కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ‘కర్ణన్’, ‘జగమే తంత్రం’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ‘కర్ణన్’ సూపర్ హిట్ కాగా.. ‘జగమే తంత్రం’ నిరాశ పరిచింది. అయినప్పటికీ ధనుష్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మొదటినుండి కూడా సరికొత్త కథలను ఎన్నుకుంటూ తనలోని ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇప్పటివరకు కోలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ధనుష్.. ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.
రీసెంట్ గా ఆయన టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే ధనుష్ మరో సినిమాకి అడ్వాన్స్ తీసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో ధనుష్ ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. ‘తొలి ప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం.
కథ కూడా ఓకే అయిపోయిందని సమాచారం. వెంకీ అట్లూరి ఇప్పటివరకు ప్రేమకథలను మాత్రమే తెరకెక్కించారు. అయితే ధనుష్ కోసం మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకున్నారట. విద్యా వ్యవస్థకు సంబంధించిన నేపథ్యంలో ఈ కథ ఉంటుందని.. ప్రస్తుతం ఈ వ్యస్థలో ఉన్న లోపాలను ఎండగట్టే విధంగా సినిమాను రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ధనుష్ పాత్ర చాలా సీరియస్ ఎమోషన్స్ తో సాగుతుందని అంటున్నారు. దీన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో తీయాలనుకుంటున్నారు. కానీ వెంకీ అట్లూరి లాంటి యంగ్ డైరెక్టర్ ఈ కాన్సెప్ట్ ను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి!
This post was last modified on July 3, 2021 3:15 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…