన పార్ట్ ను బ్లూ మ్యాట్ లో తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను 2023లో విడుదల చేయనున్నారు.

This post was last modified on July 27, 2021 7:59 am

Share
Show comments

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago