ఒకే ఒక్క సినిమాతో ఒక హీరో ఇమేజ్ మారిపోయిన ఉదంతాలు చాలా చూసి ఉంటాం. ఐతే ‘బాహుబలి’తో ప్రభాస్కు వచ్చిన ఇమేజ్ మాత్రం అసాధారణమైంది. ఇలాంటి రైజ్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇంత వరకు చూసి ఉండం అంటే అతిశయోక్తి కాదు. ‘బాహుబలి’తో ప్రభాస్ మార్కెట్, అతడి సినిమాల బడ్జెట్, అలాగే బిజినెస్ పది రెట్లకు పెరగడం అసామాన్యం. ఇప్పుడు ప్రభాస్ను నమ్మి 400-500 కోట్ల దాకా బడ్జెట్ల పెట్టేస్తున్నారు నిర్మాతలు.
అతడి ఇమేజ్ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలే కాదు.. కంపెనీలు కూుడా క్యూ కట్టేస్తున్నాయి. అతడి క్రేజ్ను తమ బ్రాండ్ల ప్రచారానికి వాడుకోవాలని చూస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్లకు దీటుగా పారితోషకాలు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నాయి. కానీ ప్రభాసే ఆ దిశగా అంతగా ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. ‘బాహుబలి’ తర్వాత ఒక్క మహీంద్రా ప్రకటనలో మినహా మరెందులోనూ అతను కనిపించలేదు.
ఐతే గత రెండేళ్లలో ప్రభాస్ బోలెడన్ని బ్రాండ్లను తిరస్కరించాడని.. అందువల్ల దాదాపు రూ.150 కోట్ల ఆదాయాన్ని వదులుకున్నాడని బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు వార్తలు వస్తుంటడం విశేషం. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే తరహా ఆలోచనలు ప్రభాస్ చేయట్లేదని.. ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్కు పని చేసి ఇమేజ్ను దెబ్బ తీసుకోదల్చుకోలేదని.. పైగా ప్రధానంగా తన ఫోకస్ అంతా సినిమాల మీదే పెట్టాలని ప్రభాస్ భావించాడని.. అందుకే ప్రకటనల్లో నటించడానికి అతను ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది.
కారణాలేవైనా కానీ.. ప్రభాస్ రూ.150 కోట్ల ఆదాయం వదులుకోవడం అన్నది ఇప్పుడు బాలీవుడ్లోనూ చర్చనీయాంశంగా మారింది. అతడి రేంజ్ గురించి కూడా అక్కడ చర్చించుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్లు రెండంకెల సంఖ్యలో బ్రాండ్లకు ప్రచారం చేస్తుంటారు. సినిమాల్లో వచ్చే ఆదాయం కంటే ఈ మార్గంలోనే వారికి ఎక్కువ ఆదాయం వస్తుంటుంది.
This post was last modified on June 23, 2021 10:37 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…