కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ‘కర్ణన్’, ‘జగమే తంత్రం’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ‘కర్ణన్’ సూపర్ హిట్ కాగా.. ‘జగమే తంత్రం’ నిరాశ పరిచింది. అయినప్పటికీ ధనుష్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మొదటినుండి కూడా సరికొత్త కథలను ఎన్నుకుంటూ తనలోని ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇప్పటివరకు కోలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ధనుష్.. ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.
రీసెంట్ గా ఆయన టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే ధనుష్ మరో సినిమాకి అడ్వాన్స్ తీసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో ధనుష్ ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. ‘తొలి ప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం.
కథ కూడా ఓకే అయిపోయిందని సమాచారం. వెంకీ అట్లూరి ఇప్పటివరకు ప్రేమకథలను మాత్రమే తెరకెక్కించారు. అయితే ధనుష్ కోసం మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకున్నారట. విద్యా వ్యవస్థకు సంబంధించిన నేపథ్యంలో ఈ కథ ఉంటుందని.. ప్రస్తుతం ఈ వ్యస్థలో ఉన్న లోపాలను ఎండగట్టే విధంగా సినిమాను రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ధనుష్ పాత్ర చాలా సీరియస్ ఎమోషన్స్ తో సాగుతుందని అంటున్నారు. దీన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో తీయాలనుకుంటున్నారు. కానీ వెంకీ అట్లూరి లాంటి యంగ్ డైరెక్టర్ ఈ కాన్సెప్ట్ ను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి!
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…