ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా ఏఆర్ రెహ్మాన్ ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఆర్ రెహ్మాన్ ఎవరో తనకు తెలియదని బాలయ్య చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఏఆర్ రెహ్మాన్ కు ఆస్కార్ అవార్డు వచ్చినా.. ఆయనెవరో తనకు తెలియదని అన్నారు బాలయ్య.
”ఏదో పదేళ్లకు ఒకసారి హిట్స్ అందిస్తాడు.. ఆస్కార్ అవార్డ్ అంటారు.. అవన్నీ నేను పట్టించుకోను” అంటూ ఏఆర్ రెహ్మాన్ ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే 1993లో బాలయ్య నటించిన ‘నిప్పురవ్వ’ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడం గమనార్హం. సినిమాకి మొత్తం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయనే అందించారు.
ఇదే ఇంటర్వ్యూలో బాలయ్య అవార్డుల గురించి కూడా మాట్లాడారు. భారతరత్న అవార్డు తన తండ్రి ఎన్టీఆర్ కాలిగోరు, కాలి చెప్పుతో సమానమని అన్నారు. అవార్డు ఇచ్చిన వాళ్లకు గౌరవం కానీ ఆయనకు గౌరవం ఏంటి..? అంటూ ప్రశ్నించారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి తన కుటుంబం చేసిన కృషికి ఏ అవార్డు కూడా సరిపోదని అన్నారు. ఎన్టీఆర్ భారతరత్న కంటే గొప్పోడు అంటూ చెప్పుకొచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు బ్యానర్లలో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యారు.
This post was last modified on July 21, 2021 8:46 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…