Movie News

కొత్త ‘హీరో’ పనికొస్తాడా?


టాలీవుడ్లోకి మరో యంగ్ హీరో అడుగు పెడుతున్నాడు. ఆ కుర్రాడి పేరు.. గల్లా అశోక్. టీడీపీ ఎంపీ, వ్యాపారవేత్త గల్లా జయదేవ్ కొడుకితను. మహేష్ బాబుకు మేనల్లుడు అవుతాడు. గత ఏడాదే అశోక్ తెరంగేట్రం గురించి ప్రకటించారు. సినిమాను మొదలుపెట్టారు. ఐతే కరోనా కారణంగా ఆ సినిమా అనుకున్న స్థాయిలో ముందుకు కదల్లేకపోయింది. త్వరలోనే సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తూ టీజర్ వదిలారు.

ఈ సినిమాకు ‘హీరో’ అనే టైటిల్ ఖరారు చేశారు. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమాల టైటిళ్లను ఈ మధ్య యంగ్ హీరోలు బాగా వాడేసుకుంటున్న సంగతి తెలిసిందే. చిరు సినిమా టైటిల్ అయిన ‘హీరో’ను ఇంతకుముందే నితిన్ వాడుకోగా.. ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు అశోక్ చిత్రానికి ‘హీరో’ అని పెట్టుకున్నారు.

కొంచెం బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చే హీరో తొలి సినిమా అన్నాక ఫోకస్ అంతా లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, హావభావాలు ఎలా ఉన్నాయనే అందరూ చూస్తారు. ప్రోమోల్లో కూడా ఫోకస్ అదే ఉంటుంది. ‘హీరో’ విషయానికి వస్తే దీని కథేంటన్నది టీజర్లో పెద్దగా రివీల్ చేయలేదు. కొన్ని ఆసక్తికర షాట్స్ తీసుకుని అలా అలా చూపిస్తూ వెళ్లారు. ఫోకస్ అంతా అశోక్ మీదే నిలిచింది. ‘జోకర్’ సినిమాలో హీరో తరహా లుక్‌లో కనిపిస్తూ అదే మాదిరి హావభావాలు ఇచ్చే చోట అశోక్ ఆకట్టుకున్నాడు. టీజర్లో ఎక్కువ ఆసక్తి రేకెత్తించిన విషయం ఇదే. కథ కూడా దీని చుట్టూ ఏమైనా తిరుగుతుందేమో తెలియదు. కానీ టీజర్లో మాత్రం సంబంధిత షాట్లు హైలైట్ అయ్యాయి. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌ లాగే ‘హీరో’ను తీర్చిదిద్దే ప్రయత్నం జరిగినట్లుంది. టీజర్ వరకు అయితే అశోక్‌కు పాస్ మార్కులు పడతాయి.

This post was last modified on June 23, 2021 10:43 pm

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

46 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago