ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా ఏఆర్ రెహ్మాన్ ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఆర్ రెహ్మాన్ ఎవరో తనకు తెలియదని బాలయ్య చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఏఆర్ రెహ్మాన్ కు ఆస్కార్ అవార్డు వచ్చినా.. ఆయనెవరో తనకు తెలియదని అన్నారు బాలయ్య.
”ఏదో పదేళ్లకు ఒకసారి హిట్స్ అందిస్తాడు.. ఆస్కార్ అవార్డ్ అంటారు.. అవన్నీ నేను పట్టించుకోను” అంటూ ఏఆర్ రెహ్మాన్ ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే 1993లో బాలయ్య నటించిన ‘నిప్పురవ్వ’ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడం గమనార్హం. సినిమాకి మొత్తం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయనే అందించారు.
ఇదే ఇంటర్వ్యూలో బాలయ్య అవార్డుల గురించి కూడా మాట్లాడారు. భారతరత్న అవార్డు తన తండ్రి ఎన్టీఆర్ కాలిగోరు, కాలి చెప్పుతో సమానమని అన్నారు. అవార్డు ఇచ్చిన వాళ్లకు గౌరవం కానీ ఆయనకు గౌరవం ఏంటి..? అంటూ ప్రశ్నించారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి తన కుటుంబం చేసిన కృషికి ఏ అవార్డు కూడా సరిపోదని అన్నారు. ఎన్టీఆర్ భారతరత్న కంటే గొప్పోడు అంటూ చెప్పుకొచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు బ్యానర్లలో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యారు.
This post was last modified on July 21, 2021 8:46 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…