Movie News

వెంకీ ఈ కాన్సెప్ట్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడో!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ‘కర్ణన్’, ‘జగమే తంత్రం’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ‘కర్ణన్’ సూపర్ హిట్ కాగా.. ‘జగమే తంత్రం’ నిరాశ పరిచింది. అయినప్పటికీ ధనుష్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మొదటినుండి కూడా సరికొత్త కథలను ఎన్నుకుంటూ తనలోని ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇప్పటివరకు కోలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ధనుష్.. ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.

రీసెంట్ గా ఆయన టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే ధనుష్ మరో సినిమాకి అడ్వాన్స్ తీసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో ధనుష్ ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. ‘తొలి ప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం.

కథ కూడా ఓకే అయిపోయిందని సమాచారం. వెంకీ అట్లూరి ఇప్పటివరకు ప్రేమకథలను మాత్రమే తెరకెక్కించారు. అయితే ధనుష్ కోసం మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకున్నారట. విద్యా వ్యవస్థకు సంబంధించిన నేపథ్యంలో ఈ కథ ఉంటుందని.. ప్రస్తుతం ఈ వ్యస్థలో ఉన్న లోపాలను ఎండగట్టే విధంగా సినిమాను రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ధనుష్ పాత్ర చాలా సీరియస్ ఎమోషన్స్ తో సాగుతుందని అంటున్నారు. దీన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో తీయాలనుకుంటున్నారు. కానీ వెంకీ అట్లూరి లాంటి యంగ్ డైరెక్టర్ ఈ కాన్సెప్ట్ ను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి!

This post was last modified on July 3, 2021 3:15 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

5 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

6 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

9 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

12 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

13 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

14 hours ago