టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ పూజాహెగ్డే వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతోంది. ఒక్కో సినిమాకి రెండున్నర నుండి మూడు కోట్లు తీసుకుంటున్న ఈ బ్యూటీని నిర్మాతలు ఏరికోరి మరీ తమ సినిమాల్లో ఎన్నుకుంటున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే చాలా బిజీగా ఉంది. ఓ పక్క టాలీవుడ్ మరోపక్క బాలీవుడ్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. రీసెంట్ గా కోలీవుడ్ లో విజయ్ తో ఓ సినిమా ఒప్పుకుంది.
ఈ సినిమాలు కాకుండా తాజాగా అమ్మడు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో పూజాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమా చేయబోతుంది పూజా. దీంతో పాటు తమిళ హీరో ధనుష్-వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఈ మూడు సినిమాల డేట్స్ చూసుకొని అప్పుడు నితిన్ సినిమాకి కాల్షీట్స్ ఇవ్వాలో లేదో నిర్ణయించుకుంది. మహేష్ బాబు సినిమా పూర్తయ్యేనాటికి పవన్ కళ్యాణ్ సినిమా మొదలవుతుంది. దీంతో పాటే సమాంతరంగా ధనుష్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ పూర్తి చేసేలోపు ఆమెకి మరిన్ని ఛాన్స్ లు రావడం ఖాయం. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లలో పాల్గొంటుంది. అలానే బాలీవుడ్ లో ‘సర్కస్’, ‘భాయ్ జాన్’ లాంటి సినిమాల్లో నటిస్తోంది.
This post was last modified on July 9, 2021 11:07 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…