తెలుగు, తమిళ సినీ అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకోవడం కొత్తేమీ కాదు. ఓవైపు వాళ్ల భాషల్లో హీరోల అభిమానులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో పాటు వేరే భాషల వాళ్లు కవ్వించినపుడు ఒక భాషలోని హీరోల అభిమానులందరూ ఒక్కటైపోయి అవతలి వాళ్లను ఢీకొనడమూ మామూలే. మా హీరోలు గొప్పంటే మా హీరోలు గొప్ప అని ట్వీట్లు వేసుకుంటూ.. అవతలి హీరోలను కించపరుచుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు చిన్న సందర్భం వచ్చినా చాలు. ఇప్పుడు అలాంటి సందర్భమే వచ్చింది.
తమిళంలో ధనుష్ నటించిన ‘అసురన్’కు రీమేక్గా తెరకెక్కిన తెలుగు చిత్రం ‘నారప్ప’ అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కావడం తెలిసిందే. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. ఐతే ఇదే అదనుగా తమిళ అభిమానులు రెచ్చిపోతున్నారు. ‘అసురన్’ ముందు ‘నారప్ప’ నిలవలేకపోయాడని.. ధనుష్ లాగా పెర్ఫామ్ చేయలేకపోయాడని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి వెంకీ అభిమానులు దీటుగానే స్పందిస్తున్నారు. రెండు రోజులుగా ఈ గొడవ కొనసాగుతూనే ఉంది.
ఐతే ఈ గొడవలోకి ఇప్పుడు తెలుగు వారికీ చేరువైన తమిళ నటుడు సిద్దార్థ్ వచ్చాడు. ట్విట్టర్లో తెలుగు, తమిళ అభిమానులు తెగ కొట్టేసుకోవడం చూస్తున్నానని.. ఈ నేపథ్యంలో తనకో ఐడియా వచ్చిందని సిద్ధు అన్నాడు. నెట్ ఫ్లిక్స్ వాళ్లు ‘నెట్ ఫ్లిక్స్’ సౌత్ పేరుతో హ్యాండిల్ పెట్టారని.. సౌత్ పట్ల వారి చిన్నచూపుకు ఇది నిదర్శనమని.. మన దగ్గర నాలుగు భాషలుంటే.. నాలుగింటికి వేర్వేరుగా హ్యాండిల్స్ పెట్టకుండా హిందీ ముందు మనం తక్కువ అని చాటేలా ఇలా ‘సౌత్’ అంటూ అందరినీ ఒక గాటన కట్టేశారని.. ప్రస్తుతం ట్విట్టర్లో కొట్టేసుకుంటున్న తెలుగు, తమిళ అభిమానులు కుదిరితే దీని మీద పోరాడాలని సిద్ధు పిలునివ్వడం విశేషం.
This post was last modified on July 21, 2021 9:44 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…