దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఈ సినిమాతో లాభ పడింది నిర్మాతలు మాత్రమే కాదు.. చాలా మంది ఉన్నారు. వారిలో ప్రముఖ నిర్మాత రామోజీరావు కూడా ఉన్నారు. ‘బాహుబలి’ సినిమా షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగింది.
గ్రాండియర్ లుక్ కోసం రాజమౌళి భారీ భారీ సెట్లను నిర్వహించారు. షూటింగ్ అయిపోయిన తరువాత టూరిస్ట్ ల కోసం ఆ సెట్స్ ను అలానే ఉంచేశారు. ఈ సినిమాలో రామోజీరావు కూడా పెట్టుబడులు పెట్టారని టాక్. లాభాల్లో ఆయనకు కూడా వాటా దక్కిందని చెబుతుంటారు.
సినిమా అంతా కూడా ఫిల్మ్ సిటీలోనే కాబట్టి.. రామోజీరావుకు బాగానే గిట్టుబాటు అయింది. దానికి తగ్గట్లుగానే రామోజీ తన ఛానెల్ లో ‘బాహుబలి’ సినిమాకి భారీ ప్రచారం కల్పించారు. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ మరొకటి రామోజీరావుకి దక్కింది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘ప్రాజెక్ట్ కె’ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాగాశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలోనే నిర్వహించనున్నారు. కొన్ని సన్నివేశాలు మాత్రం విదేశాల్లో తెరకెక్కించనున్నారు. దాదాపు తొంబై శాతం షూటింగ్ ఫిల్మ్ సిటీలోనే జరపనున్నారు.ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ మొత్తం ఫిల్మ్ సిటీలోనే వేయబోతున్నారు. యాభై శాతం సన్నివేశాలు సెట్ లో.. మిగిలిన పార్ట్ ను బ్లూ మ్యాట్ లో తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను 2023లో విడుదల చేయనున్నారు.
This post was last modified on July 27, 2021 7:59 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…