టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ పూజాహెగ్డే వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతోంది. ఒక్కో సినిమాకి రెండున్నర నుండి మూడు కోట్లు తీసుకుంటున్న ఈ బ్యూటీని నిర్మాతలు ఏరికోరి మరీ తమ సినిమాల్లో ఎన్నుకుంటున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే చాలా బిజీగా ఉంది. ఓ పక్క టాలీవుడ్ మరోపక్క బాలీవుడ్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. రీసెంట్ గా కోలీవుడ్ లో విజయ్ తో ఓ సినిమా ఒప్పుకుంది.
ఈ సినిమాలు కాకుండా తాజాగా అమ్మడు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో పూజాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమా చేయబోతుంది పూజా. దీంతో పాటు తమిళ హీరో ధనుష్-వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఈ మూడు సినిమాల డేట్స్ చూసుకొని అప్పుడు నితిన్ సినిమాకి కాల్షీట్స్ ఇవ్వాలో లేదో నిర్ణయించుకుంది. మహేష్ బాబు సినిమా పూర్తయ్యేనాటికి పవన్ కళ్యాణ్ సినిమా మొదలవుతుంది. దీంతో పాటే సమాంతరంగా ధనుష్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ పూర్తి చేసేలోపు ఆమెకి మరిన్ని ఛాన్స్ లు రావడం ఖాయం. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లలో పాల్గొంటుంది. అలానే బాలీవుడ్ లో ‘సర్కస్’, ‘భాయ్ జాన్’ లాంటి సినిమాల్లో నటిస్తోంది.
This post was last modified on July 9, 2021 11:07 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…