ఒకే ఒక్క సినిమాతో ఒక హీరో ఇమేజ్ మారిపోయిన ఉదంతాలు చాలా చూసి ఉంటాం. ఐతే ‘బాహుబలి’తో ప్రభాస్కు వచ్చిన ఇమేజ్ మాత్రం అసాధారణమైంది. ఇలాంటి రైజ్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇంత వరకు చూసి ఉండం అంటే అతిశయోక్తి కాదు. ‘బాహుబలి’తో ప్రభాస్ మార్కెట్, అతడి సినిమాల బడ్జెట్, అలాగే బిజినెస్ పది రెట్లకు పెరగడం అసామాన్యం. ఇప్పుడు ప్రభాస్ను నమ్మి 400-500 కోట్ల దాకా బడ్జెట్ల పెట్టేస్తున్నారు నిర్మాతలు.
అతడి ఇమేజ్ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలే కాదు.. కంపెనీలు కూుడా క్యూ కట్టేస్తున్నాయి. అతడి క్రేజ్ను తమ బ్రాండ్ల ప్రచారానికి వాడుకోవాలని చూస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్లకు దీటుగా పారితోషకాలు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నాయి. కానీ ప్రభాసే ఆ దిశగా అంతగా ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. ‘బాహుబలి’ తర్వాత ఒక్క మహీంద్రా ప్రకటనలో మినహా మరెందులోనూ అతను కనిపించలేదు.
ఐతే గత రెండేళ్లలో ప్రభాస్ బోలెడన్ని బ్రాండ్లను తిరస్కరించాడని.. అందువల్ల దాదాపు రూ.150 కోట్ల ఆదాయాన్ని వదులుకున్నాడని బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు వార్తలు వస్తుంటడం విశేషం. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే తరహా ఆలోచనలు ప్రభాస్ చేయట్లేదని.. ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్కు పని చేసి ఇమేజ్ను దెబ్బ తీసుకోదల్చుకోలేదని.. పైగా ప్రధానంగా తన ఫోకస్ అంతా సినిమాల మీదే పెట్టాలని ప్రభాస్ భావించాడని.. అందుకే ప్రకటనల్లో నటించడానికి అతను ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది.
కారణాలేవైనా కానీ.. ప్రభాస్ రూ.150 కోట్ల ఆదాయం వదులుకోవడం అన్నది ఇప్పుడు బాలీవుడ్లోనూ చర్చనీయాంశంగా మారింది. అతడి రేంజ్ గురించి కూడా అక్కడ చర్చించుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్లు రెండంకెల సంఖ్యలో బ్రాండ్లకు ప్రచారం చేస్తుంటారు. సినిమాల్లో వచ్చే ఆదాయం కంటే ఈ మార్గంలోనే వారికి ఎక్కువ ఆదాయం వస్తుంటుంది.
This post was last modified on June 23, 2021 10:37 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…