తెలుగు, తమిళ సినీ అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకోవడం కొత్తేమీ కాదు. ఓవైపు వాళ్ల భాషల్లో హీరోల అభిమానులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో పాటు వేరే భాషల వాళ్లు కవ్వించినపుడు ఒక భాషలోని హీరోల అభిమానులందరూ ఒక్కటైపోయి అవతలి వాళ్లను ఢీకొనడమూ మామూలే. మా హీరోలు గొప్పంటే మా హీరోలు గొప్ప అని ట్వీట్లు వేసుకుంటూ.. అవతలి హీరోలను కించపరుచుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు చిన్న సందర్భం వచ్చినా చాలు. ఇప్పుడు అలాంటి సందర్భమే వచ్చింది.
తమిళంలో ధనుష్ నటించిన ‘అసురన్’కు రీమేక్గా తెరకెక్కిన తెలుగు చిత్రం ‘నారప్ప’ అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కావడం తెలిసిందే. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. ఐతే ఇదే అదనుగా తమిళ అభిమానులు రెచ్చిపోతున్నారు. ‘అసురన్’ ముందు ‘నారప్ప’ నిలవలేకపోయాడని.. ధనుష్ లాగా పెర్ఫామ్ చేయలేకపోయాడని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి వెంకీ అభిమానులు దీటుగానే స్పందిస్తున్నారు. రెండు రోజులుగా ఈ గొడవ కొనసాగుతూనే ఉంది.
ఐతే ఈ గొడవలోకి ఇప్పుడు తెలుగు వారికీ చేరువైన తమిళ నటుడు సిద్దార్థ్ వచ్చాడు. ట్విట్టర్లో తెలుగు, తమిళ అభిమానులు తెగ కొట్టేసుకోవడం చూస్తున్నానని.. ఈ నేపథ్యంలో తనకో ఐడియా వచ్చిందని సిద్ధు అన్నాడు. నెట్ ఫ్లిక్స్ వాళ్లు ‘నెట్ ఫ్లిక్స్’ సౌత్ పేరుతో హ్యాండిల్ పెట్టారని.. సౌత్ పట్ల వారి చిన్నచూపుకు ఇది నిదర్శనమని.. మన దగ్గర నాలుగు భాషలుంటే.. నాలుగింటికి వేర్వేరుగా హ్యాండిల్స్ పెట్టకుండా హిందీ ముందు మనం తక్కువ అని చాటేలా ఇలా ‘సౌత్’ అంటూ అందరినీ ఒక గాటన కట్టేశారని.. ప్రస్తుతం ట్విట్టర్లో కొట్టేసుకుంటున్న తెలుగు, తమిళ అభిమానులు కుదిరితే దీని మీద పోరాడాలని సిద్ధు పిలునివ్వడం విశేషం.
This post was last modified on July 21, 2021 9:44 pm
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…